ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధానిపై తెలుగు రాష్ర్టాల ముఖ్యమంత్రుల మధ్య ఆసక్తికరమైన చర్చ జరిగింది. రాజధాని విషయంలో చంద్రబాబుకు కేసీఆర్ చిన్న సలహా ఇచ్చారట. రాజధానివున్న ప్రాంతంలో ఉత్తరం నుంచి నది ప్రవహిస్తే మంచిదని అన్నారట.
ఈ తరహా నగరాలన్నీ ఎంతో అభివృద్ధి చెందాయని చెప్పుకొచ్చారు. ఏ ప్రాంతమైతే బాగుంటుందని కేసీఆర్ను చంద్రబాబు అడిగారు. అమరావతి, మంగళగిరి ప్రాంతాల మధ్య వుంటే బాగుంటుందని కేసీఆర్ అన్నట్లు నేతలంటున్నారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు రాజధాని విషయంలో మరోసారి ఆలోచనలోపడినట్టు పొలిటికల్ సర్కిల్స్లో టాక్ నడుస్తోంది.
ఆంద్ర రాజధాని విషయంలో కెసిఆర్ జోక్యం అనవసరం. చంద్రబాబు మర్యాద కోసం అడిగినా "అన్నీ మీకు తెలుసు, మీరే నిర్ణయించండి" అంటే సరిపోయేది.
ReplyDelete