CSS Drop Down Menu

Tuesday, June 30, 2015

"చిలుక మనిషిలా ఎలా మాట్లాడగలదో" కనిపెట్టేసారు!

సినిమాల్లోనూ, చిలక జోస్యం చెప్పేవారి దగ్గర కూడా రామచిలుకలు చిన్నచిన్న మాటలు మాట్లాడటం చూసే ఉంటాం. కొంతమంది ఇళ్లలో అయితే పెంపుడు చిలుకలు ఏకంగా మనం ఏది మాట్లాడితే అది కూడా అలాగే మాట్లాడేస్తుంది. కాకపోతే స్పష్టత లేకపోయినప్పటికీ ధ్వని మాత్రం మనం చెప్పిన మాటలను పోలి ఉంటుంది. అసలు రామచిలుక మనిషిలా ఎలా మాట్లాడగలుగుతోంది...? మిగిలిన జీవరాశులు మనిషిలా మాట్లాడలేకపోతున్నాయి కదా.
 
  వీటికి మాత్రమే అంత తెలివి ఎక్కడిది... ఎలా మాట్లాడగలుగుతున్నాయి అనే ప్రశ్నలపై అధ్యయనకారులు ఎప్పటి నుంచో పరిశోధనలు చేస్తూనే ఉన్నారు. ఈమధ్య నెథర్లాండ్స్, డెన్మార్కులకు చెందిన కొందరు పరిశోధకులు దీనిపై చేసిన పరిశోధనల్లో అసలు సంగతేమిటో వెలుగుచూసిందట. అదేమంటే... రామచిలుకల మెదడు ఇతర పక్షుల మాదిరి కాకుండా కొంత వైవిధ్యంగా ఉన్నట్లు కనుగొన్నారు. 
 
నిజానికి రామచిలుక మెదడు గురించి ఎన్నో ఏళ్ల క్రితం తెలుసుకున్నప్పటికీ, చిలుక ఎలా మాట్లాడగలుగుతుందనే కోణంలో దానిని పరిశీలించలేదు. తాజాగా ఈ కోణంలో పరిశీలించిన పరిశోధకులకు కొన్ని ఆసక్తికర అంశాలు బయటకు వచ్చాయట. మనిషి చెప్పే మాటలను గ్రహించే శక్తి చిలుక మెదడుకు ఉన్నట్లు కనుగొన్నారు. అందువల్లనే చిలుక మనం మాట్లాడే మాటలను తిరిగి మాట్లాడగలుగుతుందని చెపుతున్నారు.
 


Monday, June 29, 2015

తెలంగాణ సిఎం కేసీఆర్ ను ఏడ్పించిందెవరు?

వారు మాట్లాడే ఒక్కొక్క మాట ఆయన గుండెలు పిండేశాయి. వారు మాట్లాడుతుంటే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావుకు ఏడుపు తన్నుకొచ్చింది. అయినా బిగబట్టుకున్నారు. ఆయనను అంతగా ఏడ్పించిన వారెవరు..? అంత ధైర్యం ఎవరికుంది అనే అనుమానం వెంటనే కలుగుతుంది. ఇలా ఆయనను ఏడ్పించిన వారు ఇద్దరు అనాథ పిల్లలు.. వారి తెలివితేటలు చూసి అబ్బురపడిన ఆయన మరుక్షణమే మేము అనాథలం అనే మాట విని కేసీఆర్ తట్టుకోలేకపోయారు. వస్తున్న ఏడుపును నిలబెట్టుకున్నారు. ఈ సంఘటనను మంగళవారం ఆయన స్వయంగా తెలిపారు. వివరాలిలా ఉన్నాయి. 
 
గజ్వేలు నియోజకవర్గంలో ఓ కార్యక్రమానికి వెళ్లారు. అక్కడో ఇద్దరు అమ్మాయిలు గణితంలో ఏది అడిగినా టకటకా సమాధానాలిచ్చారు. అబాకస్‌లో అద్భుత ప్రతిభ కనబరిచారు. కార్యక్రమం ముగిశాక వాళ్లిద్దరూ కేసీఆర్ దగ్గరికొచ్చి రెండు చేతులు జోడించి నమస్కారం పెట్టి, ‘సార్... మేము పదో తరగతి చదువుకుంటున్నాం. తర్వాత ఏమి చేయాలో తెలియడం లేదు. మేము అనాధలం. మాకెవరూ లేరు సార్..’ అన్నారు. 
 
అనాధలం అనే మాట ఆ చిన్నారుల నోటి నుంచి రావడంతో తనకు దుఃఖం వచ్చిందనీ, తన కళ్లల్లో నీళ్లు తిరిగాయనీ, బాగుండదని ఏడుపు ఆపుకొన్నానని ఆయనే స్వయంగా చెప్పారు. ఇప్పటికీ ఆ పిల్లలు నా కళ్లల్లో మెదులుతున్నారు అనాధలమని చెప్పుకొనే స్థితి రావడం తన మనసును కలిచివేసిందని సీఎం కె.చంద్రశేఖర్ రావు ఉద్వేగంగా మాట్లాడారు. మంగళవారం అనాధ పిల్లల చదువు, వసతి తదితర అంశాలపై సచివాలయంలో ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. 
 
పదో తరగతి తర్వాత అనాధ పిల్లలకు ఇంటిగ్రేటేడ్ రెసిడెన్షియల్ స్కూళ్లు తెరవాలని అధికారులకు సీఎం సూచించారు. మొదటి రెసిడెన్షియల్ స్కూల్‌ను యాదగిరిగుట్టలో ప్రారంభించాలని, ఈ స్కూల్ శంకుస్థాపనకు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని ఆహ్వానించాలని ముఖ్యమంత్రి చెప్పారు. అనాధ పిల్లల భవిష్యత్తుకు ఏం చేయాలనే అంశాలను అధ్యయనం చేసేందుకు నియమించిన మంత్రివర్గ ఉప సంఘం వీలైనంత తొందరగా నివేదిక ఇవ్వాలని సూచించారు. 


Saturday, June 27, 2015

"బిడ్డ కోసం పాముతోనే ‘యుద్ధం’ చేసిన తల్లి"

ముంగిస, పాముల పోరాటం సాధారణమే. అయితే.. ముంగిస కథ పక్కనబెడితే.. ఓ కుందేలు ఆరడుగులపైగా పొడవున్న నల్లతాచుతో చేసిన పోరాటం మాత్రం అసాధారణం.. తన పిల్లలను కబళిస్తున్న ఓ తాచును తల్లి కుందేలు ధైర్యంగా ఎదుర్కొంది. 

ఆ కుందేలు బారినుంచి తప్పించుకునేందుకు ఆ తాచు ఎంతగా ప్రయత్నించినా ఫలితంలేకపోయింది. వీటిమధ్య ‘యుద్ధం’ సుమారు అరగంటపైగా సాగింది. చివరకు కుందేలు దాడిని ఎదుర్కోలేక తాచు పలాయనం చిత్తగించింది. 
నెట్‌లో ఈ వీడియో హల్‌చల్ సృష్టించింది.



Friday, June 26, 2015

"యాభై ఏళ్ళ"నుంచి తల్లిగర్భంలోనే "బిడ్డ"

యాభై ఏళ్ళనుంచి తల్లిగర్భంలోనే ఉండిపోయిన బిడ్డను డాక్టర్లు గమనించి బయటకు తీశారు. వివరాల్లోకి వెళితే...
 చిలీలోని శాన్ అంటోనియా సిటికి చెందిన హాప్పిటల్‌‌‌‌‌‌కు వచ్చిన 92 సంవ త్సరాల మహిళకు ఎక్స్‌‌‌రే తీశారు. దానిని పరిశీలిస్తే ఆమె గర్భంలో నాలుగు పౌండ్ల బరువుండి బాగా ఎదిగిన గర్భస్థ పిండాన్ని కనుగొన్నారు. అయితే అది మృతి చెందిఉన్నట్టు గమనించారు.
 ఎదిగిన పిండం గర్భంలోనే ఇలా గట్టిగా మారిపోవడాన్ని వైద్య పరిభాషలో ‘లిథోపిడియన్’ లేదా ‘స్టోన్ బేబీ’ అని పిలుస్తారని వైద్యులు తెలిపారు. మెడికల్ హిస్టరీలో ఇప్పటిదాకా ఇటువంటివి 300 కేసులు రిజిస్టర్ అయినట్టు డాక్టర్లుచెబుతున్నారు.


Tuesday, June 23, 2015

వ్యాయామం ఎక్కువైతే ప్రమాదమే ?

మనషి శరారీనికి వ్యాయామం ఎంతో మేలు చేస్తుందనే విషయం అందరికీ తెలిసిందే. ప్రతి రోజు అర గంట నుంచి ఒక గంట పాటు వ్యాయం చేయడం వలన హుషారుగా ఉండడమే కాకుండా ఆరోగ్యంగానూ ఉంటారు. అయితే అదే వ్యాయామం అధికమైతే మాత్రం ప్రమాదమేనట. ఆస్ట్రేలియాకు చెందిన ఆరోగ్య నిపుణులు ఇటీవల మనిషి వ్యాయామంపై పరిశోధనలు చేసి నివేదికను వెల్లడించారు. 
 
దాని ఆధారంగా చూస్తే.. వ్యాయామం అధికంగా చేయడం వలన ప్రేగుల నుంచి విడుదలయ్యే హానికర బ్యాక్టీరియా రక్తంలో కలుస్తుందని, ఇది ప్రమాదకరమని తెలుస్తోంది. ఈ బ్యాక్టీరియా అధిక మొత్తంలో రక్తంలో కలవడం వల్ల వ్యాధి నిరోధక శక్తికి ప్రతిబంధకాలు ఏర్పడతాయట. పూర్తి ఆరోగ్యవంతులపై పరిశోధనలు జరిపి ఈ వివరాలను వెల్లడించారు. కాబట్టి వ్యాయం కూడా మితంగా చేయడం మంచిదన్నమాట.
 


Monday, June 22, 2015

ఎవరు బెటర్? దీర్ఘాలోచనలో బాబు ?

 ఎన్నికల కమిషన్ తెలంగాణ ఏసీబీని గో అహెడ్ అన్నట్లు వార్తలు వచ్చిన దగ్గర్నుంచి తెలుగుదేశం పార్టీ వెన్నులో వణుకు పుడుతోందన్న ప్రచారం జరుగుతోంది. చంద్రబాబు మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నారనీ, కార్యకర్తలు, నాయకులలో మనోస్థైయిర్యం దెబ్బ తినకుండా ఉండేందుకు ప్రయత్నిస్తున్నారని అంటున్నారు. మరోవైపు ఓటుకు నోటు వ్యవహారంలో తనను తెలంగాణ ఏసీబీ అదుపులోకి తీసుకొంటే? అనే ప్రశ్న ఆయనను వెంటాడుతోందని భోగట్టా. కేసీఆర్‌కు నోటీసులు ఇవ్వడం ఆయనను విచారించడం తరువాతి సంగతి. తాను ఏసీబీకి సంజాయిషి ఇవ్వాల్సి వస్తే...? బాబు రాజీనామా చేయక తప్పదు. అప్పుడు సిఎం ఎవరు? దీనిపై బాబు ఓ వైపు ఆలోచనలు చేస్తున్నట్లు సమాచారం. భార్య భువనేశ్వరిని రంగంలోకి దింపితే ఎలా ఉంటుందనే విషయాన్ని పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.

ఎన్ని నోటీసులు వచ్చినా లెక్కజేయం అంటూ అచ్చెన్నాయుడు వంటి వారు ప్రకటనలు చేస్తున్నా.. బాబు మాత్రం రాజీనామా చేసే అంశాన్ని కొట్టేయలేదని తెలుస్తోంది. ఎందుకంటే కాపాడాల్సిన కేంద్ర ప్రభుత్వం సుష్మ స్వరాజ్, వసుంధరా రాజె సంఘటనతో పీకల్లోతు కష్టాల్లో ఇరుక్కుపోయింది.ఇప్పటికిప్పుడు భారతీయ జనతా పార్టీ పెద్దగా ఇటువైపు చూసే అవకాశం లేదు. మరోవైపు ఈసీ ఇప్పటికే తెలంగాణ ఏసీబీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిందని అంటున్నారు. దీంతో ఏ సమయంలోనైనా ఏసీబీ నోటీసులు ఇవ్వవచ్చు. ఇలాంటి పరిస్థితులలో రాజీనామా ఖాయం అనే ప్రచారం జరుగుతోంది.
మరి బాబు రాజీనామా చేస్తే తదుపరి ముఖ్యమంత్రి ఎవరు? అశోక్ గజపతి రాజు, నారాయణ, బాలకృష్ణ.. వంటి వారి పేర్లు వినిపించినా.. వారెవరూ కాదు, నారా భువనేశ్వరిని ప్రిపేర్ చేస్తున్నారట. గతంలో బీహార్ లల్లూ సంఘటనను పరిగణలోకి తీసుకుని చంద్రబాబు భార్య నారా భువనేశ్వరినే ముఖ్యమంత్రిగా నిలబెట్టే అవకాశం ఉందనే వాదనలు వినబడుతున్నాయి. లోకేష్‌ను పెడితే సీనియర్లుకు గుర్రు.. పోనీ బాలకృష్ణను పెడదామంటే ఈ రాజకీయాలలో తట్టుకోగలరా.. అనేది అనుమానం. అశోక్ గజపతి రాజు పేరు వినిపిస్తున్నా.. ఆయనకంటే బెటర్ క్యాండిడేట్ తన భార్య భువనేశ్వరే అనే భావనకు వచ్చినట్లు చెపుతున్నారు.

ఎన్టీఆర్ కూతురు.. బాలయ్యకు అక్క.. తనకు భార్య ఇలా అన్ని సెంటిమెంట్లు కలిసి వస్తాయి. అందుకే బాబు ఆమెనే గద్దెనెక్కించాలని అనుకొంటున్నారని సమాచారం. మరి బాబు ఎప్పుడు రాజీనామా చేస్తారనే అంశం ప్రస్తావనకు వచ్చినప్పుడు నోటీసులకు ముందు కావచ్చు.. నోటీసుల తరువాత కావచ్చు.. రాజకీయ అనుకూలత, లబ్ధిని అనుసరించి నిర్ణయం తీసుకుంటారట. చూద్దాం... ఈ ప్రచారాల పరంపర ఎంతవరకు వెళుతుందో...?

Saturday, June 20, 2015

"యోగా" చేస్తున్న "కుక్కలు"

యోగా మనుష్యులే కాదు మేము కూడా చేయగలమని నిరూపిస్తున్నాయి ఈ పెంపుడు జంతువులయిన కుక్కలు. ఈ క్రింది చిత్రాలు చూస్తే నిజమేనని మీరే  నమ్ముతారు. 













Friday, June 19, 2015

మీ ఆండ్రాయిడ్ ఫోన్‌ను మీరే రిపేర్ చేసుకునేందుకు సింపుల్ చిట్కాలు !


1) ఇంటర్నల్ మెమరీ తక్కువుగా ఉందా?
పరిష్కారం: ఫోన్‌లో పేరుకుపోయి ఉన్న బ్రౌజింగ్ హిస్టరీతో పాటు క్యాచీలను తొలగించటం ద్వారా ఫోన్ ఇంటర్నల్ మెమరీని పెంచుకోవచ్చు.

2) బ్లూటూత్ పని చేయటం లేదా?
పరిష్కారం: ఫోన్‌ను స్విచ్ ఆఫ్ చేసి రిస్టార్ట్ చేయటం ద్వారా సమస్య పరిష్కారమయ్యే అవకాశముంది. బ్లూటూత్ షేర్ క్యాచీని తొలగించటం ద్వారా బ్లూటూత్ అంతరాయం లేకుండా పనిచేస్తుంది.

3) బ్యాటరీ బ్యాకప్ త్వరగా తగ్గిపోతోందా?
 పరిష్కారం: ఫోన్‌లోని కనెక్టువిటీ ఫీచర్లుతో పాటు బ్యాక్ గ్రౌండ్ అప్లికేషన్‌లను నిలిపి వేయటం ద్వారా బ్యాటరీ బ్యాకప్‌ను పెంచుకోవచ్చు.

4)  ఆండ్రాయిడ్ ఫోన్ మెమరీ కార్డును గుర్తించటం లేదా?
 పరిష్కారం: సదరు మెమరీ కార్డును ఫార్మాట్ చేయటం ద్వారా సమస్య పరిష్కారమవుతుంది. ఇలా చేయాలంటే.. Go to settings > Storage > Format SD card > Ok


5) ఫోన్ సిమ్‌కార్డ్‌‌ను గుర్తించటం లేదా?
 పరిష్కారం: ముందుగా వేరే సిమ్‌లను వేసి ప్రయత్నించిండి. ఒకవేళ సమస్య మీ సిమ్ కార్డ్‌లో ఉంటే పరిష్కరించుకోవచ్చు. మీరు అడాప్టర్‌తో కూడిన మైక్రోసిమ్‌ను వినియోగిస్తున్నట్లయితే నానో సిమ్‌గా మార్చి ప్రయత్నించండి.

6) కెమెరా స్టార్ట్ అవటం లేదా?
 పరిష్కారం: ముందుగా సెట్టింగ్స్‌లోని యాప్స్ మెనూలోకి ప్రవేశించి కెమెరా యాప్‌ను సెలక్ట్ చేసుకోండి. కెమెరా యాప్ ఓపెన్ అయిన తరువాత ‘Force stop' ‘clear data', ‘clear cache' ఆప్షన్‌లను ‘Apply' చేయండి. చాట్ మెసెంజర్స్ వంటి థర్డ్ పార్టీ యాప్స్ కూడా ఈ సమస్యకు కారణం కావచ్చు. కాబట్టి కెమెరాను యాప్‌ను రీఇన్‌స్టాల్ చేసే ముందు ఓసారి వాటిని తొలగించి చూడండి. సమస్యకు పరిష్కారం లభించవచ్చు.

7) బ్యాటరీ చార్జ్ అవటనాకి ఎక్కువ సమయం పడుతోందా?
 పరిష్కారం: మీ ఆండ్రాయిడ్ ఫోన్‌లోని బ్యాటరీ పూర్తిగా చార్జ్ అవటానికి ఎక్కువ సమయం తీసకుంటుందా..? అయితే ఇది హార్డ్‌వేర్ సమస్యే, చార్జర్‌కు సంబంధించిన యూఎస్బీ కేబుల్‌ను మార్చటం ద్వారా ఈ సమస్యను పరిష్కరించవచ్చు.

8) ఫోన్ హ్యాంగ్ అయిన సమయంలో ఏం చేయాలి ?
 పరిష్కారం: రీస్టార్ట్ చేయటం ద్వారా ఫోన్ ను సాధారణ స్థితికి తీసుకురావచ్చు. తరచూ ఇలాను జరుగుతున్నట్లయితే ఖచ్చితంగా ఫోన్ సాఫ్ట్‌వేర్‌ను అప్‌డేట్ చేయవల్సిందే.











Wednesday, June 17, 2015

మీరు "ఇష్టపడే ఐస్ క్రీం"ను బట్టి మీ "వ్యక్తిత్వం" తెలిసిపోతుంది ?

మనిషి వ్యక్తిత్వాన్ని నిర్ణయించేందుకు ఇన్నాళ్లు జాతకాలు, పంచాంగాలు చూసేవారు. తాజాగా వ్యక్తి ఇష్టపడే తినే ఐస్ క్రీం‌ను బట్టి కూడా ఆ వ్యక్తి ఎటువంటి వాడు, అతని గుణం, స్వభావం ఎలాంటిది, అనే విషయాలను తెలుసుకోవచ్చునట. ఈ విషయం వెబ్‌ సైట్‌లలో హల్‌చల్ చేస్తున్న ఈ ఆర్టికల్‌ను బట్టి తెలుస్తుంది. సాధారణంగా ఐస్ క్రీం ఇష్టపడని వారుండరంటే అతిశయోక్తి కాదు. ప్రస్తుతం ఇష్టపడి తినే ఆహార పదార్థాల జాబితాలో టాప్-5లో ఐస్ క్రీం తప్పనిసరిగా ఉండి తీరుతుంది. అది ఏ ఫ్లేవరైనా కావచ్చు. 
 
అయితే, ఇష్టమైన ఐస్ క్రీం ఫ్లేవర్ ఏంటో చెబితే, వారు ఎలాంటివారో తెలిసిపోతుందట. మీరు వెనీలా ఇష్టపడే వారైతే కొత్త ప్రయోగాలు చేసేందుకు ఉత్సుకత చూపుతారట. జీవితానికి ఇంకేదో జోడించాలనే తాపత్రయం మీలో ఉంటుందట. చిన్న చిన్న విజయాలకు పెద్ద ఆత్మసంతృప్తిని పొందుతారట.
 ఇక చాక్లెట్ ఫ్లేవర్ ఇష్టపడే వారుగా ఉంటే తనకు మించి మరెవరూ లేనట్లు భావిస్తుంటారట. అంతే కాకుండా అటువంటి వారు ఎప్పుడూ చాలా స్మార్ట్‌గా, అందంగా కనిపించడానికి, చుట్టూ ఉన్నవారు ఇష్టపడేలా ఉండాలని కోరుకుంటారట. 

కాఫీ ఫ్లేవర్ ఇష్టపడేవారు కొత్త కొత్త పనులు మొదలు పెట్టడానికి ఇష్టపడుతుంటారట. అయితే వాటిని పూర్తి చెయ్యడంలో మాత్రం అలసత్వం చూపుతారట.
 ఇక స్ట్రాబెరీ ఇష్టమైతే, ఎల్లప్పుడూ ప్రశాంతంగా కనిపిస్తారట. ప్రపంచంతో సంబంధం లేకుండా తమదైన జీవనం గడుపుతూ, రిజర్వుడుగా, కాస్తంత సిగ్గుపడుతూ, ఇష్టమైన నేతను అనుసరిస్తూ ఉంటారట.
 
బటర్ స్కాచ్ ఇష్టపడుతున్నట్లయితే, తోటివారందరితో పోలిస్తే, కనీసం ఒక్కసారన్నా 'బెస్ట్' అనిపించుకుంటారట. హార్డ్ వర్క్ చేస్తూ ఉంటారట. ఫోన్ల ద్వారా మెసేజ్ పెట్టడం కంటే, ఒకసారి స్వయంగా మాట్లాడితేనే మేలు కలుగుతుందని భావిస్తారట.
 ఇందులో ఎంత మాత్రం నిజముందో తెలియదుగానీ, నెటిజన్లు మాత్రం మీడియాలో వెలువడిన ఈ ఆర్టికల్‌ను చూసి తమకు తాముగా పరీక్షించుకుంటున్నారు. మీరు ట్రై చేయండి.


Tuesday, June 16, 2015

తండ్రయితే బంపర్ ఆఫర్ ! ఏడాది సెలవు, 25 శాతం జీతం !!

మన దేశంలో సాధారణంగా ఉద్యోగం చేసే మహిళలకు ప్రసవం కోసం మెటర్నటీ లీవ్ ఇస్తారు. అయితే ఆ దేశంలో మాత్రం పురుషుడు తండ్రయితే బంపర్ ఆఫర్ తగిలినట్టే, ఏడాది సెలవు ఇవ్వడంతో పాటు 20 శాతం జీతం కూడా సంస్థ తిరిగి ఇస్తుంది. వివరాల్లోకి వెళితే.. యూకేలోని ‘వర్జిన్' అనే సంస్థ మాత్రం మగవాళ్లకు బంపర్ ఆఫర్ ఇస్తోంది. తండ్రి అయితే పూర్తి జీతంతో కూడిన ఏడాది సెలవు మంజూరు చేయాలని నిర్ణయించింది. 
 
అయితే అందుకు ఆ సంస్థలో నాలుగేళ్ల సర్వీసు పూర్తి చేసి ఉండాలని అర్హతను నిర్ణయించింది. యూకేలోని వర్జిన్ గ్రూప్‌‌కు చెందిన ఇన్వెస్ట్‌మెంట్ అండ్ బ్రాండ్ లైసెన్సింగ్ సంస్థ ఉంది. ఈ సంస్థకు యూకేతోపాటు ఇతర దేశాల్లో కూడా శాఖలు ఉన్నాయి. సుమారు 50వేల మంది ఉద్యోగులు సంస్థలో పని చేస్తున్నారు.
 
అయితే యూనైటెడ్ కింగ్‌డమ్, జెనీవా శాఖల్లో పనిచేసే ఉద్యోగులకు మాత్రమే ఈ ఆఫర్‌ను వర్తింపజేస్తూ కంపెనీ నిర్ణయం తీసుకుంది. వీరిలో నాలుగేళ్ల సర్వీసు లేకపోయినా, కనీసం రెండు సంవత్సరాల కాలం అయినా పని చేసి ఉండాలి. అలా రెండేళ్లు పనిచేసిన ఉద్యోగులకు ఏడాది సెలవు, 25శాతం జీతం చెల్లించనున్నట్లు సంస్థ తెలిపింది. 
 
కేవలం బిడ్డల్ని కంటేనే కాదట, దత్తత తీసుకున్నా ఈ సెలవు, జీతం వర్తిస్తాయని సంస్థ ప్రకటించడం కొసమెరుపు. తండ్రి అయిన తర్వాత ఇంటి నుంచి బయటకు రావాలంటే చాలా బాధగా ఉంటుందని, ఆ బాధను తాను అనుభవించానని, అలాంటి బాధ తన సంస్థలో పని చేసే ఉద్యోగులు అనుభవించకూడదనే ఈ ఆఫర్ ఇచ్చినట్లు వర్జిన్ గ్రూప్ అధినేత బ్రాన్సన్ తెలిపారు.


Monday, June 15, 2015

"పేరు" తోనే "బొమ్మ"
















   

లైంగిక సామర్థ్యం పెరగాలంటే ?

మానసిక ఒత్తిడి క్షణ క్షణానికి ఎక్కువ అవుతున్న ఈ రోజుల్లో లైంగిక సామర్థ్యం ప్రశ్నార్థకంగా మారుతోంది. చాలా సంసారాలు చిన్నాభిన్నమవుతున్నాయి. ఇలాంటి సమయంలో లైంగిక సామర్థ్యాన్ని పెంచుకోవడానికి తిండిలో మార్పులు చేసుకోవాలని వాటి ద్వారా మాత్రమే ఆ.. సామార్థ్యం పెరుగుతుందని శాస్త్రవేత్తలు బల్లగుద్ది చెబుతున్నారు. 
 
పురుషులలో శక్తిని పెంచడానికి ముఖ్యంగా విటమిన్‌ ఇ చాలా ఉపయోగపడుతుంది. లైంగిక సామర్థ్యం తక్కువగా ఉన్న వారు ప్రతి రోజు మంచి ఆహారంతో పాటు విటమిన్‌ ఇ కాప్యుల్స్‌ను కూడా తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. సరియైన ఆహారం తీసుకుంటే దాంపత్యం సవ్యంగా సాగుతుందని భరోసా ఇస్తున్నారు. 
 
లైంగిక సామర్థ్యాన్ని పెంచే ఆహార పదార్థాలలో తులసి, లవంగం, టమాట, ముల్లంగి, కోడిగుడ్డు, క్యారట్‌, పిల్లితీగలు, అల్లం, ఉల్లి, దోసకాయ, ఎర్రమిరియాలు, ఓట్లు, పిస్తా, చెస్ట్‌నట్‌, హాజల్‌నట్‌, కొబ్బరి, పుట్టగొడుగు ముఖ్యమైనవి. ముఖ్యంగా విటమిన్‌ ఇ ఉండే బాదం, వాల్‌నట్‌లు లైంగిక సామర్థ్యం పెరగడంలో అద్భుతంగా ఉపయోగపడుతాయంటున్నారు. దివ్య ఔషధంలా పని చేస్తాయట. 

అంతే కాదండోయ్... లైంగిక శక్తికి ఎరుపు రంగుకు సంబంధం ఉందని కూడా పరిశోధకులు వివరిస్తున్నారు. ఎరుపు రంగులో ఉండే పదార్థాలు, డ్రింక్స్‌ తీసుకుంటే లైంగిక సామర్థ్యం వృద్ధి చెందుతుందని అంటున్నారు. పగడం , రూబీ స్టోన్‌లు శక్తిని పెంచడంలో సహాయపడతాయని అందుకే వాటిని ధరించమని సూచిస్తుంటారు.

Friday, June 12, 2015

50 దాటిన పురుషులు ఎలాంటి ఆహారం తీసుకోవాలి?

50 ఏళ్లు దాటాక ఎలాంటి ఆహారం తీసుకోవాలో తెలియట్లేదా..? న్యూట్రీషన్లను సంప్రదించాలనుకుంటున్నారా..? అయితే ఒక్క నిమిషం ఆగండి.. ఈ స్టోరీ చదవండి. 50 ఏళ్లు దాటిన పురుషులు పోషకాహారంపై దృష్టి పెట్టాలని.. డయాబెటిస్ పేషెంట్లైతే స్పెషల్ కేర్ తప్పదని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఇంతకీ ఐదు పదుల్లో ఉండే పురుషులు ఎలాంటి పోషకాహారం తీసుకోవాలంటే.. చేపల్ని వారానికి రెండుసార్లైనా తప్పక తీసుకోవాలి.
 
చేపల్లోని ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. సాల్మన్, ట్యూనా, హలిబుట్ వంటి చేపలతో పాటు ఇతర సీ ఫుడ్స్ తీసుకోవడం ఉత్తమం. అలాగే తాజా పండ్లు కూడా శరీరానికి కావలసిన పోషకాలను సమృద్ధిగా అందిస్తాయి. అందువలన రోజువారీ ఆహారంలో పండ్లను చేర్చుకోవాల్సిన అవసరం ఉంది. సీజన్‌వారీగా అందుబాటులో ఉండే పండ్లు చాలా ఉన్నాయి. వీటిని తప్పకుండా తీసుకోవాలి. 
 
తీపి పండ్లలో చక్కెర స్థాయిలు ఉండుట వలన, వాటికీ ఉపయోగించేటప్పుడు వాటికి పంచదార ఉపయోగించకూడదు. అలాగే తాజా పండ్ల రసాలు ఆరోగ్యానికి మేలు చేస్తాయి. అలాగే భోజనం సులభంగా జీర్ణం కావడానికి, శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచటానికి ఫ్రూట్ జ్యూస్‌లు ఎంతగానో సహాయపడుతాయి.
 


Thursday, June 11, 2015

"మూత్రం పోస్తే రూపాయి గిఫ్ట్"!ఎక్కడ?

రాష్ట్రాన్ని పరిశుభ్రంగా తీర్చిదిద్దడానికి నడుంకట్టిన గుజరాత్ ప్రభుత్వం పలు విధాలైన కొత్త పద్దతులను అమలుచేస్తోంది. అందులో భాగంగా తాజాగా మరో వినూత్న పథకాన్ని ప్రారంభించింది. 'రూపీ ఫర్ పీ' పేరిట సులభ్ కాంప్లెక్సుల్లో మూత్ర విసర్జన చేసే వారికి ఒక రూపాయిని గిఫ్ట్‌గా ఇవ్వాలని నిర్ణయించింది. దీంతో ముఖ్య ప్రాంతాలు, కూడళ్లలో ఉన్న 67 కాంప్లెక్సుల వద్ద ఈ పథకాన్ని అమలుచేన్నామని తెలిపింది. 
 
వచ్చే స్పందనను బట్టి త్వరలో మరిన్ని ప్రాంతాలకు ఈ పథకాన్ని విస్తరిస్తామని అధికారులు వెల్లడించారు. పబ్లిక్ టాయిలెట్స్ వినియోగంపై ప్రజల్లో, ముఖ్యంగా మురికి వాడల్లో నివసిస్తున్న వారిలో అవగాహన తీసుకురావాలనే ఉద్దేశంతో ఈ పథకాన్ని ప్రారంభించామని, చాలా వరకు స్లమ్ ఏరియాల్లో ఈ రూపాయి స్కీం మొదలైందని మునిసిపల్ అధికారి ఒకరు వివరించారు.
 


Wednesday, June 10, 2015

"ముందు చూస్తే నుయ్యి వెనుక చూస్తే గొయ్యి సన్నీ లియోన్ పరిస్థితి"

 
మాజీ పోర్న్ స్టార్, బాలీవుడ్ సెక్సీ బాంబ్ సన్నీ లియోన్ సందిగ్ధంలో పడింది. రోజు రోజుకూ పెరిగిపోతున్న సినిమా కష్టాలు ఆమెను నిలకడగా నిద్రపోనీయడం లేదు. ఒక వైపు సన్నీ అందాలను చూసేందుకు యువత ఎగబడుతుంటే, మరో వైపు తన సినిమాలతో, వెబ్ సైట్స్‌తో దేశప్రజలను కామవికారాలకు లోనయ్యేలా చేస్తోందని సన్నీపై కొందరుదేశ వ్యాప్తంగా కేసులు పెడుతున్నారు. మొన్నామధ్య ఈ విషయమై పోలీస్ స్టేషన్‌కు వెళ్లి స్టేట్‌మెంట్ కూడా ఇచ్చివచ్చింది ఈ సెక్సీ బ్యూటీ

 తాను ఎక్స్ పోజింగ్ చేస్తే మహిళలు ఒప్పుకోవట్లేదు. సరే ఎక్సే పోజింగ్ చేయకుంటే జనం ఆమె సినిమాలు చూసేలా లేరు. ఏదేమైనా సినీ నిర్మాతలు మాత్రం  ఎంత విప్పాలో అంత విప్పిచేయమని పట్టుబడుతున్నారు. ఈ విధంగా సన్నీ సెక్సీ సన్నివేశాలలో నటించాలో లేక సాంప్రదాయానికి మారిపోవాలో తెలియక తికమకపడిపోతోంది. దీనికి తోడు సహ సెక్సీ భామలు సన్నీని మళ్లీ విదేశాలకు వెళ్లిపొంటున్నారు. ఇన్ని సమస్యల నుంచి సన్నీ ఎలా బయటపడుతుందోనని ఆమె అభిమానులు ఆందోళన చెందుతున్నట్టు బాలీవుడ్ టాక్.

Tuesday, June 9, 2015

అమెరికాలోనే అత్యధిక అపర కుబేరులున్నఆ గ్రామం ప్రత్యేకత ఏమిటో తెలుసా ?

అమెరికాలోని ఫ్లోరిడాలో ఒక చిన్న ద్వీపం ఉంది. బిస్కేన్ బే పక్కనున్న ఆ దీవి పేరు ఇండియన్ క్రీక్ విలేజ్. విలేజ్ అంటే ఇదేదో చెట్లు, పుట్టలు తప్ప మరే సదుపాయాలు లేని  చిన్న కుగ్రామం అనుకునేరు. అక్కడున్న వారంతా అపర కుబేరులే. కేవలం 35 ఇళ్లు మాత్రమే ఉన్న ఆ గ్రామంలో జనాభా 86 మంది మాత్రమే. బిలియనీర్ బంకర్‌గా ప్రస్తుతం ప్రసిద్ధి చెందిన ఆ గ్రామంలో నివసించే వారంతా కోటాను కోట్ల రూపాయల ఆస్తులు కలిగిన ఆసాములే.
 
అక్కడ ఓ ఇల్లు కొనాలంటే మధ్యస్థంగా రెండున్నర కోట్ల డాలర్లు చెల్లించాల్సిందే. మొత్తం 86 మంది జనాభా కోసం ఆ గ్రామంలో అతి విశాలమైన గోల్ఫ్ కోర్టు కూడా ఉంది. ఆ గ్రామంలోకి ఇతరులను ఎవరిని అనుమతించరు. కట్టుదిట్టమైన ప్రైవేటు పోలీసు వ్యవస్థ 24 గంటలపాటు ఆ గ్రామానికి కాపలా ఉంటోంది. నేలపైనే కాకుండా నీటిపైన బోట్లలో, ఆకాశంలో జెట్ విమానాలతో 24 గంటలపాటు నిఘా కొనసాగిస్తారు. 
 
ఆ ద్వీపంలో అన్ని రంగాలకు చెందిన ప్రముఖులు నివసిస్తున్నారు. ముఖ్యంగా చమురు, హోటల్, ఆటోమొబైల్ రంగాలకు చెందిన పారిశ్రామికవేత్తలతో పాటు, సూపర్ మోడళ్లు, క్రీడారంగానికి చెందిన కోచ్‌లు నివసిస్తున్నారు. అమెరికాలోనే అత్యధిక అపర కుబేరులున్న గ్రామంగా ఇండియన్ క్రీక్ విలేజ్ రికార్డుల్లోకి ఎక్కింది.
 

Saturday, June 6, 2015

రేవంత్ రెడ్డి "అప్రూవర్‌"గా మారతారా?

ఓటుకు నోటు కేసులో రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడి, విచారణ ఖైదీగా చర్లపల్లి జైల్లో ఉన్న రేవంత్ రెడ్డి తనను ముందుంచి ఇరికించారంటూ కుటుంబ సభ్యులవద్ద వాపోయారు. పై స్థాయిలో ఒత్తిడి తెచ్చి కనీసం బెయిలన్నా వెంటనే వచ్చేలా చూడలేదని ఆయన వ్యాఖ్యానించారట. తనను కలిసేందుకు తెలుగుదేశం పార్టీ నేతలు వచ్చినా, ఆయన నిర్మొహమాటంగా తిరస్కరించిన సంగతి తెలిసిందే.
 
దీంతో ఆయన అప్రూవర్‌గా మారతారా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఈ కేసులో పూర్తి సాక్ష్యాధారాలు ఏసీబీ వద్ద ఉండడంతో ఇక ఎటూ తప్పించుకోలేని పరిస్థితుల్లో అప్రూవర్‌గా మారి, తన వెనుక ఉన్న 'పెద్దలు', సదరు 'బాస్' వివరాలూ చెప్పేందుకే మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తోంది. అలా చేయడం వల్ల తనను ప్రలోభపెట్టి ఈ పని చేసేందుకు పురిగొల్పారని ఆయన వాదించుకోవచ్చు.
 
అంతేకాకుండా ఇలా చేయడం వలన తనపై బాస్‌లు ఇరుక్కుంటారు కాబట్టి, తనపై కేసు తీవ్రతా తగ్గుతుందని రేవంత్ భావిస్తున్నట్టు సమాచారం. ఈ విషయాలు తెలుసుకున్న తెలుగుదేశం నేతలు రేవంత్‌కు అండగా నిలిచి ఆయన్ను ఎలాగైనా సముదాయించాలని చర్లపల్లి జైలుకు రాయబారాలు పంపుతున్నారని సమాచారం.

Friday, June 5, 2015

మాజీ సీఎం మామిడి కాయలు కోయకుండా 24 మంది పోలీసుల కాపలా?

బీహార్ మాజీ ముఖ్యమంత్రి జితన్ రాం మాంఝీ ఎక్కడ మామిడి కాయలు కోసుకు తినేస్తారోనని.. ఏకంగా 24 మందిని ఆ రాష్ట్ర ప్రభుత్వం కాపలా పెట్టింది. జితన్ రాం మాంఝీ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో పాట్నాలోని 1, అన్నేమార్గ్ బంగ్లాలో అధికారికంగా నివాసం ఉండేవారు. ఆయన పదవి నుంచి దిగిపోయినా, ఆ భవంతిని మాత్రం ఖాళీ చెయ్యలేదు. ఆ భవనం ప్రాంగణంలో ఎన్నో మామిడి చెట్లు ఉన్నాయి. 
 
ఈ సీజనులో ఈ చెట్లు మంచి దిగుబడిని ఇచ్చాయి. ఈ మామిడి మంచి రుచిగా ఉండటంతో బీహార్ రాజకీయ నేతలు తమకు కాయలు కావాలని సిఫార్సులు చేస్తుంటారు. మాంఝీ, ఆయన అనుచరులు ఎక్కడ కాయలు కోసేస్తారోనని 8 మంది ఎస్ఐలు, 16 మంది కానిస్టేబుళ్లు రేయింబవళ్లు ఆ చెట్లకు కాపలా కాస్తున్నారని తెలుస్తోంది. 
 
మాజీ ముఖ్యమంత్రి ఇంట పోలీసులను కాపలా పెట్టడంపై మాంఝీ నేతృత్వంలోని హిందుస్థానీ అవ్వామ్ మోర్చా పార్టీ తీవ్ర విమర్శలు చేస్తోంది. ఇది ఓ దళిత నేతను అవమానించడమేనని వ్యాఖ్యానించింది. తన ఇంటికి ఎందరో పేదలు నిత్యమూ వస్తుంటారని, వారికి కనీసం మామిడి కాయలు తినేందుకు కూడా అర్హత లేదని నితీష్ ప్రభుత్వం భావిస్తోందని మాంఝీ విమర్శించారు.

Thursday, June 4, 2015

"ఆ కారు కొనేంత ధనవంతుడిని కాదన్న రతన్ టాటా" ! ఆ కారెంటో తెలుసా ?

జెనీవా ఆటో షోలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన ఇటాలియన్ తొలి హైబ్రిడ్ కారు లాఫెరారి టాటా గ్రూప్ గౌరవ ఛైర్మన్ రతన్ టాటాను బాగా ఆకట్టుకోవడంతో తనివితీరా ఆస్వాదించారు. అంతేకాకుండా ఈ ఆటో షోలో ఈ కారుని చూసి ఆయన తన ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు. ఫెరారీ రూపొందించిన తొలి హైబ్రిడ్‌ కారు టెర్రిఫిక్‌గా ఉందన్నారు. మిమ్మల్ని అంతగా ఆకట్టుకున్న ఈ కారుని మీరు కొనుగోలు చేస్తారా అని రతన్ టాటాను అక్కడున్న వారు ప్రశ్నించగా.. ఈ కారును కొనేంత ధనవంతుడిని కానని.... 10 లక్షల యూరోలు (అంత డబ్బు) తన దగ్గర లేదని ఆయన నవ్వూతూ సమాధానం ఇచ్చారు. నాజూకైన కార్బన్-ఫైబర్ బాడీతో తయారైన ఈ లాఫెరారి కారు గంటకు 350 కిలోమీటర్లు మించిన వేగంతో ప్రయాణిస్తుంది. ఫెరారీ కార్లలో అత్యంత వేగంగా పరిగెత్తే ఇదే. ప్రస్తుతం జరుగుతున్న జెనీవా ఆటో షోలో అందర్నీ ఆకట్టుకున్న కార్లలో ఇది ఒకటి. శక్తివంతమైన పెట్రోల్ ఇంజిన్లు, ఎలక్ట్రిక్ మోటార్లతో రూపొందిన హైపర్-హైబ్రిడ్ స్పోర్ట్స్ కారు ఇది. సాధారణంగా ఫెరారి కంపెనీ సూపర్ కార్లను తయారు చేస్తుంది. దీనికి భిన్నంగా ఈ సారి ఈ హైబ్రిడ్ కారును అందిస్తోంది. డ్రైవింగ్ ఎక్స్‌పీరియన్స్‌ను మరింత మెరుగుపరచడం, పర్యావరణ నిబంధనలకు అనుగుణంగా కార్లను తయారు చేయడం వంటి కారణాల వల్ల ఈ హైబ్రిడ్ కారును అందిస్తున్నామని ఫెరారి చైర్మన్ లూకా డి మోంటోజెమొలో చెప్పారు. ఫెరారీ కంపెనీ ఛైర్మన్‌ లూకా డి మోంటోజెమొలో రతన్‌టాటాకు మంచి మిత్రుడు. ఫెరారీ కంపెనీ ఈ కొత్త బ్రాండ్‌ స్పోర్ట్స్‌ కార్లు కేవలం 499 మాత్రమే తయారు చేయనుంది. ఈ కార్లు తయారు చేయకముందే బుకింగ్‌ అయి పోయాయి.

Wednesday, June 3, 2015

"మీసాలు తీయడానికి ఒప్పుకోని సీనియర్ ఎన్టీఆర్" ! ఎప్పుడో తెలుసా ?

ఎన్టీఆర్ కు చిన్నప్పట్నుంచి నాటకాలపై మోజు ఉండేది. దాంతో ఆయన అడపాదడపా నాటకాల్లో నటిస్తుండేవారు.విజయవాడ ఎస్.ఆర్.ఆర్. కాలేజీలో చదివేటప్పుడు తెలుగు విభాగానికి అధిపతి అయిన విశ్వనాథ సత్యనారాయణ రామారావును ఒక నాటకములో ఆడవేషం వేయమన్నారట. ఆడవేషానికి తగ్గట్లు, మీసాలు తీయాల్సి రావడంతో మేకప్ లో భాగంగా మీసాలు తీయబోతే ససేమిరా అన్నారట. మీసాలతోనే నటిస్తానని అలాగే చేశారట. దాంతో ఆయనను "మీసాల నాగమ్మ" అనే పేరుతో పిలిచి ఆటపట్టించేవారట. 


Tuesday, June 2, 2015

" పూనమ్‌తో రొమాన్స్ " చేయడానికి సిద్ధం అంటున్న " 25 వేల మంది"

బాలీవుడ్‌లో హాట్ బ్యూటీగా వెలుగుతున్న సుందరి పూనం పాండే. గత 2011లో ఇండియా ప్రపంచ కప్ గెలిస్తే నగ్నంగా కనిపిస్తానని బహిరంగ ప్రకటన చేసి అందరి దృష్టిని ఆకర్షించిన అమ్మడు, ఆ తర్వాతి ఏడాది కొలకత్తా నైట్ రైడర్స్ ఐపిఎల్‌లో విజేతలుగా నిలిచినప్పుడు ఆమె తన ఆనందాన్ని వ్యక్తపరుస్తూ అర్ధనగ్న ఫోటోలని ట్విట్టర్‌లో పోస్ట్ చేసి హంగామా సృష్టించింది.
 
హాటీ బ్యూటీగా ఎంత పేరున్నప్పటికీ, ఇంకా పాపులర్ కావాలనే తపనతో ఎప్పుడూ మీడియాలో హాట్ టాపిక్‌గానే కొనసాగుతూ ఉంటుంది. తాజాగా పూనం తన సరసన నటించేందుకు కొత్త కుర్రాళ్ళ ఎంపికపై ఫోకస్ పెట్టింది. తన సరసన నటించే ఛాన్స్ ఎవరు దక్కించుకుంటారు అంటూ ఓ వీడియో తయారు చేసి యుట్యూబ్లో పోస్ట్ చేసింది.
 
అంతే ఇంకేముందు నేనంటే నేను అంటూ 25 వేల మంది యువకులు తమ యాక్టింగ్ స్కిల్స్ చూపిస్తూ తాము పూనమ్‌తో రొమాన్స్ చేయడానికి సిద్ధం అంటూ పూనంకు వీడియోలు పంపించారు. ఇన్ని వేలమందిలో తనతో రొమాన్స్ చేసే హీరోని ఎలా ఎంచుకుకోవాలని తలపట్టుకుంది పూనమ్.

Monday, June 1, 2015

" కోట్లకు పడగలెత్తిన వృత్తిని మాత్రం వదలని బార్బర్ "

ఇక్కడ ఫోటోలో కనిపిస్తున్న ఈ వ్యక్తి పేరు రమేష్ బాబు. బెంగుళూరులో మొదట ఆయన ఓ ఆర్డినరీ బిజినెస్‌మేన్... కానీ ఎక్స్‌ట్రార్డినరీ సంపాదనతో వార్తల్లోకెక్కాడు. హేర్ కటింగ్, సెలూన్ బిజినెస్ ఓపెన్ చేసి కోట్ల రూపాయలు వెనకేశాడు. ఇప్పుడాయన కార్లు రెంట్‌కిచ్చే వ్యాపారం కూడా చేస్తున్నాడు. అది కూడా ఒకటి రెండు మోడళ్ల కార్లతో కాదు... ఏకంగా 67 రకాల కార్లు ఈయన వద్ద అద్దెకు దొరుకుతాయి. ఇక ఈయన తిరిగే కారేంటో తెలుసా ? రోల్స్ రాయిస్!! అవును ప్రపంచంలోని కొంతమంది ధనవంతుల వద్ద వుండే ఖరీదైన కార్లలో ఇదీ ఒకటి. ఈ కారే ఆయనకు ఎక్కడా లేని ప్రత్యేకతని తెచ్చిపెట్టింది. రోల్స్ రాయిస్ కారు మెయింటెన్ చేస్తున్న బార్బర్‌గా రమేష్ బాబుని బయటి ప్రపంచానికి పరిచయం చేసింది. బెంగుళూరులో రోల్స్ రాయిస్ కారు సొంతం చేసుకున్న అతికొద్ది మందిలో రమేష్ బాబు కూడా ఒకరు. రూ. 3 కోట్ల ఖరీదైన ఈ కారులో రోజూ సెలూన్‌కి వచ్చే రమేష్ బాబు క్లయింట్స్ రేంజ్ కూడా అదే రేంజ్‌లో వుంటుంది. అమీర్ ఖాన్, సల్మాన్ ఖాన్, ఐశ్వర్యా రాయ్ వంటివాళ్లు రమేష్ బాబు కస్టమర్స్. బార్బర్‌గా సంపాదిస్తున్నది ఎక్కువే అయినప్పటికీ... అంతకన్నా ఎక్కువ ఇప్పుడు కార్ల రెంట్ బిజినెస్ ద్వారా సంపాదిస్తున్నాడు. 


1989లో తన తండ్రి చనిపోయినప్పుడు ఆ కుటుంబానికి ఈ సెలూన్ దుకాణం ఒక్కటే ఆధారం. తండ్రి ఇచ్చిపోయిన ఆస్తి కూడా ఆ ఒక్కటే. ఆ దుకాణాన్ని రోజుకు రూ. 5లకు లీజుకిచ్చిన రమేష్ తల్లి... తాను వేరేవాళ్ల ఇళ్లలో పనిమనిషిగా పనిచేసేది. 1994లో చదువు ఆపేసిన రమేష్... తన తండ్రి మిగిల్చిపోయిన దుకాణాన్ని చూసుకోవడం మొదలుపెట్టాడు. ఆ తర్వాత ఎప్పటికైనా ఓ కారు కొనాలన్న కల తీర్చుకున్న రమేష్ బాబు... మరో మూడేళ్లకు మారుతి ఓమ్ని కొని అద్దెకి ఇవ్వడం మొదలుపెట్టాడు. అదే అతడి జీవితాన్ని మార్చేసింది. ఆ కారుని మొదట ఇంటెక్స్ కంపెనీలో క్యాబ్‌గా నడిపిన రమేష్ బాబు కార్స్ రెంటల్ బిజినెస్ అమాంతం రెట్టింపయ్యింది. మరోవైపు తన సెలూన్ బిజినెస్ కూడా స్థానికంగా బిజీ సెలూన్ అయ్యింది. ఇంకేం.. రెండు చేతుల సంపాదన రమేష్‌ని కోట్లకు పడగలెత్తేలా చేసింది. రోల్స్ రాయిస్ కొన్నా... బార్బర్ వృత్తిని మాత్రం మానుకోలేదు. రోల్స్ రాయిస్ కారులో వచ్చినా ఇప్పటికీ అదే రూ. 65లకు కటింగ్ చేసే రమేష్ తాను తన గతాన్ని ఎప్పటికీ మర్చిపోలేదని చెబుతున్నాడు. అంతేకాదు.. కస్టమర్‌కి ఎంత శ్రద్ధగా క్రాప్ చేస్తానో... అంతే జాగ్రత్తగా తన రోల్స్ రాయిస్‌ని డ్రైవ్ చేస్తానంటున్నాడు రమేష్ బాబు.