CSS Drop Down Menu

Wednesday, September 30, 2015

అఖిల్ ని "తిట్టి, కాలర్ పట్టుకుని" తీసుకెళ్లిన హీరో ? ఎందుకు ??

మైండ్ దొబ్బిందా? అంటూ తిట్టిపోశాడు.. నా కాలర్ పట్టుకుని తీసుకెళ్లాడు? అంటూ యువహీరో అఖిల్ వాపోయాడు. ఇంతకీ ఆ హీరో ఎవరా అని ఆరా తీస్తే... అఖిల్ చిత్ర నిర్మాత, మరో టాలీవుడ్ హీరో నితిన్ అని తేలింది. ఇంతకీ అఖిల్ కాలర్ పట్టుకోవాల్సిన అవసరం నితిన్‌కు ఎందుకొచ్చింది. వివరాల్లోకి వెళ్తే... 
 
నితిన్ లేకపోతే ఈ సినిమా లేదు. సినిమా చెయ్యరాబాబు అంటూ నితిన్ ప్రోత్సహించి ఉండకపోతే చేసేవాడిని కాదు. అలాగే, వివి వినాయక్ సినిమా మామూలు విషయం కాదని చెబుతూ, నితిన్ ఈ కథను తనకు వినిపించాడని అఖిల్ తెలిపాడు. సినిమా కోసం సుధాకర్ రెడ్డి, వినాయక్ ఎంతో శ్రమిస్తున్నారని చెప్పుకొచ్చాడు. 
 
ఇక ప్రిన్స్ మహేష్ బాబు గురించి మాట్లాడుతూ.. నా తొలి చిత్రం అఖిల్ ఆడియోపై బైట్ ఇవ్వండి అని మహేష్ బాబుగారిని అడిగితే, 'బైట్ దేముంది, నేనే వస్తానని భరోసా ఇచ్చారు. అలాగే వచ్చారు. నన్ను ప్రోత్సహించారు. ఆయన మంచితనానికి ధన్యవాదాలు' అని అఖిల్ అన్నాడు. నితిన్ - అఖిల్‌లు బెస్ట్ ఫ్రెండ్స్‌గా ఉన్న విషయం తెల్సిందే. 


Tuesday, September 29, 2015

స్త్రీల కంటే పురుషులే ముందు చనిపోతారట! ఎందుకో తెలుసా ?

ప్రతి ఒక్కరికీ జననమరణాలు తప్పనిసరి. అయితే, స్త్రీల కంటే పురుషులే ముందుగా చనిపోతారట. పూర్వకాలంలో ఆడవారైన, మగవారైనా 100 సంవత్సరాలు బ్రతికేవారు. క్రమేణా ఇది వందేళ్ళ నుంచి 60 సంవత్సరాలకు తగ్గుతూ వచ్చింది. ఇప్పుడు యూనివర్సిటీ ఆఫ్ సౌతెర్న్ కాలిఫోర్నియాకు చెందిన పరిశోధక బృందం ఓ పరిశోధన చేసింది. 
 
ఇందులో స్త్రీలకంటే పురుషులే ముందుగా చనిపోతున్నట్టు తేలింది. దీనికి కారణం లేకపోలేదు. మానసిక ఒత్తిడి, బాధ్యతలు, కుటుంబ సమస్యలతో పాటు చెడు అలవాట్లు కారణంగా పురుషులకు మృత్యువు ముందుగా సంభవిస్తుందని నిపుణులు చెపుతున్నారు. 
 
అయితే, ఈ సమస్య ఏ ఒక్క దేశంలోనో లేదని, ప్రపంచ వ్యాప్తంగా ఉందని అంటోంది. అయితే మగవాళ్లు ఎక్కువగా హార్ట్‌ఎటాక్‌తో చనిపోతున్నారని తేల్చింది. అంతేకాకుండా, పొగ త్రాగడం తగ్గిస్తే కొంత వరకు హార్ట్‌ ఎటాక్‌ ద్వారా చనిపోయే మరణాలను తగ్గించవచ్చంటున్నారు నిపుణులు. 


Monday, September 28, 2015

"దటీజ్ రజనీ"

220 పేజీల బౌండెడ్ స్క్రిప్టుని ఒక్క రోజులో చదివి,గుర్తు పెట్టుకోవటం సామాన్యమైన విషయం కాదు. అదీ నడి వయస్సు దాటిన రజనీకాంత్ వంటి సూపర్ స్టార్. అదే చేసారు రజనీ. ఆయన తన తాజా చిత్రం 'కబాలి' స్క్రిప్టుని ఒక్క రోజులో మొత్తం చదివేసారు. అంతేకాదు అందులో సీన్స్ ,డైలాగ్స్ విషయమై దర్సకుడుతో చర్చించారు. ఆయన ధారణ శక్తికి  జ్ఞాపక శక్తికి దర్శకుడు షాక్ కి గురి అయ్యారు. ఈ విషయాన్ని దర్శకుడు స్వయంగా తెలియచేసారు. డైరక్టర్ రంజిత్ మాట్లాడుతూ...నేను ఓ వారం రోజులు పడుతుంది ఈ 220 పేజీల స్క్రిప్టు పూర్తిగా చదివి అర్దం చేసుకోవటానికి అనుకున్నాను. కానీ నా అంచనాలు తారు మారు చేసారు. ఒక్క రోజులో మొత్తం చదివేసి తెల్లారి నాతో డిస్కస్ చేసారు. సినిమాలో ఇంటర్వెల్ గురించి, అనేక డైలాగ్స్ గురించి నాతో చర్చించారు. ఆయనకు స్క్రిప్టుపై ఏర్పడ్డ కమాండ్ చూసి ఆశ్చర్యం వేసింది అంటూ చెప్పుకొచ్చారు దర్శకుడు రంజిత్.

Saturday, September 26, 2015

కన్యత్వాన్ని అమ్మకానికి పెట్టిన సినీ నటికి తర్వాత ఏం జరిగింది?

 చాలామంది యువతీయువకులు విలాసవంతమైన జీవితాన్ని గడిపేందుకు, వెండితెరపై తమను తాము చూసుకునేందుకు   చిత్రపరిశ్రమలోకి అడుగుపెడుతుంటారు. ఇలా కోటి ఆశలతో అడుగుపెట్టే వారిలో ముఖ్యంగా యువతులు సర్వం కోల్పోవడమే కాకుండా, ఆర్థికంగా కూడా చితికిపోతుంటారు.

 రష్యాకు చెందిన ఓ నటి.. అవకాశాలు లేకపోవడంతో ఆర్థిక కష్టాల్లో చిక్కుకుంది. ఈ కష్టాల నుంచి బయటపడి.. సాఫీగా జీవనం సాగించే మార్గాలపై ఆలోచన చేసింది. ఈ ఆలోచనల్లో భాగంగా తన కన్యత్వాన్ని విక్రయించాలని నిర్ణయం తీసుకుంది. తద్వారా వచ్చే డబ్బుతో కొంతకాలం పాటైనా ప్రశాంత జీవనాన్ని గడపాలని భావించింది.

ఆమె ప్రకటన చూసిన సెంట్రల్ రష్యాలోని ఫెర్మ్ నగరానికి చెందిన ఓ యువకుడు పది వేల పౌండ్లు చెల్లించి కొనుగోలు చేసేందుకు ముందుకు వచ్చాడు. దీనికి ఆ నటి సమ్మతించింది. ఆ వెంటనే వారిద్దరి మధ్య కుదిరిన ఒప్పందం మేరకు... యువకుడు ఉంటే ప్రాంతానికి వెళ్లిందీనటి. అక్కడు వెళ్లాక గానీ ఈ నటికి కష్టాలు తెలిసి రాలేదు.

తన గదిలోకి తీసుకెళ్లిన ఆ యువకుడు.. నటిని న్యూడ్ ఫోటోలు దిగమన్నాడు.. న్యూడ్‌గా సెక్స్ చేయాలన్నాడు. ఈ చర్యలకు ఖంగు తిన్న ఆమె అతని చర్యలకు వ్యతిరేకించింది.. దీంతో ఆమెపై అత్యాచారం చేశాడు. ఆమెను గదిలోనే బందించి బయటకు వెళ్ళాడు. అతడు బయటికి వెళ్ళడంతో మూడో అంతస్తులో ఉన్న బాధితురాలు క్రిస్టినా బెడ్ షీట్‌ల సహాయంతో అక్కడి నుంచి తప్పించుకుని పోలీసులను ఆశ్రయించింది.

మొత్తానికి అతన్ని పట్టుకొని పోలీసుల అరెస్టు చేశారు. తర్వాత వాళ్లకు దిమ్మతిరిగే నిజాలు తెలిశాయి. నింధితుడు ఓ మానసిక రోగి అని ఇప్పటికి ఇలాంటి రేప్‌లు చాలా చేశాడని తేలింది. మొత్తానికి అటు కన్యత్వం, ఇటు  ఉన్న పరువు పోగొట్టుకొని అభాసు పాలైన ఆ నటి పేరు క్రిష్టినా.
 

Friday, September 25, 2015

నాగ చైతన్య పెళ్లి గురించి నాగార్జున షాకింగ్ కామెంట్స్ !

అక్కినేని నాగార్జున తన కుమారుడు నాగ చైతన్య పెళ్లి విషయంలో స్పందించిన తీరు అందరినీ ఆశ్చర్య పరుస్తోంది. నాగచైతన్యకు ఎలాంటి అమ్మాయి కావాలో అతనికే తెలియాలి. ఎవరి భార్యను వారే వెతుక్కోవాలి. నాగ చైతన్య కూడా తనకు కాబోయే భార్యను అతనే ఎంచుకోవాలి అంటూ సూచించాడు. ఎవరైనా అమ్మాయిని ప్రేమించానని చెబితే వెంటనే పెళ్లి చేయడానికి తాను రెడీ అని కూడా నాగార్జున చెప్పేశాడు. నాగార్జున ఇలా అనడానికి కారణం.... తన జీవితంలో జరిగిన ఘటనే అంటున్నారు. చేసుకునే వారి ప్రమేయం లేకుండా పెద్ద కుదిర్చిన పెళ్లి సంబంధాలు ఎక్కువ కాలం నిలబడవు, ముఖ్యంగా సినిమా రంగంలో ఉండే వారికి ఇలాంటి అస్సలు సూటు కావు. ప్రేమించి పెళ్లి చేసుకుంటేనే ఒకరినొకరు బాగా అర్థం చేసుకుంటారు, అలాంటి వారే పెళ్లయిన తర్వాత సుఖంగా ఉండగలరు అనేది నాగార్జున భావనగా కనిపిస్తోంది.

నాగార్జున మొదటి వివాహం పెద్దలు కుదిర్చిన వివాహం. ప్రముఖ నిర్మాత రామానాయుడు కూతురు లక్ష్మిని ఆయన వివాహం చేసుకున్నారు. వీరికి కలిగిన సంతానమే నాగ చైతన్య. పలు కారణాలతో లక్ష్మితో నాగార్జున విడిపోయాడు. తర్వాత తన సహ నటి అమలను ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. అయినా ఇపుడు ఇండస్ట్రీలో ఉన్న హీరోలు దాదాపు అందరూ ప్రేమించి పెళ్లి చేసుకున్న వారే. రామ్ చరణ్ తన చిన్ననాటి స్నేహితురాలు ఉపాసనను ప్రేమించి పెళ్లి కోగా అల్లు అర్జున్ స్నేహారెడ్డిని లవ్ చేసి పెళ్లాడాడు. మంచు మనోజ్, నాని ఇలా వీరంతా కూడా ప్రేమ పెళ్లి చేసుకున్న వారే.




Thursday, September 24, 2015

పుట్టిన "ఆడపిల్ల" 12 యేళ్ళకు "మగబిడ్డ"గా మారిపోతుంది ! ఎక్కడో తెలుసా ?

సాధారణంగా తల్లి కడుపు నుంచి పుట్టిన తర్వాత ఆడబిడ్డో.. మగబిడ్డో తేలిపోతోంది. ఒకవేళ మగాడిగానో, ఆడవారిగానో మారాలంటే ఆపరేషన్ చేయించుకోవాల్సిందే. కానీ, ఆ ఊర్లో మాత్రం ఆడపిల్ల పుట్టిన తర్వాత 12 యేళ్ళకు మగబిడ్డగా మారిపోతుంది. దీంతో తల్లిదండ్రులు లబోదిబో మంటున్నారు. ఈ విచిత్ర సంఘటన కరేబియన్ దీవుల్లోని డొమినికన్ రిపబ్లిక్‌లో జరుగుతోంది. ఇక్కడే ఎందుకు ఇలా జరుగుతుందన్న అంశంపై వైద్యులను సంప్రదిస్తే... 
 
బిడ్డ తల్లిగర్భంలో ఉన్నప్పుడు ఎంజైమ్ లోపం కారణంగా ఆడశిశువుగా పుట్టాల్సింది మగబిడ్డగా మారిపోతుంది. దీనికి కారణం ఆడపిల్లగా పుట్టిన వారిలో డీ హైడ్రో టెస్టోస్టిరాన్ అనే హర్మోన్. దీనివల్ల ఆడపిల్లకు 12 సంవత్సరాల వయస్సు రాగానే మగపిల్లలైపోతారు. ఆడపిల్లలు మగపిల్లలుగా మారడాన్ని శాస్త్ర పరిభాషలో 'గెవెడాసెస్' అని పిలుస్తారని వైద్యులు చెబుతున్నారు. 
 
ఇక డొమెనిక్ రిపబ్లిక్‌లో ఎంతమంది ఆడపిల్లలు మగపిల్లలుగా మారుతున్నారనే విషయాని కొస్తే, ప్రతి 90 మందిలో ఒకరు ఇలా మారిపోతున్నారు. సాలినాస్ పట్టణంలో అయితే ప్రతి 90 మందిలో ఇద్దరు ఆడ శిశువులుగా పుట్టి తమ 12వ సంవత్సరంలో మగబిడ్డలుగా మారిపోతున్నారు. ఇటువంటి సంఘటన మొట్టమొదటిసారి 1970లో వెలుగుచూసిందని డాక్టర్ మైఖేల్ మోస్లే వివరిస్తున్నారు. ఈ సమస్యకు పరిష్కారం కనుగొనడం కష్టమని, ఎందుకంటే జన్యులోపం వల్లే ఇలా జరుగుతుందని చెపుతున్నారు. 


Wednesday, September 23, 2015

శ్రీదేవికి కోపమొచ్చిందట!

కోలీవుడ్‌లో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన శ్రీదేవి చుక్కెదురైంది. ఇంగ్లీష్ వింగ్లీష్, తర్వాత కోలీవుడ్ సోషియో ఫాంటసీ సినిమాలో నటిస్తోంది. అయితే ఈ సినిమాలో నటించేందుకు డబ్బింగ్ చెప్పేందుకు కోట్లాది రూపాయలు పుచ్చుకున్నట్లు వార్తలొచ్చిన నేపథ్యంలో పులి డైరక్టర్లు శ్రీదేవిని ముప్పుతిప్పలు పెడుతున్నారని తెలిసింది. బాహుబలి వద్దనుకుని పులికి ఓకే చెప్పేసిన శ్రీదేవి ప్రస్తుతం బెంబేలెత్తుతోంది. 
 
‘పులి’ సినిమా విషయంలో చాలా ఆశలతో ఉన్న శ్రీదేవి... చాలా రోజులు డేట్లిచ్చి.. ఎంతో ఇష్టంగా సినిమా పూర్తి చేసింది. కానీ తీరా డబ్బింగ్ సమయంలో ఫైనల్ వెర్షన్ చూస్తే శ్రీదేవికి దిమ్మదిరిగిపోయినట్లు సమాచారం. దర్శకుడు చింబుదేవన్ కథ చెప్పేటపుడు శ్రీదేవి పాత్ర గురించి చాలా చెప్పాడట. అలా చెప్పినట్లే శ్రీదేవి మీద చాలా సన్నివేశాలు కూడా చిత్రీకరించాడు. 
 
కానీ డబ్బింగ్ చెప్పడానికి వెళ్తే శ్రీదేవి పాత్ర చాలా తగ్గిపోయిందట. లెంగ్త్ ఎక్కువైపోతుండటంతో ఎడిటింగ్‌లో భాగంగా శ్రీదేవి నటించిన చాలా సన్నివేశాలకు కట్ చేసి.. పాత్రను బాగా కుదించేసినట్లు తెలిసింది. దీంతో శ్రీదేవి వచ్చిన కోపం అంతా ఇంతా కాదని.. ఈ విషయంలో దర్శకుడితో ఆమె గొడవ కూడా పడిందట. ఐతే లెంగ్త్ సమస్య గురించి చెప్పి.. ఎలాగోలా డబ్బింగ్ చెప్పించారట.
 
ఐతే శ్రీదేవి మాత్రం దర్శకుడి సమాధానం మీద సంతృప్తి చెందలేదని.. చాలా కోపంగా డబ్బింగ్ స్టూడియో నుంచి వెళ్లిపోయిందని కోలీవుడ్ వర్గాల సమాచారం. శివగామి పాత్రను వద్దన్న శ్రీదేవి పరిస్థితి ఏమైందో? శివగామి పాత్రతో రమ్యకృష్ణ దేశవ్యాప్తంగా గుర్తింపు సంపాదించిన ఆనందంలో ఉంటే.. ‘పులి’లో తన పాత్ర గురించి ఏడుస్తోంది శ్రీదేవి. అసలే శివగామి క్యారెక్టర్ వదులుకున్నానే అనే బాధలో ఉంటే.. ఇప్పుడు శ్రీదేవికి కొత్త కష్టాలు తప్పట్లేదు. 

Tuesday, September 22, 2015

ఉద్యోగులకు "షార్ట్ బ్రేక్‌" తోనే ఆరోగ్యం !

ఉద్యోగస్తులైనా, కార్మికులైనా మధ్యాహ్నం లాంగ్ బ్రేక్ తీసుకోవడం కంటే అంతకంటే ముందు.. షార్టు బ్రేక్ తీసుకోవడమే ఆరోగ్యానికి చాలా మంచిదని పరిశోధకులు చెబుతున్నారు. అది ఆరోగ్యానికి ఎంతో హాయినిస్తుందని అంటున్నారు. తలనొప్పి, అలసట వంటి వాటి నుంచి ఉపశమనం కలిగిస్తుందని చెబుతున్నారు. పైగా మంచి ఫలితాలు కూడా వస్తాయట. 
 
పని ప్రారంభించే ముందు లాంగ్ బ్రేక్ తీసుకోవడం వలన ఆరోగ్యాన్ని దెబ్బతీసే పరిస్థితులు కనిపిస్తున్నట్లు ఎమ్లీ హంటర్, సిండీ వూ అనే పరిశోధకులు చెబుతున్నారు. వీరు అమెరికాకు చెందిన 95 మందిపై పరిశోధన చేశారు. 22 నుంచి 67 యేళ్ళ వయస్సున్న వారిని ఎంపిక చేసుకుని వారి ఆరోగ్యాన్ని పరిశీలించారు. 
 
సాధారణంగా ఉద్యోగి తన విధి నిర్వహణలో లంచ్ బ్రేక్, సాటి ఉద్యోగులతో సంభాషణ, బాత్ రూం వంటి అనేక  బ్రేక్‌లు తీసుకుంటుంటారు. అయితే ఈ బ్రేకలన్నింటి కంటే బ్రేక్ ఫాస్ట్‌కు లంచ్‌కు మధ్యన తీసుకునే చిన్నపాటి బ్రేక్ ఆరోగ్యానికి చాలా మంచిదని పరిశోధనలో వెల్లడయ్యింది. అదే ఎక్కువ ఫలితాన్ని ఇస్తుందని కూడా తేల్చారు. 
 
దీని వలన అలసిపోవడం, తలనొప్పి, వెన్ను నొప్పి వంటివి చాలా తక్కువగా ఉన్నట్లు గమనించారట. పైగా చిన్నపాటి విశ్రాంతి తరువాత వచ్చే ఉద్యోగులు చాలా హుషారుగా పని చేస్తున్నారట. 


Monday, September 21, 2015

"మంచు విష్ణు ట్వీట్" పై "వ్యంగ్యంగా ట్వీట్ చేసిన వర్మ" !

వినాయక చవితి శుభాకాంక్షలు చెబుతూ తన రహస్య స్నేహితుడు, దీర్ఘకాల అభిమాన దేవుడు అయిన వినాయకుని దీవెనలు అందరికీ అందాలని ఆకాంక్షిస్తూ మంచు విష్ణు ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్ పై వర్మ స్పందించాడు. 'విష్ణూ! నీ రహస్య స్నేహితుడు, అభిమాన దేవుడు ఎవరో అందరికీ తెలియనివ్వకు, ఎందుకంటే అలా తెలిస్తే...తిరుపతి, యాదగిరిగుట్ట దేవుళ్లు అసూయపడతారు. నిన్ను శపించినా ఆశ్చర్యపోనక్కర్లేదు' అంటూ వర్మ ట్వీట్ చేశాడు.


Saturday, September 19, 2015

అనసూయకి "చుక్కలు చూపించిన" కుర్ర హీరో ?

సాధారణంగా సినీ ఇండస్ట్రీలోకి వచ్చే హీరోయిన్ల గురించి నిర్మాతలు, దర్శకులు, హీరోలు కూపీ లాగుతారు. ఆమె బయోడేటా, వ్యక్తిగత వివరాలు తెలుసుకుంటారు. ఒకవేళ ఆమె ట్రాక్ రికార్డులో లొసుగులు ఉన్నాయంటే.. ఇక ఆ హీరోయిన్‌కి ఫిల్మ్ ఇండస్ట్రీకి చెందిన వారు చుక్కలు చూపిస్తారు. అందుకే ఫిల్మ్ ఇండస్ట్రీలోకి ఎంట్రి ఇచ్చేటప్పుడు, ముందు వారి ట్రాక్ రికార్డ్‌ని పద్దతిగా మెయింటెన్ చేసుకోవాలి. 
 
ఇదిలా ఉంటా తాజాగా ఫిల్మ్ ఇండస్ట్రీలోకి ఎంట్రి ఇచ్చిన అనసూయ, ప్రస్తుతం రెండు సినిమాలకు ఓకే చెప్పేసింది. అయితే అనసూయ బుల్లితెరలో పాపులర్ యాంకర్. తను యాంకర్‌గా ఉన్నప్పడు జరిగిన కొన్ని విషయాలను టాలీవుడ్‌కి చెందిన కుర్ర హీరోతో చెప్పుకుందట. ఇప్పుడా కుర్ర హీరో అనసూయ హాట్ ఎఫైర్ అంటూ ఫిల్మ్ ఇండస్ట్రీలో బాగా ప్రచారం చేస్తున్నాడట.
 
ఈ విషయం ఎలాగోలా అనసూయ చెవిన పడటంతో అనసూయ అవాక్కైందట. ఒక్కసారి ఫిల్మ్ ఇండస్ట్రీలోకి ఎంట్రి ఇచ్చిన తరవాత ఇలాంటి గాసిప్స్ కామన్ అని అనసూయకి ఇండస్ట్రీ పెద్దలు హితబోధ చేశారంట. దీంతో అనసూయ ఈ రూమర్స్‌ని పట్టించుకోకుండా షూటింగ్ పనేంటో చేసుకుంటూ పోతుందట. మరి ఆ కుర్ర హీరో ఎవరనే దానిపై ప్రస్తుతం ఫిలిమ్ వర్గాల్లో చర్చ సాగుతోంది.
 

Friday, September 18, 2015

వండర్ పుల్ "బేలన్స్"











Thursday, September 17, 2015

ఉల్లిపాయలు తినకపోతే చస్తారా? అంటూ మంత్రిగారి ఆగ్రహం !

రాజస్థాన్ రాష్ట్ర వ్యవసాయ శాఖామంత్రి ప్రభువాల్ సైనీ వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. ఒక రాష్ట్ర మంత్రిగా ఉంటూ ఉల్లిధరలను అదుపుచేయలేని ఈ మంత్రివర్యులు... తన అధికార దర్పంతో ప్రజలను దుర్భాషలాడారు. 
 
తన నియోజకవర్గంలోని రైతులు, ప్రజలతో జరిగిన ఓ కార్యక్రమంలో మంత్రి ప్రభులాల్ మాట్లాడుతుండగా జనం ఉల్లిపాయల ధరల పెరుగుదలను ప్రశ్నించారు. దీంతో ఆయనకు ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ఉల్లిపై మీకు అంత మోజెందుకు.. ఉల్లిపాయలు తినకపోతే చస్తారా అని ప్రశ్నించారు. 
 
మంత్రి తీరుపై పలు విమర్శలు వెల్లువెత్తాయి. ధరలు అదుపుచేయలేక తినవద్దని చెప్పడం, తినకపోతే చనిపోతారా అని అడగడం పాలకుల అహంకార మనస్తత్వాన్ని తెలియజేస్తోందని ప్రతిపక్షాలు విరుచుకుపడ్డాయి. దీనిపై రాజస్థాన్‌లో పెద్ద వివాదమే చెలరేగే అవకాశం ఉంది.
 
కాగా, గత కొన్ని రోజులుగా దేశ వ్యాప్తంగా ఉల్లిధరలు ఆకాశానికి తాకిన విషయంతెల్సిందే. ఈ ధరలను అదుపు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కూడా పూర్తిగా విఫలమైంది. జనాలు గగ్గోలు పెడుతున్నా పాలకులు మాత్రం నామమాత్రపు చర్యలతో చేతులు దులుపుకున్న విషయం తెల్సిందే.

Wednesday, September 16, 2015

"పండ్ల" తో "గుడ్లగూబలు"












Tuesday, September 15, 2015

వినాయకుని పూజించే "21 పత్రాలు"

వినాయక చతుర్థి రోజున విఘ్నేశ్వరుని ఉండ్రాళ్లతో పాటు పత్ర పూజ చాలా ముఖ్యమని ఆధ్యాత్మిక నిపుణులు అంటున్నారు. 21 పత్రాలతో చవితి రోజున పూజ చేయడం ఆనవాయితీ. అయితే ఈ పత్రాల పేర్లేంటో తెలుసుకోవాలంటే.. చదవండి.
 
1. మాచీ పత్రం: మాచ పత్రి అనేది తెలుగు పేరు. చేమంతి జాతికి చెందిన దీని ఆకులు సువాసనా భరితంగా ఉంటాయి. చేమంతి ఆకుల మాదిరే ఉంటాయి.
 
2. దూర్వా పత్రం: దూర్వా పత్రం అంటే గరిక. తెల్ల గరిక, నల్ల గరిక అని రెండు రకాలుంటాయి. గడ్డిజాతి మొక్కలు విఘ్నేశ్వరునికి అత్యంత ప్రీతికరమైనవి.
 
3. అపామార్గ పత్రం: తెలుగులో దీనిని ఉత్తరేణి అంటారు. దీని ఆకులు గుండ్రంగా వుంటాయి. గింజలు, ముళ్ళు కలిగి వుండి కాళ్ళకు గుచ్చుకుంటాయి.
 
4. బృహతీ పత్రం: దీనిని ములక అంటారు. దీనిలో చిన్న ములక, పెద్ద ములక అని రెండు రకాలున్నాయి.
 
5. దత్తూర పత్రం: దత్తూర పత్రం అంటే ఉమ్మెత్త. ఇది వంకాయ జాతికి చెందింది. ముళ్ళతో కాయలు వంకాయ రంగు పూలు వుంటాయి.
 
6. తులసీ పత్రం: హిందువులకు తులసి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తులసీ పత్రాలను దేవతార్చనలో వాడతారు.
 
7. బిల్వ పత్రం: బిల్వ పత్రం అంటే మారేడు ఆకు. మూడు ఆకులుగా, ఒక ఆకుగా ఉంటాయి. ఇవి శివునికి చాలా ఇష్టం. శ్రీ మహాలక్ష్మీదేవికి కూడ ఇష్టమైందిగా చెపుతారు.
 
8. బదరీ పత్రం: బదరీ పత్రం అంటే రేగు. దీనిలో రేగు, జిట్రేగు, గంగరేగు అని మూడు రకాలు ఉంటాయి.
 
9. చూత పత్రం: చూత పత్రం అంటే మామిడి ఆకు. ఈ ఆకుకు శుభకార్యాల్లో విశిష్ట స్థానం ఉంది. మామిడి తోరణం లేని హైందవ గృహం పండుగరోజులలో కనిపించదు.
 
10. కరవీర పత్రం: దీనినే గన్నేరు అంటారు. తెలుపు, పసుపు, ఎరుపు రంగుల పూలుంటాయి. పూజలో ఈ పూలకు విశిష్ట స్థానం ఉంది.
 
11. మరువక పత్రం: దీన్ని వాడుక భాషలో ధవనం, మరువం అంటారు. ఆకులు ఎండినా మంచి సువాసన వెదజల్లుతుండటం ఈ పత్రం ప్రత్యేకత.
 
12. శమీ పత్రం: జమ్మిచెట్టు ఆకులనే శమీ పత్రం అంటారు. దసరా రోజుల్లో ఈ చెట్టుకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.
 
13. విష్ణుక్రాంత పత్రం: ఇది నీలం, తెలుపు పువ్వులుండే చిన్న మొక్క. నీలి పువ్వులుండే రకాన్ని విష్ణుక్రాంత అంటారు.
 
14. సింధువార పత్రం: సింధువార పత్రాన్నే వాడుకలో వావిలి అనికూడ పిలుస్తుంటారు.
 
15. అశ్వత్థ పత్రం: రావి ఆకులనే అశ్వత్థ పత్ర మంటారు. రావి చెట్టుకు పూజలు చేయటం మనసంప్రదాయం.
 
16. దాడిమీ పత్రం: దాడిమీ అంటె దానిమ్మ ఆకు. శక్తి స్వరూపిణి అంబకు దాడిమీఫల నైవేద్యం ఎంతో ఇష్టం.
 
17. జాజి పత్రం: ఇది సన్నజాజి అనే మల్లిజాతి మొక్క. వీటి పువ్వుల నుంచి సుగంధ తైలం తీస్తారు.
 
18. అర్జున పత్రం: మద్దిచెట్టు ఆకులనే అర్జున పత్రమంటారు. ఇవి మర్రి ఆకుల్ని పోలి వుంటాయి. అడవులలో పెరిగే పెద్ద వృక్షం ఇది.
 
19. దేవదారు పత్రం: దేవతలకు అత్యంత ఇష్టమైన ఆకు దేవదారు. ఇది చాలా ఎత్తుగా పెరుగుతుంది. ఈ మానుతో చెక్కిన విగ్రహాలకు సహజత్వం ఉంటుంది.
 
20. గండలీ పత్రం: దీనినే లతాదూర్వా అనికూడా అంటారు. భూమిపైన తీగమాదిరి పాకి కణుపులలో గడ్డిమాదిరి పెరుగుతుంది.
 
21. అర్క పత్రం: జిల్లేడు ఆకులను అర్క పత్రమంటారు. తెల్లజిల్లేడు పేరుతో తయారుచేసిన వినాయకప్రతిమను పూజించడం వల్ల విశేష ఫలం వుంటుందంటారు. 
 
ఈ 21 పత్రాలతో వినాయక చవితి రోజున పూజించే వారికి సకల సంపదలు, అష్టైశ్వర్యాలు, కార్యసిద్ధి చేకూరుతుందని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు. 

Monday, September 14, 2015

"రజినీకాంత్‌"కు "భా.జ.పా" వార్నింగ్ ?

తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్‌కు తమిళనాడు భాజపా నాయకులు వార్నింగ్ ఇచ్చారు. అంతగా వార్నింగ్ ఇచ్చే పని రజినీ ఏం చేశారనే కదా మీ డౌట్... మరేంలేదు... రజినీకాంత్ టిప్పు సుల్తాన్ చిత్రంలో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని సమాచారం. దీనితో భాజపా నాయకులు కొందరు ఆగ్రహం వ్యక్తం చేశారు.
 దీనికి కారణం ఏంటంటే.... టిప్పు సుల్తాన్ 18వ శతాబ్దంలో మైసూరును కేంద్రంగా చేసుకుని పాలించాడు. ఆ సమయంలో తమిళులకు వ్యతిరేకంగా ఆయన చర్యలు చేపట్టారు. ఈ నేపధ్యంలో టిప్పు సుల్తాన్ పాత్రలో తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ ఎలా కన్పిస్తారంటూ వారు నిలదీస్తున్నారు. తమిళుల ఆత్మగౌరవానికి సంబంధించిన అంశంలో రజినీకాంత్ తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటారని భావిస్తున్నట్లు సీనియర్ భాజపా నాయకుడు ఎల్ గణేశన్ అన్నారు. 
హిందువులపై దాడి చేసిన టిప్పు సుల్తాన్ చిత్రంలో నటించడంపై రజినీకాంత్ తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కోరారు. ఇప్పటికే ఈ చిత్రంలో నటించేందుకు పలువురు తమిళ నటులు వెనుకంజ వేశారు. ఈ క్రమంలో రజినీకాంత్ కూడా తప్పుకుంటారని తాము అనుకుంటున్నట్లు చెప్పుకొచ్చారు.


Saturday, September 12, 2015

మహేష్ బాబు ఫై " వివాదాస్పద వ్యాఖ్యలు" చేసిన దర్శకుడు తేజ !

‘శ్రీమంతుడు' సినిమా ద్వారా మహేష్ బాబు ఒక మంచి మెసేజ్ జనాల్లోకి తీసుకెళ్లారు. డబ్బులు సంపాదించడం మాత్రమే కాదు... తమ సొంతూర్లను, వెనకబడిన గ్రామాలను దత్తత తీసుకుని అభివృద్ధి పరుచాలనే కాన్సెప్టును సినిమాలో చెప్పడమే కాదు... పలు గ్రామాలను దత్తత తీసుకుని అభివృద్ధి చేసుకునేందుకు ప్లాన్ చేస్తున్నారు. మహేష్ బాబు సినిమా చూసి ఇన్ స్పైర్ అయి పలువురు ప్రేక్షకులు, ఇతర స్టార్స్ కూడా గ్రామాలను దత్తత తీసుకునే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.
అయితే దర్శకుడు తేజ మహేష్ బాబు చేస్తున్న ఈ పనులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసారు. మహేష్ బాబు ఇన్ కం టాక్స్ తగ్గించుకోవడానికే గ్రామాలను దత్తత తీసుకుంటున్నారంటూ వ్యాఖ్యానించారు. హోరా హోరీ సినిమా ప్రమోషన్లో భాగంగా ఇంటర్వ్యూ ఇచ్చిన తేజ మీడియా అడిగిన ప్రశ్నలకు మహేష్ బాబు గురించి ఇలా కామెంట్ చేసారు.


Friday, September 11, 2015

"పేవ్‌మెంట్ పై పడుకున్న రోజుల్లో ట్రాప్ చేయాలని చూశారు" అంటున్న టాప్ హీరోయిన్ ?

ఆమె టాప్ రెమ్యునరేషన్ తీసుకుంటున్న బాలీవుడ్ హీరోయిన్. ఆమె జీవితంలోనూ ఎత్తుపల్లాలు ఉన్నాయి. ఒకప్పుడు సినీ ఛాన్సుల కోసం బాలీవుడ్ ఫిలింనగర్ పరిసర ప్రాంతాల్లో పేవ్‌మెంట్లపైన నిద్రించిందామె. చెప్పులరిగేలా సినిమా ఆఫీసుల చుట్టూ తిరిగుతూ అలసిసొలసి ఫుట్‌పాత్‌పై పడుకుని నిద్రపోతుంటే కొందరు కుర్రాళ్లు ఆమెను వేధించిన సందర్భాలు ఉన్నాయి. 
 
ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరయా అంటే బాలీవుడ్ హైయ్యెస్ట్ రెమ్యునరేషన్ తీసుకుంటున్న కంగనా రనౌత్. నేటివిటీ కోసం అర్థనగ్నంగా సైతం నటించిన చరిత్ర ఆమెకు ఉన్నది. గ్యాంగ్‌స్టర్ చిత్రంతో కెరీర్ స్టార్ట్ చేసిన ఈ భామ సినీ ఛాన్సుల కోసం ఆఫీసులకెళితే ఎందరో ట్రాప్‌లో వేయాలని చూశారనీ, ఐతే వారందరినీ ఎదిరించి వారిపై పోలీసు కేసులు కూడా పెట్టినట్లు వెల్లడించిందీ భామ. తన జీవిత చరిత్రను పుస్తకంగా తీసుకు రావాలని ప్రయత్నం చేస్తున్నట్లు చెపుతోంది.


Thursday, September 10, 2015

అందంగా కనిపించాలంటే మధ్యాహ్నం ఎంతసేపు "నిద్ర" పోవాలో తెలుసా ?

అందంగా కనిపించాలంటే పగటి పూట నిద్రపోకూడదని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. అందంగా ఉండాలని, బరువు పెరగకూడదనుకుంటే మధ్యాహ్నం పూట గంటల పాటు నిద్రపోకుండా అరగంట మాత్రమే నిద్రపోవాలి. ఇంకా అందంగా కనిపించాలనుకుంటే  నిద్ర విషయంలో అత్యంత జాగ్రత్త తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. 

Wednesday, September 9, 2015

నాతో నటించనని చెప్పిన " హీరోయిన్లపై కసి తీర్చుకుంటా"నంటున్న హీరో !


తమిళ నటుడు ప్రేమ్ జీ అంటే హీరోయిన్లు పరార్ అవుతారు. దానికి కారణాలు అనేకం. ఆయనతో నటిస్తే ఇక కెరీర్ మటాష్ అవుతుందని  హీరోయిన్లు అనుకుంటుంటారన్నది కోలీవుడ్ టాక్. అదలావుంటే అతడు నటించిన "మాంగా" అనే తమిళ చిత్రం ఈ నెల 11న విడుదలకు సిద్ధమవుతోంది. ఈ నేపధ్యంలో చిత్ర విశేషాలను వివరిస్తూ ప్రేమ్ జీ... తనతో నటించనని చెప్పిన హీరోయిన్లపై కసి తీర్చుకుంటానని చెప్పుకొచ్చాడు. దీనిపై అతడు స్పందిస్తూ... ఈ సినిమాలో హీరోయిన్ పాత్ర కోసం చాలామంది టాప్ హీరోయిన్లను సంప్రదించడం జరిగింది. 

ఈ చిత్రంలో నేను హీరో అని తెలిసి వాళ్లంతా ముఖం చాటేశారు. అలా తనతో నటించని హీరోయిన్లు ఎవరో ఓ లిస్టు తయారుచేసుకున్నాను. త్వరలోనే నేను  కోలీవుడ్ ఇండస్ట్రీలో అగ్రస్థాయికి చేరుకుని నాతో నటించనని చెప్పిన హీరోయిన్లందరినీ అమ్మ, అక్క పాత్రల్లో నటింపజేసుకుని వారిపై ఆవిధంగా కసి తీర్చుకుంటానని సెటైర్లు విసిరాడు. ఇంతకీ ఆ హీరోయిన్లు ఎవరోమరి ?

Tuesday, September 8, 2015

"అర్థరాత్రి కూడా ఆ నగరాల్లో మహిళలు ఒంటరిగావెళ్ళొచ్చట"

అర్థరాత్రి మహిళ ఒంటరిగా తిరిగినప్పుడే భారత దేశానికి నిజమైన స్వాతంత్ర్యం వచ్చిందని భావించాలని పూజ్య బాపూజీ అన్నారు.కానీ ఇప్పుడు రాత్రి పూట కాదు.. పగలు కూడా మన భారత దేశంలో భద్రత కరువైన నేపథ్యంలో.. కొన్ని నగరాల్లో మాత్రం ఇప్పటికీ మహిళలు అర్థరాత్రి పూట యధేచ్చగా ఒంటరిగా వెళ్ళొచ్చని సర్వేలు తేల్చాయి. మహిళా భద్రతకు ప్రపంచంలోని 12 నగరాలు కట్టుబడి ఉన్నాయని సర్వేలు వెల్లడించాయి. 
 
వీటిలో జపాన్ లోని టోక్యో నగరం అత్యంత భద్రమైన పట్టణంగా పేరొందిందని తాజా సర్వేలు తేల్చాయి. తర్వాత దక్షిణ కొరియాలో సియోల్ పట్టణం మహిళలకు భద్రమైన నగరమని పేర్కొంది. సౌత్ కెనడాలోని టొరెంటో మూడో స్థానంలో నిలిచింది. 
 
దుబాయ్ కూడా భద్రతలో బెస్టని సర్వే వెల్లడించింది. వీటితో పాటు మెల్ బోర్న్, న్యూయార్క్, శాన్ ప్రాన్సిస్కో, జ్యూరిచ్, ఆమ్ స్టర్ డ్యామ్, రేక్జావిక్, హోచిమిన్ సిటీ, క్వీన్స్ టౌన్ పట్టణాలు మహిళల స్వేచ్ఛా జీవనానికి అనువుగా ఉన్నాయని సర్వేలు తేల్చాయి.
 


Monday, September 7, 2015

"మెగాస్టార్ ఫ్యామిలీ గురించి రాజమౌళి సంచలన వ్యాఖ్యలు"

మెగాస్టార్ ఫ్యామిలీ గురించి టాలీవుడ్‌కు చెందిన  దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి సంచలన వ్యాఖ్యలు చేశారు. మెగా ఫ్యామిలీ నుంచి వెండితెరకు హీరోగా పరిచయం కావడం ఓ శాపమని వ్యాఖ్యానించాడు. దీనిపై ఫిల్మ్ నగర్‌లో ఓ పెద్ద చర్చే జరుగుతోంది. అయితే, రాజమౌళి మాటల వెనుక ఉన్న పరమార్థాన్ని అర్థం చేసుకున్న వారు మాత్రం ఈ వ్యాఖ్యలను పెద్ద సీరియస్‌గా తీసుకోవడం లేదు. వరుణ్ తేజ్ - క్రిష్ కాంబినేషన్‌లో తెరకెక్కిన చిత్రం 'కంచె'. ఈ చిత్రం ట్రైలర్ విడుదల కార్యక్రమంలో రాజమౌళి కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లడుతూ "ఒక పెద్ద కుటుంబం నుండి వచ్చి హీరోగా మారడం ఒక వరం. అయితే, మెగా కుటుంబం నుంచి హీరోగా రావడం వరమే కాదు శాపంగా కూడా మారుతోందంటూ" వ్యాఖ్యానించారు.
 దీనికి కారణం మెగా కుటుంబం నుంచి వచ్చిన హీరోలపై ప్రేక్షకులలో భారీగా అంచనాలు పెరిగి పోతున్నాయని అందువల్ల ఆ అంచనాలకు తగ్గట్టుగా హీరో వరుణ్ తేజ్ తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్‌ను ఏర్పరుచుకోవాలని అప్పుడే ఈ తీవ్రమైన పోటీలో వరుణ్ తేజ్ నిలబడగాలుగుతాడంటూ వివరణ ఇచ్చారు. ప్రస్తుత పరిస్థితులలో ఒక సినిమాను తీసి ప్రేక్షకులను మెప్పించాలి అంటే ఎంత కష్టమో తనకు తెలుసని, అందుకే ఈ తరహా వ్యాఖ్యలు చేసినట్టు చెప్పారు.

Saturday, September 5, 2015

14 - 16ఏళ్లకే సెక్సుకు తొందరపడిపోతున్నారు ! ఎక్కడో తెలుసా ?

ఇండియాకు కూడా ఫారిన్ కల్చర్ వచ్చేస్తోంది. టీనేజీ వచ్చీ రాగానే సెక్సుకు తొందరపడిపోతున్నారా..!  14ఏళ్ల వయస్సులోనే అబ్బాయిలు, సుమారు 16ఏళ్ల వయస్సులో అమ్మాయిలు తమ తొలి శృంగార అనుభవం పొందేందుకు ఆసక్తి చూపుతున్నారా..? నగర సంస్కృతిలో ఇది భాగమై పోతోందని ఓ సర్వేలో వెల్లడయింది. 
 
భారత్‌లో సెక్స్ అన్నది నిషిద్ధ పదమైనప్పటికీ, ఈ సర్వేలో ఇప్పుడు సెక్స్ఎడ్యుకేషన్ ఆవశ్యకతపై చర్చ జరగాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇండియాలోని ప్రధాన నగరాల్లో తొలి లైంగిక అనుభవం పొందిన అబ్బాయిల సగటు వయస్సు 14ఏళ్ళు ఉండగా.. అమ్మాయిల వయస్సు కాస్త ఎక్కువగా ఉంది. టైమ్స్ ఆఫ్ ఇండియా ఓ నివేదిక ప్రచురించింది. 
 
దాదాపు 20నగరాల్లో 13నుంచి 19ఏళ్ళ మధ్య వయస్సున్న 15వేలమంది టీనేజర్లను ఇంటర్వ్యూ చేసినప్పుడు.. 8.9 శాతం మంది  లైంగిక వ్యాధికి గురైనట్టు తేలింది. 6.3శాతం మంది అబ్బాయిలు, 1.3శాతం మంది అమ్మాయిలు ఫస్ట్ సెక్స్ ఎక్స్‌పీరియన్స్ పొందారని, వీళ్ళ వయస్సు 14 - 16ఏళ్లమధ్య ఉందని సర్వే తెలిపింది. 


Friday, September 4, 2015

ఎవరికి "ఏ వ్యాధి వస్తుందో ముందే చెప్పేగోళ్లు"

డాక్టర్ చెయ్యి పడకుండానే, రక్త పరీక్షలు చేయకుండానే కేవలం ముఖ కవలికలను బట్టి, చేతి వేళ్ల చూసి వారికి భవిష్యత్తులో ఏ రకం వ్యాధులు శోకే అవకాశం ఉందో అని కొందరు అతి సులభంగా పసిగట్టేస్తుంటారు. కానీ వారు చెప్పే విషయాలను ఎవరూ నమ్మరు. అయితే అది నిజం. గోళ్ల ఆకృతి, రంగును బట్టి వారు భవిష్యత్తులో ఎటువంటి వ్యాధుల బారినపడే అవకాశం ఉందో అతి సులభంగా చెప్పవచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు. 
 
కొంత మందికి గోళ్లు పెరిగి వాటంతట అవే విరిగిపోతుంటాయి. ఇలాంటి వారికి కాల్షియం, విటమిన్ డి లేదా జింక్ లోపం ఉందని తెలుసుకోవచ్చట. అటువంటి వారు కొవ్వు తక్కువ శాతం ఉన్న పాలపదార్థాలు, చేపలు వంటి వాటిని తినడం ద్వారా కాల్షియం, విటమిన్ డి, జింక్ సమకూర్చుకోవచ్చని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. 
 
కొంతమందికైతే గోళ్లు పెరగనే పెరగవు. కొన్ని సార్లు పెరిగినా పాలిపోయినట్లు కనిపిస్తుంటాయి. ఇలాంటి గోళ్లు గల వారికి రక్తహీనత, పోషకాహార లోపం ఉందని గ్రహించాలి. దీని వల్ల గుండె లేదా కాలేయానికి సంబంధించిన వ్యాధుల బారినపడే ప్రమాదముందని నిపుణులు సూచిస్తున్నారు. ఇంకొందరి గోళ్లు మందంగా పసుపు రంగులో, నెమ్మదిగా పెరుగుతుంటాయి. ఇలాంటి గోళ్లు గలవాళ్లు ఊపిరితిత్తుల వ్యాధుల బారినపడే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వీరు విధిగా ధైరాయిడ్ పరీక్షలు చేయించుకోవాలని కూడా సూచిస్తున్నారు. 
 
గోళ్లు నీలం రంగులో ఉంటే శరీరానికి తగినంత ఆక్సిజన్ లభించడం లేదని భావించాలని, గోళ్లు అలా మారితే ఊపిరితిత్తులు, గుండె సంబంధమైన వ్యాధులు వచ్చే అవకాశం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. గోళ్లు తెల్లగా ఉన్నా లేక గోళ్ల మధ్యలో తెల్లని చారలు కనిపిస్తున్నా సదరు వ్యక్తికి లివర్ సంబంధిత వ్యాధులు సోకే ప్రమాదం ఉందట. లేదంటే హైపటైటిస్ వ్యాధి బారినపడే ప్రమాదం ఉందని వారు చెబుతున్నారు. 


Thursday, September 3, 2015

చిరు, చెర్రీల పై "కోపం"గా ఉన్న నాగార్జున !

టాలీవుడ్‌లో నాగార్జున-చిరంజీవి మంచి స్నేహితులు. వ్యక్తిగతంగా మంచి ఫ్రెండ్స్. అయితే చిరంజీవి, చెర్రీ అంటేనే ప్రస్తుతం నాగార్జునకు భలే కోపమొస్తోందట. రామ్ చరణ్ బ్రూస్లీ, అఖిల్‌కు చెందిన అఖిల్ సినిమా షూటింగ్ జెట్ స్పీడ్‌లో సాగుతోంది. ఈ నేపథ్యంలో బ్రూస్లీ మేకర్స్ అక్టోబర్ 15న చెర్రీ సినిమాను రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు. 
 
అలాగే అఖిల్ మూవీ కూడా అక్టోబర్ 21న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేశారు. అయితే చెర్రీ కూడా బ్రూస్లీని అక్టోబర్ 21వ తేదీకే గ్రాండ్‌గా రిలీజ్ చేయాలని అంతా సిద్ధం చేశాడట. దీంతో అక్కినేని నాగార్జున చెర్రీ అంటేనే మండిపడుతున్నారు.  
అందుకే నాగార్జున మెగాస్టార్, రామ్ చరణ్ అంటే కోప్పడుతున్నారని.. అఖిల్ ఫస్ట్ మూవీ సినిమా రిలీజ్‌కు ఫిక్స్ చేసిన రోజునే చెర్రీ కూడా తన సినిమాను విడుదల చేసేందుకు రెడీ కావడం ఎందుకని నాగ్ ఫైర్ అవుతున్నారట. మరి ఏం జరుగుతుందో వేచి చూడాలి. 

Wednesday, September 2, 2015

"ఆరోగ్యం"తో పాటు"ఆయుష్యు"నూ పెంచుకోవాలంటే "ఉపవాసం" చేయాల్సిందే !

మనిషి ఎంత ఎక్కువ తింటే అంత శక్తి పెరుగుతుంది. అయితే ఎంత తక్కువ తింటే అంత ఎక్కువ ఆరోగ్యంగా ఉంటారని, ఆయుష్యు కూడా పెరుగుతుందని తెలుస్తోంది. ఈ విషయం దక్షిణ కరోలినా వర్శిటీ నిపుణులు చేసిన తాజా అధ్యయనం ద్వారా తేలింది. కండపుష్టి కోసం కావలసినంత తింటే చాలునట. కాస్త తక్కువ తింటే మరీ మంచిదని అంటున్నారు నిపుణులు. 
 
అంతేకాదండోయ్.. అప్పుడప్పుడు ఉపవాసాలు ఉండటం లేదా ఒంటి పూట భోజనం చేయడం వంటి పద్ధులేవైనా కావచ్చు. నెలకు కనీసం ఐదు రోజులు శరీరానికి రోజువారీ అవసరమైన కేలరీల్లో సగానికి సగం తగ్గించి తీసుకున్నట్లయితే చాలా ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చని అంటున్నారు. ఇటువంటి ఆహారపు పద్దతుల వలన కేన్సర్, హృద్రోగాలు, మధుమేహం వంటి వ్యాధులు దరిచేరవట.
 
ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే ఈ విధంగా అవసరానికి కంటే తక్కువ ఆహారం తీసుకునేవాళ్లు ఎక్కువ కాలం బతుకుతారట. నెలకు కనీసం ఐదు రోజులు ఆహారంలోని కేలరీల్లో 34 నుంచి 54 శాతం మేరకు తగ్గించుకోగలిగితే వారి ఆయుష్యు బాగా పెరుగుతుందని నిపుణులు తేల్చి చెబుతున్నారు. ఇదే పద్దతిని వారు ఎలుకలపై జరిపి మంచి ఫలితాలను పొందినట్టు తెలుపుతున్నారు. 
 
ఈ ప్రయోగంలో వారు ఎచ్చుకున్న ఎలుకలకు నాలుగు రోజుల చొప్పున నెలకు రెండుసార్లు ఆహారం తగ్గించగా, అవి మిగిలిన ఎలుకల కంటే ఆరోగ్యంగా, ఎక్కువ కాలం బతికాయని నిపుణులు స్పష్టం చేశారు.
 


Tuesday, September 1, 2015

"బట్టతల"కు వాడే మందులతో "లైంగిక సామర్ధ్యం" తగ్గిపోతుందట !

బట్టతలతో బయట తిరగలేకున్నానని అనుకునే వారి సంఖ్య చాలా ఎక్కువగా ఉంటుంది. దానిని కప్పిపుచ్చుకోవడానికి పురుష పుంగువలు పడే పాట్లు అన్నీ ఇన్నీ కావు. కొందరు మందులు కూడా వాడుతుంటారు. అయితే దాని వలన సంసార జీవితానికే ఎసరు వస్తుందని పరిశోధనలు తెలుపుతున్నాయి. వివరాలిలా ఉన్నాయి. 
 
బట్టతలతో ఇబ్బంది పడుతూ ఒత్తైన జుట్టు కోసం పురుషులు వాడే మందులు వారి లైంగిక జీవితాన్ని నాశనం చేస్తున్నాయట. తాజాగా జరిగిన ఓ అధ్యయనం ఈ మేరకు తేల్చింది. ఇదే విషయాన్ని చికిత్స చేస్తున్న వైద్యులు, తమ వద్దకు వచ్చే పేషంట్లకు చెప్పి మరీ ట్రీట్ మెంట్ ప్రారంభిస్తున్నారట. 
 
బట్టతల తొలగించుకోవాలన్న పురుషుల గట్టి పట్టుదల వైద్యుల హెచ్చరికలను డామినేట్ చేస్తుందట. దీంతో ముందైతే చికిత్స ప్రారంభించండి... తర్వాత చూద్దామంటూ వారు వైద్యులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తున్నారట. ఈ తరహా మందుల్లో ఫినాస్టెరాయిడ్, డూటాస్టెరాయిడ్ (ప్రోస్కార్, అవోడార్ట్)లు ఉంటాయి. 
 
వీటి కారణంగానే ఈ మందులను వాడే వారి లైంగిక సామర్ధ్యం తగ్గిపోతుందని తేలింది. అయితే ఈ ప్రభావం కొందరిలో తాత్కాలికంగానే కనిపించినా, మరికొందరిలో పెను ప్రభావాన్నే చూపుతుందట. లైంగిక సామర్థ్యం తగ్గడంతోపాటు, కొందరిలో అనాసక్తత చాలా ఎక్కువగా కనిపిస్తుందట.