CSS Drop Down Menu

Monday, November 30, 2015

ఆడ పిల్లలఫై "దారుణమైన" అనాగరిక చర్యలు !

కేమరూన్, నైజీరియా, సౌత్ ఆఫ్రికా..  ఈ మూడు దేశాల్లో ఆడ పిల్లలుగా పుట్టడం కంటే.. అడవిలో మానై పుట్టడమే మేలనుకుంటారట. అక్కడ ఆడపిల్లలు యుక్తవయసుకొస్తున్నారంటే చాలు. ప్రాణాలు గిజగిజలాడి పోతాయట. వయసు తో బాటు  నాచురల్ గా పెరిగే  ఛాతి పెరగకుండా వాటిని ఆటవిక పధ్ధతుల్లో అణిచి వేస్తారట.


బ్రెస్ట్ ఐరనింగ్ అని పిలిచే ఈ ప్రక్రియలో ఛాతి కనపించకుండా అణచివేస్తే ఆడపిల్లల వయసు దాచిపెట్టడంతో బాటు, వారి  మీద మగవాళ్ల కన్ను పడకుండా ఉండేందుకు ఈ ఆటవిక పద్దతిని అవలంబిస్తున్నారట. ఈ అనాగరిక మూఢ నమ్మకంలో తల్లులే ముఖ్య పాత్ర వహిస్తున్నట్టు యునైటెడ్ నేషన్స్ నివేదిక పేర్కొంది. తమ పిల్లలకు బ్రెస్ట్ ఐరనింగ్ చేస్తే  లైంగిక వేధింపులు, అత్యాచారాలనుంచి  రక్షణ కలుగుతుందన్న మూఢనమ్మకమేకారణమట.


ఈ బ్రెస్ట్ ఐరనింగ్ కారణంగా ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా 3.8 మిలియన్ల మంది  నానా హింస బారిన పడి నరకం చూస్తున్నట్టు యూ ఎన్  నివేదిక పేర్కొంది. ఆడతనాన్ని ప్రతిబింబించే ఛాతి పెరగనీయకుండా ఉండేందుకు  తల్లులు ఆశ్రయిస్తున్న అనాగరిక పద్దతి దారుణంగా ఉంటుందట. పెద్ద పెద్ద రాళ్లు, లేదా వెడల్పాటి గరిటె లాంటి దాన్ని బొగ్గుల మీద కాల్చి వాటితో ఛాతిని అణుస్తారట. ఈ పద్ధతిలో  బ్రెస్ట్ టిష్యూ దారుణంగా దెబ్బ తింనడం వల్ల  ఆడతనం అణిగిపోతుందనేది తల్లుల భావనట.

 కామెరూన్, నైజీరియా, సౌత్ ఆఫ్రికా తదితర ప్రాంతాల్లో జరుగుతున్న ఈ ఆనాగరిక ఆచారంలో 58 శాతం తల్లులే ప్రధానంగా ఉన్నారని పబ్లి్క్ హెల్త్  సర్వీస్ లెక్కలు చెబుతున్నాయి. డబ్బున్న  కుటుంబాలకు చెందిన యువతులైతే వెడల్పాటి బెల్టు గట్టిగా చుట్టుకుంటారట. దీని కారణంగా ఛాతి పెరగవట.

ముఖ్యంగా 11,15 సంవత్సరాల మధ్య వయసున్న ఆడపిల్లల్లో శరీర భాగాలు  పురుషుల కంట బడనీయక పోతే మగాళ్ళ కళ్ళు తమ పిల్లల మీద పడవని ఆ తల్లుల నమ్మకమట. మహిళల మానసిక స్థితి మీద కూడా ప్రభావం చూపుతున్న  ఈ అనాగరికపు ఆచారం మీద ఇప్పుడిప్పుడే చైతన్యం ప్రారంభమైంది.

Saturday, November 28, 2015

శృంగారం "రోజూ"కంటే,"వారాని"కొక్కసారే మంచిదంట ?

దంపతుల రోజువారీ సెక్స్‌పై సొసైటీ ఫర్ ది పర్సనాలిటీ అండ్ సోషల్ సైకాలజీ అనే సంస్థ ఓ సర్వే నిర్వహించగా, ప్రతి రోజూ సెక్స్‌లో పాల్గొనేవారికంటే.. వారంలో ఒక్కసారే శృంగారంలో పాల్గొనే దంపతులు ఎంతో సంతోషంగా ఉన్నట్టు తేలింది. ఈ సర్వేను అమెరికాలో 14 యేళ్ళపాటు.. మూడు దఫాలుగా నిర్వహించారు. తొలి దఫాలో 25 వేల అమెరికా జంటలపై నిర్వహించారు. ఇందులో 11285 మంది పురుషులు, 14225 మంది స్త్రీలు పాల్గొన్నారు. రెండో దఫాలో 335 మందిపై (138 మంది పురుషులు, 197 మంది స్త్రీలు), మూడో దఫాలో 2400 మంది జంటలపై నిర్వహించారు. 
 
ఈ సర్వే ప్రకారం 'ఎంత ఎక్కువగా సెక్స్‌లో పాల్గొంటే అంత ఎక్కువ హ్యాపీగా ఉంటామని చాలా మంది భావిస్తారని, అది అక్షరాలా శుద్ధ తప్పని చెపుతోంది. నిజానికి తక్కువ సార్లు శృంగారంలో పాల్గొనేవారే ఎక్కువ హ్యాపీగా ఉంటారు. సెక్స్‌లో ఎక్కువసార్లు పాల్గొనాలనే ఆతృతతో చాలామంది తమ భాగస్వామిని బలవంతం చేస్తుంటారు. దాంతో వారు ఇష్టం లేకపోయినా.. తప్పని పరిస్థితుల్లోనే సెక్స్‌లో పాల్గొంటుంటారు. ఇది వారి సంబంధాలను దెబ్బ తీస్తుందని ఈ సర్వేలో తేలింది. 
 
అందువల్ల శృంగారంలో పాల్గొనే దంపతులిద్దరూ సంతోషంగా గడపాలంటే ఇద్దరికీ నచ్చినపుడే సెక్స్‌కు సిద్ధపడాలని, అయితే సెక్స్‌ చేయకపోయినా ఇద్దరూ ఎక్కువ సమయం జంటగా గడపాల' ఈ పరిశోధన చెపుతోంది. పైగా, దీనికి వయస్సుతో సంబంధం లేదని, నవ దంపతులైనా, పాత దంపతులైనా సరే ఇది అందరికీ వర్తిస్తుందని ఈ సంస్థకు చెందిన పరిశోధకులు చెపుతున్నారు.
 


Friday, November 27, 2015

"శృంగారానికి" "తమలపాకులకి" గల సంభందం?

విందు భోజనం ఆరగించాక.. తమలపాకుల్ని, పాన్ మసాలాను తీసుకోవడం పరిపాటి. అయితే తమలపాకులో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు దాగివున్నాయి. మౌత్ ఫ్రెష్నర్‌గా ఉపయోగపడే తమలపాకును నమలడం ద్వారా సెక్స్ లైఫ్‌కు బూస్ట్ నిచ్చినవారవుతారని తాజా అధ్యయనంలో తేలింది. తమలపాకుల్ని నమలడం ద్వారా అజీర్ణ సంబంధిత రోగాలు నయమవుతాయి. 
 
తమలపాకుల్లోని అప్రోడియాస్టిక్ పదార్థాలు సెక్సు లైఫ్‌ను మెరుగుపరుస్తాయి. దీంతో పాటు రక్తంలోని చక్కెర స్థాయుల్ని తమలపాకులు క్రమబద్ధీకరిస్తాయి. తమలపాకులో కాస్త తేనెను చేర్చి నమిలితే దగ్గు మటుమాయం అవుతుంది. అంతేగాకుండా.. చర్మ సంబంధిత వ్యాధులను దూరం చేసుకోవాలంటే.. తమలపాకుల రసాన్ని  సేవించడం ఉత్తమమని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.

Thursday, November 26, 2015

అమితాబ్ బయట పెట్టిన "షాకింగ్" న్యూస్ ?

బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ షాకింగ్ విషయం బయట పెట్టారు. బిగ్ బి తరచూ అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతుండటం... మళ్లీ వెంటనే కోలుకుంటుండటం అందరికీ తెలిసిందే. అయితే ఆయనకు సీరియస్ అనారోగ్యం ఏమీ లేదని అభిమానులు భావిస్తూ వచ్చారు. తాజాగా అమితాబ్ ఓ షాకింగ్ విషయం బయట పెట్టారు. తనకు హెపటైటిస్ బి వైరస్ సోకిందని, దాని వల్ల 75 శాతం లివర్ పాడైపోయిందని కేవలం 25 శాతం లివర్ మాత్రమే ఆరోగ్యంగా ఉందని చెప్పారు. 1983లో కూలీ సినిమా షూటింగ్‌లో అమితాబ్ తీవ్రంగా గాయపడ్డారు. ఆ సమయంలో ఆయనకు రెండొందల మంది రక్తమిచ్చారు. ఇందులో ఒకరి రక్తం నుంచి హెపటైటిస్ బి వచ్చిందని అనుమానిస్తున్నారు.
ఈ విషయం గురించి అమితాబ్ మాట్లాడుతూ..‘కూలీ మూవీ సెట్లో యాక్సిడెంట్ తర్వాత హెపటైటిస్ బి నాకు యాక్సిడెంటల్ గా వ్యాపించింది. ఆ సమయంలో నాకు దాదాపు 200 మంది రక్తదానం చేసారు. దాదాపు 60 బాటిళ్ల రక్తం ఎక్కించారు. ఈ క్రమంలోనే ఆ వైరస్ వచ్చి ఉంటుంది. చాలా కాలం అనంతరం వివిధ టెస్టుల తర్వాత ఈ విషయాన్ని గుర్తించారు' అని తెలిపారు. 2000 సంవత్సరం వరకు, అంటే యాక్సిడెంట్ అయిన 18 ఏళ్ల వరకు ఎలాంటి సమస్యా రాలేదు. మెడికల్ చెకప్స్ లో అంతా నార్మల్ గానే వచ్చింది. కొంత కాలం తర్వాత దాదాపు 75 శాతం లివర్ పాడైనట్లు గుర్తించారు. ఇపుడు నేను మీ ముందు నిలబడ్డానంటే కేవలం 25 శాతం లివర్ ఆరోగ్యంగా ఉండటం వల్లే  అని వెల్లడించారు.

Wednesday, November 25, 2015

వయాగ్రా "శృంగారానికే" కాదు ! "షుగర్ ని తగ్గించడానికి" కూడా !!

సాధారణంగా వయాగ్రా అంటే శృంగార భావనలను ప్రేరేపించే ఉత్ప్రేరకంగా మాత్రమే ప్రతి ఒక్కరికీ తెలుసు. అంటే శృంగార భావనలను ప్రేరేపించి అంగానికి రక్తసరఫరా పెంచి... అంగం గట్టిపడేందుకు దోహదపడుతుంది. అయితే, ఇది డయాబెటిస్ నిరోధకాలుగా కూడా పని చేస్తాయని తాజా అధ్యయనంలో తేలింది. 
సాధారణంగా రక్తంలోని చక్కెర స్థాయిని బట్టి డయాబెటీస్‌ను నిర్ధారిస్తారు. రక్తంలోని చక్కెర స్థాయిలు పరగడుపున 90 ఎమ్‌జీ, భోజనం తర్వాత 180 ఎమ్‌జీ దాటితే డయాబెటిస్‌గా నిర్ధారిస్తారు. అయితే డయాబెటిస్‌ కంటే ముందు దశను ప్రీ డయాబెటిస్‌ అంటారు. ప్రీ డయాబెటిస్‌ స్టేజ్‌లో ఉండగానే ఈ వయాగ్ర మాత్రలను వాడితే డయాబెటిస్‌ రాకను నిరోధిస్తాయట. 
సిల్డెనఫిల్‌ అనే వయాగ్ర మాత్ర ఇన్సులిన్‌ నిరోధకతను అడ్డుకోవడం ద్వారా ఇది టైప్‌-2 డయాబెటిస్‌ను అడ్డుకుంటుందట. ప్రీ డయాబెటిస్‌ స్టేజ్‌లో ఉన్న 51 మందికి ఈ మందును మూడు నెలలపాటు ఇచ్చి పరీక్షించగా వారి రక్తంలో చక్కెర స్థాయులు నార్మల్‌గానే ఉన్నట్టు తేలిందట. దీనిపై మరింత లోతుగా పరిశోధించి త్వరలోనే మరిన్ని వివరాలు బయటపెడతామని యూఎస్‌ స్కూల్‌ ఆఫ్‌ మెడిసన్‌ పరిశోధకుడు డాక్టర్‌ నాన్సీ బ్రౌన్‌ అంటున్నారు. 

Tuesday, November 24, 2015

"సీతాఫలాలు" ఎవరు తినవచ్చు? ఎవరు తినకూడదు?

సీతాఫలం అన్ని దేశాలలోనూ విరివిగా దొరికే  పండు. ఈ పండును గుండె జబ్బు ఉన్నవారు సీజన్‌ ఉన్నంతవరకు తప్పకుండా తింటుంటే.. గుండె సంబందిత సమస్యల నుండి ఉపశమనం ఉంటుంది. గుండె కొట్టుకునే తీరును సీతాఫలం క్రమబద్ధీకరిస్తుంది.
విటమిన్లు, లవణాలు అధికంగా ఉండి,  మీగడలాంటి గుజ్జుతో, ప్రత్యేక రుచితో చిన్నా, పెద్దా అందరి నోళ్లలోనూ నీళ్లూరిస్తుంది. ఈ పండును సీజన్ ముగిసేంతదాకా ప్రతిరోజూ తీసుకున్నట్లయితే ఆరోగ్యానికి మంచి చేయటమేగాకుండా, ఎన్నో పోషక విలువలను శరీరానికి అందిస్తుంది.
సీతాఫలంలో కొవ్వు ఏ మాత్రం ఉండదు. ఒక్కో సీతాఫలంలో 200 క్యాలరీలవరకు శక్తి ఉంటుంది. కార్బోహైడ్రేట్లు 48, ఫైబర్ 6 గ్రాముల.. విటమిన్ సి 50 శాతం, కాల్షియం 2 శాతం, ఐరన్ నాలుగు శాతం, సోడియం పది మిల్లీగ్రాములు ఈ పండులో లభిస్తాయి. నీరసంగా ఉన్నప్పుడు ఈ పండ్లను ఒకటి లేదా రెండింటిని తిన్నట్లయితే శరీరానికి కావాల్సినంత గ్లూకోజ్ లభిస్తుంది.
ఈ పండు తింటుంటే కండరాలు బలోపేతం అవుతాయి. బలహీనత, సాధారణ అలసటను సైతం దూరం చేస్తుంది. వాంతులు, తలనొప్పి విరుగుడుగా పనిచేస్తుంది. చర్మ వ్యాధులకు మంచి మందుగా పనిచేస్తుంది. ఇందులోని మెత్తని గుజ్జు పిల్లల ఎదుగుదలకు సహకరిస్తుంది. ఎదిగే పిల్లలకు ఎముకల పుష్టిని కలిగిస్తుంది. ప్రతిరోజూ తింటుంటే జుట్టు నల్లగా ఆరోగ్యంగా మెరుస్తుంది. కుదుళ్లకు దృఢత్వానిస్తుంది.
పేగుల్లో వుండే హెల్మింత్స్‌ అనే నులిపురుగుల నివారణలో సీతాఫలం ప్రభావవంతంగా పనిచేస్తుంది. ఈ పండు గుజ్జు అల్సర్లపై చక్కటి మందులాగా పనిచేసి ఉపశమనాన్నిస్తుంది. త్రిదోష నివారిణిగా శరీరంలో వుండే వాత, పిత్త కఫ దోషాన్ని తగ్గించడంలో ప్యూరిఫైర్‌గా పనిచేస్తుంది.
అయితే.. ఆస్తమా ఉన్నవారు మాత్రం ఈ సీతాఫలంను తీసుకోకూడదు. మధుమేహం ఉన్నవారు తినకూడదు. ఒకవేళ తినాలనిపిస్తే మామూలుగా పండిన పండును మాత్రం తింటే ఎలాంటి బాధా ఉండదు. అదే ఎక్కువగా పండిన పండును మాత్రం తిన్నట్లయితే అందులో గ్లూకోజ్‌ శాతం ఎక్కువగా ఉండి, చక్కెర వ్యాధి గ్రస్తులకు ఎక్కువగా హాని చేస్తుంది. అలాగే లివర్‌ వ్యాధితో, మూత్రపిండాల వ్యాధితో బాధపడేవారు సైతం ఈ సీతాఫలానికి దూరంగా ఉండాలి.


Monday, November 23, 2015

పరిశోధకులకు సైతం అంతుచిక్కని "నదిలా పారిన ఇసుక"

ప్రకృతి వింతల్లో ఇదో అద్భుతమైన వింత..నీటి ప్రవాహాన్ని, లావా ప్రవాహాన్ని చూశాం. కానీ నదిలా పారే ఇసుకను చూడాలంటే ఇరాక్ వెళ్ళాల్సిందే. అక్కడి విచిత్ర వాతావరణమే ఇందుకు కారణమని అంటున్నారు. భారీ వర్షాలు, మంచు, ఇసుక తుపానులు ఇరాక్‌‌లో కనీవినీ ఎరుగని పరిస్థితులను సృష్టిస్తున్నాయి.

 ఆ దేశంలో క్లైమేట్ పూర్తిగా మారిపోయింది. కంకర రాళ్ళు, ఇసుక నీటి ప్రవాహంలా కొట్టుకుపోతున్నాయి. ఓ ఇరాకీయుడు ఆశ్చర్యంగా ఈ వండర్‌ని చూస్తూ నిల్చుండిపోయాడు. ఈ వీడియో నెట్‌లో హల్‌‌చల్ చేస్తోంది. భూగర్భ పరిశోధకులు సైతం ఈ వింతకు నిర్దిష్టమైన కారణాన్ని చెప్పలేకపోతున్నారు.

ఈ వింత మీరు కూడా చూడాలనుకొంటే ఈ క్రింది లింక్ క్లిక్ చెయ్యండి .


Saturday, November 21, 2015

"కార్డు" లేకుండా ఏటీఎం నుంచి డబ్బు !

ఏటీఎం కార్డు లేకుండానే డబ్బులు తీసుకునే కొత్త టెక్నాలజీ మిషిన్‌లను చైనా ప్రారంభించింది. ఫేస్ రికగ్నైజేషన్ టెక్నాలజీని ఉపయోగించి... మన ముఖమే ఏటీఎం కార్డులా పని చేస్తుంది! తాజా టెక్నాలజీ ద్వారా జేబులో పెట్టుకోవాల్సిన ఏటీఎం కార్డుతో అవసరమే ఉండదు. కార్యాలయంలో అటెండెన్సు కోసం వాడే బయోమెట్రిక్ సాంకేతిక.. ఐరిస్ ఆధారంగా హాజరు పడుతుంది. దానినే కొంచెం మార్చి ముఖాన్ని గుర్తించి, ఒక పాస్ వర్డ్ అడిగి, దానిని బట్టి ఖాతాకు సంబంధించిన కార్యకలాపాలు చేసుకునే సరికొత్త టెక్నాలజీని చైనా పరిశోధకులు అభివృద్ధి చేశారు.
ఇలాంటి పది మిషన్లను చైనా మర్చంట్ బ్యాంక్ వివిధ నగరాలలో ఏర్పాటు చేసింది. ముఖాన్ని స్కాన్ చేస్తుంది. ఆ తర్వాత మీ ఇష్టం వచ్చిన బ్యాంకు కార్యకలాపాలను ఈ మిషన్ల ద్వారా నిర్వహించుకోవచ్చు. టెలిఫోన్ నెంబర్లను కూడా పాస్ వర్డుగా ఎంటర్ చేయాలి. మరో విషయమేమంటే... అచ్చం ఒకేలా ఉండే కవలు ఇద్దరు వచ్చినా కూడా వాళ్లలో ఎవరి అకౌంటును వాళ్లకే యాక్టివేట్ చేసేలా ఈ సాంకేతికత ఉంది. కళ్లజోడు పెట్టుకున్నా, మేకప్ వేసుకున్నా మీ ముఖాన్ని గుర్తిస్తుంది. దీని ద్వారా కేవలం 42 సెకన్లలోనే డబ్బు డ్రా చేసుకోవచ్చు.



Friday, November 20, 2015

బ్రహ్మానందం తన కెరీర్ ను తనే నాశనం చేసుకుంటున్నాడా ?

దాదాపు 30 ఏళ్లుగా చిత్ర పరిశ్రమలో టాప్ కమెడియన్ గా ఓ వెలుగు వెలిగి గిన్నిస్ బుక్ లో స్థానం దక్కించుకున్న బ్రహ్మానందం హవా ఈమధ్య పూర్తిగా తగ్గిపోయింది. అయితే అతనికి ఇటువంటి పరిస్థితి రావడంపై కొన్ని పుకార్లు పరిశ్రమలో హడావుడి చేస్తున్నాయి. అవేమిటంటే దర్శకులని బ్రాహ్మి చిన్న చూపు చూస్తాడని టాక్.

పారితోషికం కోసం కొత్త దర్శకుల సినిమాల్లో నటిస్తాడు కానీ, ఆ దర్శకులు చెప్పే వాటిని బ్రాహ్మి పట్టించుకోడని, సినిమాలో బ్రాహ్మి నటించాల్సిన సీన్ గురించి చెబితే దీనికి ఇంతొద్దు….ఈమాత్రం చాలు అంటాడట. అంతేకాదు ఆ సీన్ ని ఆయనే ఎడిట్ చేస్తాడట. అలాగే ఆ సినిమాకి సంబందించిన కాజువల్ వాక్ లేదా వాకవే సీన్ తీయాలంటే షూట్ చివర్న వెల్లిపోయేటప్పుడు తీసుకో, మళ్ళీ దానికి ప్రత్యేకంగా యాక్ట్ ఎందుకు అని సెటైర్స్ వేస్తాడని ఫిలిం నగర్ గాసిప్.

దాని ఫలితంగా ప్రస్తుతం చాలామంది కొత్త దర్శకులు అయన టార్చర్ భరించలేక కొత్త హాస్య నటులతో సినిమాలు తీస్తున్నారు. అంతేకాదు ఈమధ్య బాగా పేరులోకి వస్తున్న ఓ దర్శకుడు బ్రాహ్మి గురించి తన సన్నిహితులతో మాట్లాడుతూ బ్రాహ్మి 65 ఏళ్ల వయసులో మరికాస్త కొత్తగా చేద్దామనే ప్రయత్నం చేయడం లేదని అందుకే అయన కామెడీ మొహం
  మొత్తుతోందని కామెంట్ చేసినట్లు టాక్.

ఈ కారణాలు వల్లే చిన్న దర్శకుల నుండి పెద్ద దర్శకులవరకు పృధ్వీ, వెన్నెల కిషోర్, షకలక శంకర్, సప్తగిరి లాంటి కమెడియన్లకు వరస పెట్టి అవకాశాలు ఇస్తున్నారు అని వార్తలు వస్తున్నాయి. పైగా బ్రహ్మీకి రోజుకు నాలుగు నుంచి అయిదు లక్షలు కావాలి. అదే డబ్బుతో కొత్త కమెడియన్ల బ్యాచ్ వస్తుంది కదా అన్న నేటితరం దర్శకుల ఆలోచనలు ప్రస్తుతం బ్రహ్మికి శాపంగా మారింది అనే వార్తలు హడావిడి చేస్తున్నాయి.


Thursday, November 19, 2015

"నెరసిపోయే జుట్టు"కు సింపుల్ చిట్కా "కరివేపాకు"

చిన్న వయస్సులోనే జుట్టు నెరసిపోతే.. కరివేపాకు ఉపయోగించండి. సాధారణంగా వయసు పెరిగే కొద్దీ జుట్టు నెరవడం సహజమే. కానీ కొందరికి 20 ఏళ్లు కూడా నిండకుండా జుట్టు తెల్లబడిపోతుంది. ఈ సమస్య అమ్మాయిల్లో తలెత్తితే మరీ ఇబ్బందిగా ఉంటుంది. అలాంటివారికి కరివేపాకు హెయిర్ టానిక్‌లా పనిచేస్తుంది.
 
కరివేపాకును బాగా ఉపయోగించేవారికి జుట్టు అంత త్వరగా తెల్లబడదు. శిరోజమూలానికి బలం చేకూర్చే గుణంతోపాటు జుట్టుకు మంచి రంగును ఇచ్చే గుణం కరివేపాకులో ఉన్నది. 
 
ఇందుకుగాను ఒక కప్పు కొబ్బరి నూనెను తీసుకుని అందులో 20 కరివేపాకు ఆకులను వేసి కొద్దిసేపు వేడి చేయాలి. కరివేపాకులు నల్లగా మారిన తర్వాత వేడి చేయడం ఆపేసి దించేయాలి. ఇలా వచ్చిన నూనెను వారంలో రెండుమూడుసార్లు మాడుకు మర్దన చేస్తుంటే శిరోజాలు బాగా పెరగడంతోపాటు తెల్లబడటం కూడా తగ్గుతుంది. చక్కని రంగుతో నిగనిగా మెరిసిపోతాయి.


Wednesday, November 18, 2015

అమరావతి "ముహూర్తం బాగోలేదని",అందుకే ఆ వేడుకకు హాజరైన వారందరూ "కష్టాల్లో పడ్డారంటున్న" స్వామీజీ ?

విశాఖపట్నం శారదా పీఠం స్వామీజీ స్వరూపానందేంద్ర మళ్లీ షాకింగ్ కామెంట్ చేశారు. ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధాని అమరావతి శంకుస్థాపనకు ముహూర్తం సరికాదని స్వరూపానందేంద్ర మరోసారి స్పష్టం చేశారు. ముహూర్తం బాగోలేదని.. అందుకే ఆ వేడుకకు హాజరైన వారందరూ కష్టాల్లో పడ్డారని తెలిపారు.

ఈ క్రమంలో అమరావతి శంకుస్థాపనకు హాజరైన ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ బీహార్ ఎన్నికల్లో ఘోర పరాభవం చవిచూశారని, బాక్సైట్ తవ్వకాల విషయంలో చంద్రబాబుపై ప్రజా వ్యతిరేకత మొదలైందని  చెప్పారు. 
 
కేసీఆర్‌‌పై సీబీఐ కేసు కూడా బయటికి వచ్చిందని.. ఇవన్నీ అమరావతి ముహూర్తం సరిగ్గా లేకపోవడంతోనే ఇవన్నీ జరుగుతున్నాయని.. తెలిపారు. ముహూర్తం సమయాన్ని పండితుల సూచనల మేరకు నిర్ణయించివుంటే ఈ కష్టాలు వచ్చివుండే కాదని స్వరూపానందేంద్ర చెప్పుకొచ్చారు.  
 

Tuesday, November 17, 2015

"డయాబెటిస్" వ్యాధికి "నిద్ర"కి గల సంబంధం ?

ఎక్కువ గంటలు పని చేస్తూ నిద్ర వస్తున్నా గట్టిగా అదిమి పట్టేస్తూ నిద్ర సరిగా పోనివారికి డయాబెటిస్ వ్యాధి త్వరగా వచ్చే అవకాశముంది. మూడురోజులు వరుసగా తగినన్ని గంటలు నిద్రపోలేకపోతే శరీరంలో వచ్చే మార్పులలో ముఖ్యమైనది రక్తంలోని గ్లూకోజ్ నియంత్రణలో మార్పులు వస్తాయని పరిశోధకులు గుర్తించారు. ఆ నియంత్రణ వ్యవస్థలో లోపం ఏర్పడటంతో షుగర్ జబ్బు వస్తుంది. బలవంతంగా నిద్రను అదిమిపెట్టి రాత్రుళ్ళు ఎక్కువసేపు మెళకువతో వుండేవారు గుర్తించాల్సిన విషయం ఇది. 
 
అయితే వయసులో వుండగా దీని ప్రభావం వెనువెంటనే కనిపించకపోవచ్చంటున్నారు. కానీ భవిష్యత్ జీవితంలో ఇది సమస్యలను తెచ్చిపెట్టే ప్రమాదముందంటున్నారు. ఇక డయాబెటిస్ లక్షణాలు ఇప్పటికే కనిపించిన వారు నిద్ర విషయంలో తగు జాగ్రత్తలు తప్పక తీసుకోవాలి. 
 
నిద్రలేమి వారి ఆరోగ్యంపైన తీవ్రమైన ప్రభావాన్ని చూపుతుంది. హఠాత్తుగా రక్తంలో చక్కెరలు తారాస్థాయికి చేరి రోగిని కోమాలోకి తీసుకువెళ్ళే ప్రమాదం సైతం ఉంటుంది. కాబట్టి డయాబెటిస్ రోగులు తగినంత వ్యాయామం, నిద్ర విషయంలో తగిన జాగ్రత్తలు వహించండం మరవకూడదంటున్నారు వైద్యులు.

Monday, November 16, 2015

మనిషి లాగే " ఊపిరి" పీల్చుకుంటున్న"భూమి" ? తప్పకుండా చూడండి .

కెనడాలో ఇదో అద్భుతమేకాదు.. హాట్ టాపిక్ కూడా! ప్రకృతి రహస్యాల్లో ఇది కూడా వింత అద్భుతంగా పరిగణిస్తున్నారు. కెనడాలోని నోవా స్కోషియా అడవుల్లో ఓ వ్యక్తికి వండర్ సీన్ కనిపించింది. అసాధారణంగా భూమి పైకి.. కిందికి ఊపిరి పీల్చుకున్నట్టుగా దర్శనమివ్వడంతో ఆ వ్యక్తి కాస్త తన సెల్‌ఫోన్ షూట్ చేశాడు. ఈ వీడియోని చూసిన లక్షలాది మంది ఆశ్చర్యపోయారు.

 భారీ చెట్ల వేళ్ల కారణంగానే ఈ నేచురల్ వింతలు చోటు చేసుకున్నాయని భావిస్తున్నారు. ఎట్ ప్రజెంట్ దీనిపై సోషల్ మీడియాలో చర్చ మొదలైపోయింది. వేగంగా వీస్తున్న గాలి కారణంగా కూడా ఈ అద్భుతం జరిగివుండవచ్చని కొంతమంది అంటున్నారు. ఆన్‌లైన్‌లో ల్యాండ్ బ్రీతింగ్ వండర్ సృష్టిస్తోంది. తన కెమెరాకు ఈ దృశ్యాన్ని ఎక్కించిన బ్రియాన్ నట్టల్‌ను అభినందించనివాళ్లు లేరు. 

ఈ వీడియోని ఈ క్రింది లింక్ పై క్లిక్ చేసి చూడండి .


Saturday, November 14, 2015

వరుడు మనిషి ! వధువు ప్లాస్టిక్ బొమ్మ? చైనాలో వింత పెళ్ళి ?

అతనో ఇరవై ఎనిమిదేళ్ళ అందగాడు. అతనంటే ఇష్టపడే అమ్మాయిలు కూడా ఉన్నారు. కానీ అతనికి క్యాన్సర్ వ్యాధి సోకిందని వైద్య పరీక్షల్లో తేలింది. దీంతో అతను పెళ్లి ఆలోచన మార్చుకున్నాడు. తనను పెళ్లి చేసుకుంటే కొద్ది కాలానికే అమ్మాయి విడో గా మిగిలిపొతుందని భావించి ఆ యువకుడు ఓ కొత్త పెళ్లికి తెరతీశాడు.



వివరాల్లోకి వెళ్తే...చైనాకు చెందిన ఒక కుర్రవాడు మంచి స్మార్ట్ గా ఉంటాడు కానీ, డాక్టర్లు అతనికి  టెర్మినల్ క్యాన్సర్ అని తేల్చారు. మరణానికి దగ్గరగా ఉన్న అతను అది సంభవించే లోపే ...  పెళ్లి అనే  తీయని అనుభూతిని అనుభవించాలనుకున్నాడు. తన పెళ్ళి కోరిక తీరేలా, ఎవరికీ అన్యాయం జరగకుండా ఉండేలా ఒక ప్లాస్టిక్ బొమ్మతో పెళ్ళికి రెడీ అయ్యాడు.



అతనితో బాటే ఆ బొమ్మ పెళ్లి కూతురికి మేకప్ చేశారు. పెళ్లి డ్రస్ తొడిగారు. ఇద్దరూ కలిసి ఫోటోలు దిగారు. అందరూ అతని ఆలోచనను అభినందించారు. అందరూ ఆశ్చర్యపోయేలా, సంప్రదాయ బద్ధంగా ప్లాస్టిక్ పెళ్ళి కూతురితో  వివాహం చేసుకున్నాడు.



మోకాళ్ల మీద వంగి ప్లాస్టిక్ పెళ్లి కూతురికి వామ్ వెల్ కమ్ చెబుతున్న ఫోటోలు కూడా పోస్ట్ చేశాడు. పెళ్ళి తంతు అయిపోయిన తరువాత 35 వేల డాలర్ల ఖర్చుతో పెళ్ళి విందు కూడా ఇచ్చాడు. అందరికీ ఆశ్చర్యం కలి గించేలా చైనాలో జరిగిన ఈ పెళ్లి వివరాలు, ఫోటోలు ఇంటర్నెట్ లో  తెగ చూసేస్తున్నారు. ఆ చైనా కుర్రాడిని మెచ్చుకుంటున్నారు .

Friday, November 13, 2015

బరువు తగ్గాలంటే ? "బస్సు, రైలు ప్రయాణం" చేయాలంట ?

లావుగా ఉన్నారా? ఏం చేసినా బరువు తగ్గకుండా అలానే ఉన్నారా? అయితే టూ వీలర్, ఫోర్ వీలర్‌లో ప్రయాణం చేయడానికి బ్రేక్ వేయాలంటున్నారు.. జపాన్ శాస్త్రవేత్తలు. లావుగా ఉన్నామని బాధపడకుండా.. అందమైన శరీరాకృతి పొందటానికి బస్సుల్లో, రైళ్లల్లో ప్రయాణించడం ఎంతో మంచిదని వారంటున్నారు. 
 
చెమటలు పట్టేలా వ్యాయామాలు చేయకుండా బరువు తగ్గాలంటే.. బస్సు, రైలు ప్రయాణం బెస్ట్ అని, బస్సులు, రైళ్లలో ప్రయాణించేవారు సులభంగా సన్నబడతున్నారని, కారు, బైకుల్లో ప్రయాణించే వారికంటే బస్సుల్లో ట్రావెల్ చేసేవారు 44 శాతం వరకు ఒబిసిటీకి దూరంగా ఉన్నారని జపాన్ శాస్త్రవేత్తలు అంటున్నారు. సాధారణంగా బరువు తగ్గాలనుకునే వారు రెండు మూడు కిలోమీటర్లు నడిచి.. ఆపై ఇల్లు చేరి విశ్రాంతి తీసుకుంటారు.
 
అదే ఆఫీసులకు వెళ్లి పనిచేసే వారు అధికంగా శ్రమపడతారని.. వారు ఇంటి నుంచి రైల్వే స్టేషన్‌కు, బస్టాండ్‌కు వెళ్లేందుకు నడుస్తున్నారని... వారికి నడిచే దూరమే తెలియదని.. తద్వారా ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుందని జపాన్ శాస్త్రవేత్తలు అంటున్నారు. తద్వారా బీపీ, షుగర్, హృద్రోగ వ్యాధుల నుంచి తప్పించుకుంటున్నారని వెల్లడించారు. 

Thursday, November 12, 2015

"దాల్చినచెక్క"తో ఎన్ని ప్రయోజనాలో తెలుసా ?

దాల్చినచెక్క, తేనెను రెగ్యులర్‌ డైట్‌లో చేర్చుకుంటే ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుతుంది. బరువు తగ్గించుకోవాలనుకుంటే అతి తక్కువ క్యాలరీలు కలిగిన తేనెను తీసుకోవచ్చు. ఉదయం తేనె, నిమ్మరసం రెండింటిని గోరువెచ్చని నీటితో చేర్చి తీసుకుంటే, అలాగే కొద్దిగా తేనె కూడా బ్రేక్‌ ఫాస్‌‌టలో చేర్చుకుంటే బరువు తగ్గడానికి అద్భుతంగా పనిచేస్తాయి. అలాగే దాల్చిన చెక్క కూడా బరువు తగ్గించడంలో అద్భుతంగా పనిచేస్తుంది. అందుకే దాల్చిన చెక్క మరియు తేనెను రెగ్యులర్‌ డైట్‌ లో చేర్చుకోవడం చాలా అవసరం.
స్వీట్‌ హనీ వ్యాయామానికి కావల్సిన శక్తిని అందించే ఒక మంచి టానిక్‌ వంటిది. బరువు తగ్గాలనుకొనే వారు ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో ఒక టీస్పూన్‌ తేనె మరియు చిటికెడు దాల్చిన చెక్క పొడి వేసి బాగా మిక్‌‌స చేసి ప్రతి రోజూ ఉదయం వ్యాయామానికి ముందు తీసుకుంటే మంచి ఎనర్జీతో పాటు, బరువును ఎఫెక్టివ్‌గా తగ్గిస్తుంది
ఊబకాయస్తులు మరియు అధిక కొలెస్ట్రాల్‌ ఉన్నవారు, కొలెస్ట్రాల్‌ తగ్గించుకోవడానికి 2టేబుల్‌ స్పూన్ల తేనె మరియు 3టేబుల్‌ స్పూన్ల దాల్చిన చెక్క పొడిని ఒక గ్లాసు నీళ్ళలో వేసి బాగా మిక్‌‌స చేసి రెగ్యులర్ గా కొద్దిరోజులు తీసుకొంటే అధిక కొలెస్ట్రాల్‌ తగ్గించుకోవచ్చు.
తేనె మరియు దాల్చిన చెక్కలోని షుగర్‌ కంటెంట్‌ బరువు తగ్గడానికి సహాయపడుతుంది. అలాగే తేనె శరీరానికి కావల్సిన శక్తిని అందిస్తుంది. అరటేబుల్‌ స్పూన్‌ తేనెను ఒక గ్లాసు నీళ్ళలో మిక్‌‌స చేసి దాల్చిన చెక్క పొడి కొద్దిగా వేసి బాగా మిక్‌‌స చేసి భోజనానికి ముందు తీసుకుంటే విటాలిటీ పెంచుతుంది.
భోజనానికి ముందు రెండు టేబుల్‌ స్పూన్ల తేనెలో కొద్దిగా దాల్చిన చెక్క పొడి వేసి బాగా మిక్‌‌స చేసి తినాలి . ఇలా చేయడం వల్ల ఎసిడిటి తగ్గిస్తుంది. ఈ రెంటింటి కాంబినేషన్‌ వల్ల బరువు తగ్గడానికి బాగా సహాయపడుతుంది. తిన్న ఆహారంను విచ్ఛిన్నం చేయడానికి తేలికగా జీర్ణం అవ్వడానికి సహాయపడుతుంది .
తేనె మరియు దాల్చిన చెక్క ఈ రెండింటి కాంబినేషన్‌ త్వరగా బరువు తగ్గించడానికి సహాయపడుతుంది. ప్రతి రోజూ పరకడుపున లేదా రాత్రి నిద్రించడానికి ముందు తీసుకుంటే శరీరంలో నిల్వచేరిన ఫ్యాట్‌ను కరిగిస్తుంది. దాల్చిన చెక్క, తేనె మిశ్రమం పెద్ద పేగులలోని పారాసైట్‌‌స, ఫంగస్‌, బ్యాక్టీరియాను శుభ్రం చేస్తుంది.
తేనె బ్లడ్‌ షుగర్‌ లెవల్‌‌సను స్థిరంగా ఉంచుతుంది. దాంతో ఆకలి కంట్రోల్‌ అవుతుంది. తేనె మరియు దాల్చిన చెక్క కాంబినేషన్‌ బరువు తగ్గించడం మాత్రమే కాదు సెల్యులైట్‌ అనే అధనపు ఫ్యాట్‌ను కూడా కరిగిస్తుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.

Wednesday, November 11, 2015

"దీపావళి శుభాకాంక్షలు"


Tuesday, November 10, 2015

బరువు తగ్గించే ఫుడ్ మెనూ !

బరువు తగ్గాలంటే ముఖ్యంగా ఆహారంలో బరువు తగ్గాల్సిందేనని న్యూట్రీషన్లు అంటున్నారు. రోజువారీ డైట్‌లో పోషకాలు సమృద్ధిగా ఉండేలా, లో క్యాలరీ ఫుడ్‌గా ఉండాలని వారు సూచిస్తున్నారు. ఆహారపు అలవాట్లు ఆధారంగా అత్యవసరమైన పోషకాలు సరైన సమయంలో తీసుకుంటే బరువు తగ్గవచ్చునని శరీరాకృతిని మెరుగుపరుచుకోవచ్చు. 
 
ఎలాంటి ఆహారం తీసుకోవాలంటే..?
కొవ్వు తీసేసిన పాలను తాగాలి. ఎముకలు బలంగా ఉండటానికి - మాంసకృత్తులు, క్యాల్షియం అధికంగా ఉండే పాల ఉత్పత్తులు, మాంసకృత్తుల కోసం - కోడిగుడ్డులోని తెల్ల సొన, స్కిన్‌లెస్ చికెన్‌, వేరుశనగలు వంటివి తీసుకోవాలి.
 
హోల్‌ వీట్‌, జొన్నలు, తెల్ల ఓట్స్‌, రాగిమాల్ట్. శెనగలు, రాజ్‌మా, బొబ్బర్లు, పచ్చి బఠాణి, సోయా ఉత్పత్తులు, పెసలు, మొలకెత్తిన గింజలు...వీటి వల్ల మాంసకృత్తులు, పిండి పధార్ధాలు, 'బి' విటమిన్లు అందుతాయి. తద్వారా బరువు తగ్గుతుంది. ముదురు పసుపు, నారింజ రంగు పండ్లు, కూరగాయలు, తాజా ఆకుకూరలు తదితరాలు రోజూ తీసుకునే ఆహారంలో ఉండేలా చూసుకోవాలి. ఇలాంటి ఆహారం తీసుకుంటే బరువు తగ్గుతారని న్యూట్రీషన్లు అంటున్నారు. 
 


Monday, November 9, 2015

షకీలా "చెంపచెళ్లుమనిపించిన" నటి ?

వెండితెరమీద హీరోయిన్‌‌గా వెలిగిపోవాలని సినిమాల్లోకి వచ్చిన హాట్ బ్యూటీ షకీలా గ్లామర్ రోల్స్‌కు మాత్రమే పరిమితమైంది. అయితే, హాట్ బ్యూటీగా తనకు తిరుగులేదనట్లుగా ఒక ఏడాదిలో దాదాపు 180 సినిమాలకు పైగా నటించింది. అయితే, కెరీర్ పీక్ స్టేజ్‌‌లో ఉన్నా, లేకున్నా ఆమె ఎప్పుడూ చాలా సాధారణ జీవితమే అనుభవించింది. అయితే, తన జీవితంలో షూట్‌లో ఉండగా ఎదురైన అనుభవాలు చెప్పమంటే, సిల్క్ స్మిత తన చెంపచెళ్లుమనిపించిందని, దానికి ఆమె సారీ చెప్పలేదని అది ఇప్పటికీ తనను బాధిస్తూనే ఉందని షకీలా తన మనసులోమాట బయటపెట్టింది. 


Saturday, November 7, 2015

పళ్లు తళతళలాడిపోవాలని వాటితో గాని అతిగా తోమితే ?

అమ్మాయిలు అందానికి ఎంతో ప్రాముఖ్యతనిస్తుంటారు. కొంతమంది తమ పళ్లు ముత్యాల్లా తళతళలాడిపోవాలని ఏవేవో పద్ధతులు పాటిస్తుంటారు. వీటిలో బేకింగ్ సోడా, నిమ్మరసం కలిపి పళ్లు తోమడం. ఈ రెండూ కలిస్తే రసాయనిక క్రియ జరుగుతుంది. వీటిని బ్రెష్ పై అద్దుకుని పళ్లు తోముకుంటే పళ్లు తళతళలాడిపోతాయి. 
 
ఐతే వీటిని వారానికి ఒక్కసారి మాత్రమే వాడాలి. అలాకాకుండా పదేపదే వాడితే పళ్లపై ఉండే ఎనామిల్ దెబ్బతినే అవకాశం ఉంది. బేకింగ్ సోడా, నిమ్మరసం కలిపి దంతాలకు పట్టించి ఒక నిమిషం తర్వాత బ్రష్ తో సున్నితంగా రుద్దుకుని ఆ తర్వాత కడిగేయాలి. ఈ మిశ్రమాన్ని ఒక్క నిమిషానికి మించి ఎట్టి పరిస్థితుల్లోనూ ఉంచరాదు.

Friday, November 6, 2015

"అనుష్క ఫై హాట్‌హాట్" కామెంట్స్ చేసిన అలీ!

టాలీవుడ్ కమెడియన్ అలీ మరోమారు వార్తలకెక్కారు. ఈ దఫా టాలీవుడ్ అగ్రహీరోయిన్ అనుష్కను లక్ష్యంగా చేసుకుని హాట్‌హాట్ కామెంట్స్ చేశారు. అనుష్క ప్రధాన పాత్రధారిణిగా, దర్శకేంద్రుడు కె.రాఘవేంద్ర రావు తనయుడు ప్రకాష్ దర్శకత్వంలో రూపొందిన 'సైజ్ జీరో' చిత్రం ఆడియో విడుదల కార్యక్రమం ఆదివారం హైదరాబాద్‌లో జరిగింది. ఇందులో అలీ పాల్గొని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అనుష్క తొడలను రచ్చ రచ్చ చేశాడు. ఆమె తొడలు అద్భుతమని ఆ తొడలంటే తనకు ఎంతో ఇష్టమన్నారు. తొడలంటే అనుష్క తొడలే అంటూ అనుష్క తొడలపై పెద్ద చర్చే లేపారు. 'బిల్లా' సినిమాలో ఆమె తొడలు చూసిన నుంచి తాను పెద్ద ఫ్యాన్ అయిపోయానని చెప్పాడు.

 
 అంతేకాకుండా, అనుష్క హాట్‌హాట్ జిలేబిలా ఉంటుందన్నారు. జిలేబి అంటే ఇష్టపడని ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఉండరన్నారు. అందుకే ప్రకాష్... అనుష్కను ఈ చిత్రంలో జిలేబీలతో కొట్టించారన్నారు. దీనికి కారణం లేకపోలేదన్నారు. దర్శకుడు రాఘవేంద్రరావు తీసిన సినిమాల్లో నటించిన హీరోయిన్లందరినీ ప్రపంచంలోని పూలు, పండ్లతో కొట్టించడమే కాకుండా, ఎంతో మంది అమ్మాయిల తొడలను ఈ ప్రపంచానికి చూపించారన్నారు. 
 
ఇపుడు ఆయన తనయుడికి హీరోయిన్లను కొట్టించేందుకు పండ్లు పూలు లేకపోవడంతో జిలేబీలను ఎంచుకున్నారంటూ సెటైర్లు వేశారు. అలీ చేసిన ఈ కామెంట్స్‌కు ఆడియో ఫంక్షన్‌కు హాజరైన ఆహుతులు.. తమ ముఖాలకు చేతులు అడ్డంపెట్టుకుని బలవంతపు నవ్వుతో నవ్వారు. అనుష్క కూడా ఈ కామెంట్స్‌కు ఎలా స్పదించాలో తెలియక మిన్నకుండిపోయారు. 
 
కాగా, ఇటీవలి కాలంలో అలీ చేస్తున్న వివాదాస్పద వ్యాఖ్యలపై టాలీవుడ్‌లో రచ్చరచ్చ జరుగుతున్నా ఈ స్టార్ కమెడియన్ మాత్రం ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. పైగా... మరింత రెచ్చిపోయి అగ్రహీరోయిన్లను సైతం వదిలిపెట్టడం లేదు కదా.. ఏకంగా హీరోయిన్ల శరీర అవయవాలపై సెటైర్లు వేస్తూ వార్తల్లో నానుతున్నాడు. 


Thursday, November 5, 2015

కిడ్నీలో రాళ్ల బాధకు చెక్ పెట్టడం ఎలా?

ఆపరేషన్స్ చేయించుకున్నాక కూడా కొందరికి కిడ్నీలో రాళ్లున్నాయని వైద్యులు చెప్తుంటారు. కిడ్నీలో రాళ్లను నివారించాలంటే రోజుకో గ్లాసు నారింజపండ్ల రసం తాగితే చాలు. రాళ్ల బాధ మాయమవుతుంది. ఎన్నిసార్లు శస్త్రచికిత్స చేయించుకున్న చాలా మందిని కిడ్నీలో రాళ్ల సమస్య మళ్లీ మళ్లీ బాధపెడుతుంటుంది. ఇలాంటి వారు రోజూ నారింజ పండ్లరసం తీసుకుంటే ఈ సమస్య నుంచి తప్పించుకోవచ్చు. 
 
కాల్షియం వంటి రసాయనాల గాఢత విపరీతంగా పెరిగిపోవడం వల్ల కిడ్నీల్లో రాళ్లు ఏర్పడతాయి. ఆపరేషన్ ద్వారా వీటిని తొలగించినప్పటికి తిరిగి మళ్లీ రాళ్లు ఏర్పడుతూనే ఉంటాయి. పొటాషియం సిట్రేట్ సప్లిమెంట్లు వాడడం ద్వారా ఈ సమస్యను కొంతవరకు నివారించవచ్చు.
 
కాబట్టి సహజసిద్ధమైన సిట్రేట్‌లు లభించే సిట్రస్ ఫలాలను తీసుకోమని డాక్టర్లు సూచిస్తున్నారు. ఈ సిట్రేట్‌లు నారింజలో పుష్కలంగా ఉన్నాయి. మిగిలిన సిట్రస్ ఫలాల కన్నా నారింజపండ్లలోని సిట్రేట్లు మరింత సమర్ధవంతంగా పనిచేస్తాయని టెక్సాస్ యూనివర్సిటీకి చెందిన పరిశోధకుల అధ్యయనంలో వెల్లడైంది.


Wednesday, November 4, 2015

" అలిగిన" అఖిల్ ?

డాడీ నాగ్ మీద అఖిల్ గుర్రుగా వున్నాడట. తన ‘అఖిల్’ మూవీ వాయిదా వేయాలని నాగార్జున తీసుకున్న నిర్ణయం ఈ యువహీరోని అప్‌సెట్ చేసిందంటున్నారు. నిజానికి ‘అఖిల్’ మూవీ గతనెల దసరా నాటికి రిలీజ్ అవుతుందని భావించారు. అయితే టెక్నికల్ రీజన్స్ వల్ల అది రిలీజ్ కాలేకపోయిందని వార్తలు వచ్చాయి. అసలు కారణం అది కాదని, ఈ సినిమాలో కొన్ని సీన్స్‌ని రీషూట్ చేయాలని నాగ్ సూచించారని, అందువల్ల వాయిదా పడిందని కూడా ఫిల్మ్‌నగర్‌లో న్యూస్ చక్కర్లు కొట్టింది. ఏదిఏమైనా అఖిల్ మాత్రం మనస్తాపం చెందాడట! తన మూవీ ప్రమోషన్ కోసం అఖిల్ చాలారోజుల క్రితమే హైదరాబాద్ వుమెన్స్ కాలేజీలో హల్‌చల్ చేయడంతోబాటు, యూఎస్ కూడా వెళ్లి అక్కడా ప్రమోట్ చేసి వచ్చాడు.

 కానీ నాగ్ తీసుకున్న నిర్ణయంతో అలిగిన అఖిల్ రెండు రోజులు ఎవరితోనూ మాట్లాడలేదట. నాగార్జున ఫోన్ చేసినా స్పందించలేదట. ప్రెస్‌మీట్‌కు హాజరు కాకపోవడంతో నాగార్జునే అటెండ్ అయి లాంఛనంగా ప్రకటన చేశాడు. తన తండ్రి తన ఫేవరేట్ యాక్టర్ కాదని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో అఖిల్ వ్యాఖ్యానించడం అక్కినేని ఫ్యాన్స్‌ని షాక్‌కి గురిచేసింది. బహుశా తన ఫ్రెండ్ మెగాస్టార్ చిరంజీవి తనయుడు రామ్‌చరణ్ నటించిన ‘బ్రూస్‌లీ’ సినిమా.. దసరాకి రిలీజ్ అయ్యేలా చూసేందుకే నాగ్.. ఆ డెసిషన్ తీసుకున్నారా అనే కామెంట్స్ వినబడుతున్నాయి. చివరకు మొన్న నాగ్ రిలీజ్ డేట్ ప్రకటనతో .. తండ్రీ కొడుకుల మధ్య రేగిన ‘కోల్డ్‌వార్’కు  ఫుల్‌స్టాప్ పడినట్టే  చూడాలి.

Tuesday, November 3, 2015

కీళ్ళనొప్పులు తగ్గాలంటే ?

కీళ్ళనొప్పుల నుంచి ఉపశమనం లభించాలంటే వారానికి రెండు సార్లు చేపలు తినాల్సిందేనని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. చేపలను తినడం వల్ల పలు రకాలైన ప్రయోజనాలున్నాయి. వారానికి రెండు లేదా ఒకసారైనా చేపలను తినడం వల్ల రుమటాయిడ్‌, ఆర్థ్రరైటిస్‌ వంటి కీళ్ళనొప్పుల ముప్పును సగం వరకూ తగ్గించుకోవచ్చని తాజా అధ్యయనాల్లో వెల్లడైంది. 
 
స్వీడన్‌కు చెందిన కరోలిన్‌స్కా ఇన్‌స్టిట్యూట్‌కు చెందిన పరిశోధకుల బృందం సుమారు 32 వేలమంది స్వీడన్‌ మహిళలపై అధ్యయనం చేపట్టింది. ఈ పరిశోధకుల బృందం తమ పరిశోధనకు ఎంపిక చేసుకున్న మహిళల ఆహారపు అలవాట్లను గురించి విశ్లేషించింది. వీరిలో ఒమెగా`3 కొవ్వు ఆమ్లాలను ఎక్కువగా తీసుకున్న వారిలో కీళ్ళనొప్పుల ముప్పు తక్కువగా ఉన్నట్టు తేలింది. 
 
సాల్మొన్‌, తాజా ట్యూనా వంటి చేపల్లో అధికంగా ఈ ఒమెగా`3 కొవ్వు ఆమ్లాలు లభ్యమవుతాయి. ఈ అధ్యయనంలో పాల్గొన్న మహిళల్లో 27 శాతం మంది ఈ కొవ్వు ఆమ్లాలను తక్కువగా తీసుకుంటున్నట్టు పరిశోధకులు గుర్తించారు. మొత్తంగా కీళ్ళనొప్పులకు ఎక్కువగా గురయ్యే మహిళలు వారానికి ఒకసారైనా నూనెతో కూడిన చేపల్ని తినాలని పరిశోధనలో పాల్గొన్న ప్రొఫెసర్‌ అలన్‌ సిల్మాన్‌ చెబుతున్నారు. 


Monday, November 2, 2015

"మెగా ఫ్యామిలీ స్టార్స్ సినిమాలపై వర్మ కామెంట్ల"కు ఇదా కారణం ?

సినీ ఇండస్ట్రీలో కొందరిని చేదు అనుభవాలు అలానే వేధిస్తుంటాయి. పీడిస్తుంటాయి. వాటిని ఎంత మర్చిపోదామన్నా వల్లకాదు. అలాగే రాంగోపాల్ వర్మ పరిస్థితి కూడా ఉందని టాలీవుడ్ ఇండస్ట్రీలో చర్చ నడుస్తోంది. మెగా ఫ్యామిలీ స్టార్స్ సినిమాలపై వర్మ కామెంట్లు అందుకే చేస్తున్నారని కూడా చెప్పుకుంటున్నారు. 20 ఏళ్ల కిందట మెగాస్టార్ చిరు చిత్రంతో జరిగిన అవమానం ఇంకా వర్మను పీడిస్తోందట.
 
అందుకే బ్రూస్‌లీ చిత్రమే మెగాస్టార్‌ 150వ చిత్రంగా తాను భావిస్తున్నానని వర్మ ట్వీట్ చేయడం వెటకారమైనదని అంటున్నారు. ఇంకా ఈ బ్రూస్ లీ చిత్రంలో చిరు నటించడం తనకు అస్సలు నచ్చలేదనీ, బ్రూస్‌లీలో చిరు నటించడం ప్రజారాజ్యం పార్టీ పెట్టినంత తప్పని, తెలిసితెలిసి మెగాస్టార్‌ ఆ పని చేశారేంటబ్బా అని వర్మ విమర్శించారు.
 
ఇంకా ఈమధ్య చిరంజీవి చేయబోతున్న తదుపరి చిత్రం కత్తికి రీమేక్‌ అనే వార్తపైనా వర్మ మండిపడ్డారు. ఇలా చేస్తే మెగా అభిమానులను అవమానించడమే అవుతుందని చెప్పుకొచ్చారు. ఐతే ఇలా మెగా స్టార్స్ పైన వర్మ ట్వీట్లు చేయడం వెనుక వేరే కారణాలు ఉన్నాయనీ, 20 ఏళ్ల కిందట వర్మకు చిరు ఓ సినిమాకు ఛాన్స్‌ ఇచ్చాడట. అశ్వనీదత్‌ నిర్మాతగా వ్యవహరించిన ఈ చిత్రంలో శ్రీదేవిని హీరోయిన్‌గా తీసుకోవడమే కాకుండా కర్నూల్‌లో షూటింగ్‌ పార్ట్‌ కూడా కొంత జరిపారట. 
 
ఐతే ఆ తర్వాత వర్మ పద్ధతి నచ్చక చిరంజీవి ఆ చిత్రం నుంచి వర్మను తప్పించారట. అంతేకాకుండా 150వ చిత్రం చేసే అవకాశాన్ని తన ప్రియ శిష్యుడు పూరీ జగన్నాథ్ కు ఇవ్వకుండా మరొకరిని ఆలోచించడం కూడా వర్మకు నచ్చలేదని సమాచారం. అందువల్లనే చిరంజీవికి వర్మ మెత్తని సెటైర్లు వేస్తున్నారని అంటున్నారు.