CSS Drop Down Menu

Thursday, December 31, 2015

ఆక్వేరియం లో "లిఫ్ట్" చూసారా ?

జర్మనీ రాజదాని బెర్లిన్ నగరంలో రాడిసన్ బ్లూ హోటల్లో ప్రపంచంలోనే 82 అడుగుల అతిపెద్ద సిలిండ్రికల్ ఆక్వేరియం టేంక్ ఆక్రిలిక్ గ్లాస్ తో నిర్మించారు.

దీనిలో 2,60,000 గేలన్ల సముద్రపు నీటితో నింపి దానిలో 97 జాతులకు చెందిన 1500 రకాల చేపలను పెంచుతున్నారు.

వీటికి రోజూ ముగ్గురు లేదా నలుగురు డైవర్స్ 18 పౌండ్స్ ఆహారాన్నిఅందిస్తారు. దీని మధ్యలో ట్రన్సపరెంట్ ఎలివేటర్ ఉంటుంది.





Wednesday, December 30, 2015

"తల 180 డిగ్రీల్లో ముందుకు, వెనక్కూ తిప్పడం" ఎక్కడైనా చూసారా ?

ఏరా? తల తిరుగుతోందా? అనే ప్రశ్న మీరందరూ వినే ఉంటారు. కానీ అదే ప్రశ్న ఈ పిల్లాణ్ని అడిగితే మాత్రం అవును. తిరుగుతోంది. అదీ 180 డిగ్రీల్లో .. అని సమాధానం ఇస్తాడు.. ఈ తలతిరుగుడు  గురించి వివరాల్లోకి వెళ్తే.. అనగనగా ఒక బుడ్డోడు. వాడికి  అందరి లాగే  మెడ కాయ మీద తలకాయ ఉంది. సో వాట్ ? అని అందరిలా రొటీన్  క్వశ్చన్ వేయకండి. వాడి తల వాడు చెప్పినట్టే వింటుంది. ఎటు తిరగమంటే అటు తిరుగుతుంది.
 కూర్చున్న చోటు నుంచి వళ్లేమాత్రం కదల్చకుండా కేవలం తల మాత్రమే తిప్పేస్తాడు. వినడానికీ, చూడ్డానికీ ఆశ్చర్యంగా ఉన్నా...ఇది  నిజంగా నిజం..ఆ పిల్లాడి తల వేరీ ఫ్లెక్సిబుల్. ఈ పిల్లాడి వెనుక నంచి పలకరించినా, విష్ చేసినా బాడీ కదల్చకుండా తలమాత్రం వెనక్కి  తిప్పి పలకరించేస్తాడు. ఈ సీన్ డైరెక్ట్ గా చూసిన వాళ్లు, యూట్యూబ్ లో వీడియో చూసిన వాళ్లూ షాక్.  ఇప్పటికే  రెండు లక్షల మందికి పైగా చూసేశారు. హారర్  మూవీలో సీన్లను తలపించేలా తల 180 డిగ్రీల్లో ముందుకు, వెనక్కూ, పక్కకు  తిల తిప్పుతుంటే చూసిన వాళ్ళకు నోట మాట రావడం లేదు. అయితే పొరబాటున కూడా మిగతా పిల్లలెవ్వరూ ఈ ఫీట్ ను ట్రై చేయకండి అని వార్నింగ్ కూడా ఇస్తున్నారు.
ఈ పిల్లాడిని చూడాలనుకొంటే ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి.




Tuesday, December 29, 2015

"గొడుగుల వీధు"లను ఎక్కడైనా చూసారా?

గొడుగులతో అలంకరించిన వీధులను మీరు ఎక్కడైనా చూసారా? చూడకపోతే ప్రతి సంవత్సరం జూలై నెలలో Agueda a municipality in Portugal లో రంగు రంగుల గొడుగులతో అలంకరించిన వీధులను చూడవచ్చు.





Monday, December 28, 2015

కూతురి పాలిట "విలన్" గా మారనున్నహీరో ?

ఒకప్పుడు యాంగ్రీ యంగ్ మాన్ గా పేరు తెచ్చుకున్న రాజశేఖర్ కు గతకొద్ది కాలంగా అట్టర్ ఫ్లాప్ లే ఎదురవుతున్నాయి. ఎంతో కష్టపడి తీసినప్పటికీ కూడా ఫలితం లేకుండా పోతుంది. దీంతో ఇక హీరోగా తన స్థాయిని పక్కనపెట్టి, నటుడిగా మారాలని ప్రయత్నిస్తున్నాడు. విలన్ పాత్రలో నటించడానికి రాజశేఖర్ సిద్ధమవుతున్నాడు.

జగపతిబాబు తరహాలో విలన్ గా కొత్త ఇన్నింగ్స్ మొదలుపెట్టాలనే ప్రయత్నం చేస్తున్నాడు. ఇప్పటికే పలు సినిమాల్లో విలన్ గా నటించే అవకాశాలు వచ్చినప్పటికీ, రాజశేఖర్ ఏ సినిమాను కూడా ఒప్పుకోలేదు. ఇటీవలే రవితేజ హీరోగా తెరకెక్కుతున్న ‘ఎవడో ఒకడు’ సినిమాలో నెగెటివ్ పాత్రలో నటించాలంటూ దిల్ రాజు అడిగినప్పటికీ,... రాజశేఖర్ ఒప్పుకోలేదట. కానీ తాజాగా తన కూతురు సినిమాలో విలన్ గా నటించడానికి సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తోంది.

రాజశేఖర్ పెద్ద కూతురు శివాని ‘వందకు వంద’ అనే సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తోంది. ఇందులో రాజశేఖర్ ఓ నెగెటివ్ పాత్రలో కనిపించనున్నాడని సమాచారం. మరి ఈ ‘వందకు వంద’ సినిమాతో అటు శివానికి, ఇటు రాజశేఖర్ కు ఎలాంటి సక్సెస్ ను అందించనుందో త్వరలోనే తెలియనుంది.

Saturday, December 26, 2015

‘అఖిల్’ సినిమా చేసి తప్పు చేశా ?


‘అఖిల్’ మూవీ డిజాస్టర్ అయ్యాక ఇన్నాళ్ళకు డైరెక్టర్ వీవీ వినాయక్ నోరు విప్పాడు. ఆ సినిమా చేసి తాను పెద్ద పొరబాటు చేశానని, లాస్‌కు కారకుడైన తనను హీరో అఖిల్ ఫ్యాన్స్, ఇండస్ట్రీ క్షమించాలని కోరాడు. ‘ఇక నుంచి మరింత ఎలర్ట్‌గా ఉంటా.. మళ్ళీ ఇలాంటి మిస్టేక్స్ చేయకుండా జాగ్రత్త పడతా’ అని ఓపెన్‌గా చెప్పాడు. రాజమౌళి తప్ప ఈ సినీ పరిశ్రమలో అందరూ పొరబాట్లు చేసేవాళ్ళేనని, తన కెరీర్‌లో మొట్టమొదటి సారిగా ‘అఖిల్’ సినిమా చేసి తప్పు చేశానని అన్నాడు.













Wednesday, December 23, 2015

"పాదాల పగుళ్ళ" నివారణకు చిట్కాలు !

మారుతున్న వాతావారణ పరిస్థితుల కారణంగా మానవ శరీరానికి అప్పుడప్పుడు కొన్ని సమస్యలు ఏర్పడుతాయి. అందులో ఇతర సమస్యల గురించి కాస్త పక్కనపెడితే.. సాధారణంగా చలికాలంలో పాదాల పగుళ్ల సమస్య ఎక్కువగా బాధిస్తుంది. ఇది కేవలం ఆడవాళ్లకే కాదు.. మగవాళ్లక్కూడా సంభవిస్తుంది. ఈ సమస్య మొదట్లో అంతగా ప్రభావం చూపదుగానీ.. రానురాను చాలా ప్రాబ్లమ్స్’ను క్రియేట్ చేసే అవకాశాలున్నాయి. కాబట్టి.. ఈ పగుళ్ల లక్షణాలు కనబడిన వెంటనే వాటిని నివారించుకుంటే మంచిది.

1. వంటనూనె : వంటకాల్లో ఉపయోగించే ఏ నూనెతోనైనా ఈ సమస్యను పరిష్కరించుకోవచ్చు. ముందుగా పాదాలను ప్యూమిస్‌ స్టోన్‌తో రుద్ది మృత చర్మం, మురికి వదిలించాలి. తర్వాత శుభ్రంగా కడిగి తుడిచి నూనె అప్లై చేయాలి. తర్వాత సాక్స్‌ వేసుకుని పడుకోవాలి. ఇలా క్రమం తప్పకుండా కొన్ని రోజులపాటు చేస్తే మంచి ఫలితాన్ని పొందవచ్చు.

2. బియ్యం పిండి : బియ్యం పిండిలో కాస్త తేనె, యాపిల్‌ సెడార్‌ వెనిగర్‌ చేర్చి పేస్ట్‌లా తయారుచేయాలి. గోరువెచ్చని నీటిలో 10 నిమిషాలపాటు పాదాలను నానబెట్టిన అనంతరం ఈ పేస్ట్‌తో రుద్ది శుభ్రంగా కడగాలి. తడి లేకుండా తుడిచి నూనె పూసుకుని సాక్స్‌ వేసుకుని పడుకోవాలి.
 
3. వేపాకు : ఈ ఆకులో పాదాల పగుళ్లనుంచి రక్షణ కల్పించే యాంటీఫంగల్‌ లక్షణాలు పుష్కలంగా వుంటాయి. గుప్పెడు వేపాకుకు స్పూను పసుపు కలిపి మెత్తగా రుబ్బాలి. ఈ పేస్ట్‌ను పాదాల పగుళ్లకు అప్లై చేసి అరగంట తర్వాత శుభ్రంగా కడగాలి. తడి ఆరాక నూనెతో మర్దిన చేసుకోవాలి.

4. రోజ్‌ వాటర్‌ - గ్లిజరిన్‌ : గ్లిజరిన్‌ చర్మాన్ని మృదువుగా తయారుచేస్తే.. రోజ్‌ వాటర్‌లోని ఎ, డి, ఇ, సి, బి3 విటమిన్లు చర్మానికి పోషణనిస్తాయి. ఈ రెండిటినీ సమపాళ్లలో కలిపి రోజూ నిద్రపోవడానికి ముందు పాదాలకు అప్లై చేసి ఉదయాన్నే కడిగేసుకోవాలి.

5. ప్యారాఫిన్‌ వ్యాక్స్‌ : పారాఫిన్‌ వ్యాక్స్‌కు ఆవ నూనె లేదా కొబ్బరి నూనెలో కలిపి వేడిచేయాలి. వ్యాక్స్‌ పూర్తిగా కరిగేంతవరకూ వేడిచేసి పూర్తిగా చల్లార్చాలి. ఈ మిశ్రమాన్ని రాత్రి పడుకోవడానికి ముందు పాదాలకు అప్లై చేసి ఉదయాన్నే కడిగేయాలి.

Tuesday, December 22, 2015

"సిక్స్ ప్యాక్" చేస్తున్న స్టార్ కమెడియన్ ?

ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీలో స్టార్ కమెడియన్ గా యమా బిజీగా ఉన్న 30 ఇయర్స్ పృథ్వి ఓ భారీ సాహసానికి రెడీ అవుతున్నాడు. యంగ్ హీరోలు కూడా రిస్క్ అనుకునే సిక్స్ ప్యాక్ సాధించటానికి కండలు కరిగిస్తున్నాడు. ఈ విషయాన్ని పృథ్వి స్వయంగా ప్రకటించాడు. తెలుగులో మంచి ఫాంలో ఉన్న పృథ్వి ఇంత రిస్క్ తీసుకుంటుంది మాత్రం తెలుగు సినిమా కోసం కాదట. ఇప్పుడిప్పుడే కోలీవుడ్ లో కూడా ఫాం అందుకుంటున్న ఈ కామెడీ స్టార్, ఓ తమిళ సినిమా కోసం సిక్స్ ప్యాక్ చేసే పనిలో ఉన్నాడు.

గతంలో కమెడియన్ గా ఎంట్రీ ఇచ్చిన సునీల్ కూడా సిక్స్ ప్యాక్ లో సందడి చేశాడు. అయితే సునీల్ హీరో అయ్యాకే సిక్స్ ప్యాక్ తో కనిపించాడు. కానీ పృథ్వి మాత్రం కామెడీ పాత్ర కోసమే ఇంత రిస్క్ చేస్తున్నాడు. అజిత్ హీరోగా తెరకెక్కుతున్న తమిళ సినిమాలో మూగవాడి పాత్రలో నటిస్తున్న పృథ్వి, ఆ సినిమా క్లైమాక్స్ లో షర్ట్ విప్పి కనిపించే సీన్స్ ఉన్నాయట, ఆ సీన్స్ లో సిక్స్ ప్యాక్ చేస్తే బాగుంటుందని అజిత్ సలహా ఇవ్వటంతో ఇప్పుడు అదే పనిలో ఉన్నాడు ఈ కామెడీ స్టార్.



Monday, December 21, 2015

క్షమాపణ చెప్పిన "జూ.ఎన్టీఆర్" ?

గత కొంతకాలంగా జూనియర్ ఎన్టీఆర్- బాలకృష్ణ మధ్య కోల్డ్ వార్ జరుగుతోందని వార్తలు వస్తూనే ఉన్నాయి. సినీ, రాజకీయ పరంగా వీరిమధ్య విభేదాలు వచ్చాయని ప్రచారం జరిగింది. అయితే, వీటికి బలం చేకూర్చేవిధంగా జూనియర్ ఎన్టీఆర్, బాలయ్యకు సారీ చెప్పారంటూ ఓ ఇంగ్లీష్ డైలీ తాజాగా ఓ వార్తా కథనం ప్రచురించింది. ఇటీవలే బాలకృష్ణకు ఫోన్ చేసి జూ. ఎన్టీఆర్  క్షమాపణ చెప్పారని తెలిపింది. ఇద్దరికి సన్నిహితుడైన ఒక సీనియర్ నటుడి ఫోన్ నుంచి జూనియర్ ఫోన్ చేసి బాలకృష్ణకు క్షమాపణలు చెప్పారని చెప్పింది.

అంతేకాదు,  కొన్నేళ్లుగా వీరిద్దరి మధ్య ఉన్న విభేదాల ప్రభావం ఎన్టీఆర్  కెరీర్ పై పడిందని చెప్పింది. ఇదిలాఉంటే, సంక్రాంతికి  బాబాయ్,  అబ్బాయ్ పోటాపోటీ గా సినిమాలు రిలీజ్ చేసేందుకు కూడా సిద్ధమైపోయారు. కాని తాజా పరిణామాల అనంతరం జూ. ఎన్టీఆర్ ఓ అడుగువెనక్కువేసి తన సినిమా రిలీజ్ ని వారం పాటు వాయిదా వేసుకోవాలని నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో జూనియర్ సినిమా ఆడియో విడుదలకు బాలకృష్ణ ఛీఫ్ గెస్ట్ గా వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. అయితే, దీనికి బాలకృష్ణ ఇంకా గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదని సమాచారం. 


Saturday, December 19, 2015

హీరో "చెంప ఛెళ్లుమనిపించిన" హీరోయిన్ ?

1990లో బాలీవుడ్ బ్లాక్‌బస్టర్ గా నిలిచిన 'ఘయాల్'కి ప్రస్తుతం సీక్వెల్ తెరకెక్కుతోంది. 'ఘయాల్ వన్స్ ఎగైన్' పేరుతో వస్తోన్న ఈ మూవీ లో హీరోగా సన్నిడియోల్, హీరోయిన్ గా సోహఅలీ ఖాన్ నటిస్తున్నారు. అయితే ఈ మూవీలో హీరోని హీరోయిన్ చెంప ఛెళ్లుమనిపించే సన్నివేశంలో నటించాల్సి వుంది.
 ఇందులో భాగంగా సీన్ షూట్ చేస్తున్నప్పుడు చెంపపై కొట్టినట్లుగా నటించాల్సిందిపోయి నిజంగానే సన్నీ చెంప ఛెళ్లుమనిపించిందట సోహఅలీఖాన్. దీంతో హీరో సన్నిడియోల్ ఏంజరుగుతుందో అర్థంకాక నిర్ఘాంతపోతే, హీరోయిన్ తీరు చూసి  సినిమా యూనిట్ అంతా బిత్తరపోయిందట. అసలెందుకు సోహ ఇలాంటి పనిచేసిందన్నది ఇప్పడు బాలీవుడ్ లో హాట్ న్యూస్ అయికూర్చుంది. 

Friday, December 18, 2015

"అతినిద్ర"ప్రాణాన్ని హరిస్తుందా?

సాధారణంగా అతిగా మద్యం సేవించినా.. పొగ తాగినా ప్రాణాలకు హాని కలుగుతుందని విస్తృతంగా ప్రచారం సాగుతోంది. అయితే, ఆస్ట్రేలియాలోని సిడ్నీ యూనివర్శిటీకి జరిపిన తాజా పరిశోధనలో అతిగా నిద్రపోవడం కూడా ప్రాణానికి హాని కలిగినట్టేనని చెపుతున్నారు. ఈ ముప్పు... అతిగా మద్యం సేవించడం కంటే ఎక్కువ ముప్పు అని ఈ పరిశోధన తేల్చింది. 
 
రోజుకు తొమ్మిది గంటలకు మించి నిద్రపోతే తొందరగా చచ్చిపోతారని తేల్చారు. ఈ పరిశోధనను 2,30,000 మంది ఆరోగ్య పరిస్థితిపై క్షుణ్ణంగా అధ్యయనం చేశారు. అతిగా మద్యపానం, ధూమపానం చేసిన వారి కంటే అతిగా నిద్రపోయేవారు చనిపోవడానికి రెండు రెట్లు ఎక్కువ అవకాశం ఉందని శాస్త్రవేత్తలు వెల్లడించారు. 
 
దీనికితోడు ఎక్కువ నిద్రపోయేవారు, ఎక్కువసేపు కూర్చునేవారు చనిపోవడానికి ఉండే అవకాశాలు సాధారణ వ్యక్తుల కంటే నాలుగు రెట్లు ఎక్కువగా ఉంటాయి. ఆరోగ్యకరమైన అలవాట్లు కలిగిన వారు సరాసరి ఆరు గంటలు పడుకుంటే క్షేమదాయకమని... మద్యం సేవించే వారు ఏడు గంటలు పడుకోవడం ఉత్తమమని ఈ పరిశోధకులు వెల్లడించారు. 


Thursday, December 17, 2015

కమల్ ని ఆలింగనం చేసుకుని "4 రోజులు స్నానం చేయలేదన్న" నటుడు ?


కన్నడ సూపర్ స్టార్ శివరాజ్‌కుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. విలక్షణ నటుడు కమల్ హాసన్‌ను ఒక్కసారి హత్తుకున్నానని (ఆలింగనం) ఆ తర్వాత నాలుగు రోజుల పాటు తాను స్నానం చేయలేదని చెప్పుకొచ్చారు. దీనికి కారణం లేకపోలేదన్నారు. 

విలక్షణ నటుడు కమల్ హాసన్ అంటే తనకు చాలా ఇష్టమని, వల్లమాలిన అభిమానమన్నారు. అందుకే ఒకసారి కమల్ హాసన్ తనను ఆలింగనం చేసుకున్నపుడు నాలుగు రోజులు స్నానం చేయలేదన్నారు. ఎందుకంటే ఆయన్ని హత్తుకున్న పరిమళం తనను వీడిపోవడం ఇష్టంలేక అలా చేశానని వెల్లడించారు. 

Wednesday, December 16, 2015

"అంకె"లతో "ముఖ" చిత్రాలు !









Tuesday, December 15, 2015

టీ, కాఫీలను తాగడానికి "ముందుగా" ఏం చెయ్యాలి ?

 టీ, కాఫీలను తాగడానికి ముందుగా ఒక గ్లాసు నీటిని తాగాలి.ఎందుకంటే టీ లోPH విలువ 6, కాఫీలో PH విలువ 5 ఉంటుంది. వీటిని తాగితే కడుపులో
అసిడిటి ఏర్పడి, అల్సర్లుగా మారే అవకాశం ఉంటుంది.కాబట్టి టీ, కాఫీలను తాగడానికిముందుగా ఒక గ్లాసు నీటిని తాగినట్లయితే అసిడిటి స్థాయిని తగ్గించుకోవడం ద్వారా ఆరోగ్యాన్నికాపాడుకోవచ్చు.

Monday, December 14, 2015

హీరో ఛాన్స్ దేవిశ్రీకి ప్లస్సా ? మైనస్సా ??

ప్రముఖ సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్ కు సింగం 3 డైరెక్టర్ షాక్ ఇచ్చాడు. ఇప్పటివరకూ వచ్చిన సింగం 1, సింగం 2 చిత్రాలకు దేవిశ్రీ చేతనే సంగీతం చేయించారు. కానీ తాజాగా తీస్తున్న సింగం 3 చిత్రానికి సంగీతం వహించే బాధ్యత నుంచి దేవిశ్రీని తప్పించేశాడు దర్శకుడు హరి. ఈ బాధ్యతను హారిస్ జయరాజ్ కు అప్పగించినట్లు సమాచారం.
 
దేవిశ్రీని ఈ ప్రాజెక్టు నుంచి తప్పించడం వెనుక పలు కారణాలున్నాయని అంటున్నారు. నాన్నకు ప్రేమతో, సర్దార్ గబ్బర్ సింగ్, ఎన్టీఆర్-కొరటాల కాంబినేషన్‌లో రాబోయే చిత్రాలకు మ్యూజిక్ ఇస్తూ దేవిశ్రీ బాగా బిజీ అయిపోయాడు. మరోవైపు దిల్ రాజు నిర్మాతగా, సుకుమార్ దర్శకత్వంలో హీరోగా నటించబోతున్నాడు. హీరో అయిపోతున్న మ్యూజిక్ డైరెక్టరుతో ఇక మ్యూజిక్ ఏం చేయిస్తాం అనే ఆలోచనలో కోలీవుడ్ దర్శకులు ఉన్నట్లు సమాచారం. మరి ఇది దేవిశ్రీకి ప్లస్ అవుతుందో మైనస్ అవుతుందో చూడాలి.

Wednesday, December 9, 2015

ఇంటికెళ్లి కోన వెంకట్‌ని కొడతానన్న హీరోయిన్ ?

నిఖిల్ హీరోగా ఉదయ్ నందనవనం దర్శకత్వంలో కోన వెంకట్ నిర్మించిన చిత్రం ‘శంఖరాభరణం' సినిమా ప్రమోషన్ లో భాగంగా మా టీవీ లో ప్రసారం అవుతున్న ‘మా టాకీస్' షో కి వెళ్ళిన చిత్ర యూనిట్ హోస్ట్ గా  వ్యవహరిస్తున్న మాజీ హీరోయిన్ రాశి కామెంట్స్ విని షాకయ్యారు. ఈ కార్యక్రమంలో కోన వెంకట్ మాట్లాడున్న సమయంలో రాశి కల్పించుకుని పాత ‘శంఖరాభరణం' గొప్ప మూవీ, పైగా సంగీత ప్రధాన చిత్రం. మీరు చేసిన క్రైమ్ కామెడీ కథకి శంకరా భరణం లాంటి గొప్ప టైటిల్ పెట్టడం ఏంటి ? అని ప్రశ్నిస్తూనే ఒకవేళ సినిమా బాగోలేక పొతే మాత్రం మీ ఇంటికొచ్చి మరీ కొడతాను అని అనేసింది. మరి ఆ కామెంట్స్ ఆమె నోటి నుండి అనుకోకుండా వచ్చాయో? లేక రాశి కావాలనే అలా మాట్లాడిందా? అనేది హాట్ టాపిక్ అయింది.





Tuesday, December 8, 2015

బిస్కట్లు తింటే "జ్ఞాపకశక్తి " తగ్గిపోతుందా?

బిస్కట్లు తింటే బుర్ర పనిచేయదా? అవుననే అంటున్నాయి కొత్త పరిశోధనలు. అదేపనిగా బిస్కట్లు, కేకులు తింటే మెమొరీ దెబ్బతినే ప్రమాదముందంటున్నారు. దీనికి కారణం బిస్కట్లు, కేకుల ప్రాసెసింగ్ సమయంలో బిస్కట్లు  కరకరలాడేందుకు, కేకులకు మంచి ప్లేవర్ రావడానికి వాడే ట్రాన్స్‌ఫ్యాట్స్ అనే కొన్నిరకాల కొవ్వు పదార్దాలే. దీనితో బాటు హైడ్రోజెనేటెడ్ ఆయిల్స్ వాడటం వల్ల ఆరోగ్యంపై చెడుప్రభావం చూపుతుందని సైంటిస్టులు తేల్చారు.
 ట్రాన్స్‌‌‌‌ఫ్యాట్స్ అధికంగా ఉండే బిస్కట్లు, కేకులు ఎక్కువగా తినేవారిలో మెమొరీ పవర్ తగ్గి పోయే ప్రమాదముందంటున్నారు సైంటిస్ట్‌లు. బిస్కట్లు, కేకుల్లో ఉండే ట్రాన్స్ ఫ్యాట్స్ ప్రభావం గురించి యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా, శాండియాగో స్కూల్ ఆఫ్ మెడిసిన్‌కు చెందిన శాస్ర్తవేత్తలు 45 ఏళ్లలోపు వయసున్న వెయ్యిమందిపై పరిశోధనలు చేశారు. ట్రాన్స్‌ఫ్యాట్స్‌తో కూడిన బిస్కట్లు, కేకులు అధికంగా తిన్నవారిలో జ్ఞాపకశక్తి తగ్గిపోవడాన్ని గమనించారు. మరికొంతమందిలో అధిక బరువు, గుండె సంబంధిత వ్యాధులు బయట పడ్డాయి. బ్రిటన్‌లో ఈ ఫ్యాట్స్ వాడకాన్ని దాదాపు నిషేధించినంత పని చేశారు.

Monday, December 7, 2015

కలాం ఆస్తుల జప్తుకు ఆదేశాలు ! బీఎస్ఎన్ఎల్ నిర్వాకం ?

దేశం గర్వించదగిన శాస్ర్తవేత్త, మాజీ రాష్ర్టపతి దివంగత ఏపీజే అబ్దుల్ కలాం గురించి అందరికీ తెల్సిందే! ఆయన మరణించి దాదాపు నాలుగునెలలు అవుతోంది. యావత్తు వరల్డ్  ఆయన్ని గుర్తించినా, ప్రభుత్వ టెలికాం దిగ్గజం బీఎస్ఎన్ఎల్ మాత్రం గుర్తించలేదు.
 తనకు బకాయిపడ్డ స్వల్ప మొత్తాన్ని చెల్లించాలంటూ కలాంకు నోటీసులు జారీ చేసింది. అంతేకాదు బకాయి చెల్లించని పక్షంలో కలాంకు చెందిన ఆస్తులను జప్తు చేయాలని కూడా తన దిగువస్థాయి సిబ్బందికి ఆ సంస్థ ఉత్తర్వులు జారీ చేసేసింది. ఇంతకీ మాజీ రాష్ర్టపతి పడిన బకాయి ఎంతో తెలుసా? కేవలం రూ.1029 మాత్రమే(phone no 2724800).
 ఐదేళ్ల కిందట అంటే 2010లో తిరువనంతపురం టూర్‌లో భాగంగా కేరళ రాజ్‌భవన్‌లో రెండురోజులు బస చేశారు. ఈ సందర్భానికి సంబంధించింది ఈ బిల్లు. నోటీసు మాత్రం నవంబర్ 18, 2015లో జారీ అయ్యింది. అంటే కలాం మరణించిన నాలుగు నెలలు అవుతోంది. మరోవైపు బీఎస్ఎన్ఎల్ జారీ చేసిన నోటీసు విషయం తెలుసుకున్న కేరళ రాజ్‌భవన్ వర్గాలు షాక్‌కు గురయ్యాయి. ఆ బిల్లును తాము చెల్లిస్తామంటూ రాజ్‌భవన్ వర్గాలు ప్రకటించాయి. 

Saturday, December 5, 2015

జంటలో ఇద్దరూ సంపాదనపరులే ! కాని ఆ విషయంలో... ?

చూడ్డానికి కపుల్స్ చాలా హ్యాపీగా కనిపిస్తారు.. చిరునవ్వులు చిందిస్తూ తమ రత్నాల్లాంటి బిడ్డలతో, మంచి సంపాదనతో ఎంజాయ్ చేస్తున్నట్టు నటిస్తారు. కానీ అసలు సంగతికొస్తే.. అవన్నీ పైపై మెరుగులేనని, లోపల అసలు విషయం ఏమీ లేదని ఇలాంటివారికి కౌన్సెలింగ్ ఇస్తున్న నిపుణులు చెబుతున్నారు. బెడ్ రూముల్లో ఎవరికివారు సెపరేట్ అట.. డబుల్ ఇన్ కమ్.. బట్ నో  సెక్స్ అంటున్నారు. మోడరన్ మ్యారేజీల్లో ఇలాంటి ధోరణి పెరిగిపోతోందట.. బెడ్ రూముల్లో వీళ్ళు లైంగికానందం పొందలేకపోతున్నారని, ఫలితంగా  విడాకులు పెరిగిపోవడం వంటివి జరుగుతున్నాయని వారు విశ్లేషించారు. 

చాలామంది మద్యం తాగుతూనో, నెట్ లేదా టీవీ చూడడంతోనో, స్నేహితులతోనే ఎంజాయ్ చేస్తూనో గడుపుతుంటారని. దీంతో భార్యాభర్తలమధ్య దూరం పెరిగిపోతోందని  అన్నారు. సెక్స్ అన్నది లేకపోతే  ఒంటరిగా ఫీలవుతారని  అభిప్రాయపడ్డారు. అందువల్లే వర్క్-లైఫ్ బ్యాలన్స్ అవసరమని  సూచించారు.

Friday, December 4, 2015

త్వరలో నోరూరించే "టెస్ట్‌ట్యూబ్ చికెన్"

లెక్కకు మించి పెరిగిపోతున్న జనాభా నాన్‌వెజ్ రుచుల అవసరాలు తీర్చాలంటే ఇక ల్యాబ్ ఫుడ్డే దిక్కంటున్నాయి పరిశోధనలు.. నాన్‌వెజ్‌కు రోజూ పెరిగిపోతున్న డిమాండ్‌ను తట్టుకోవాలంటే  టెస్ట్‌ట్యూబ్ రెసీపీలే తప్పనిసరి అని తేల్చారు. టెస్ట్ ట్యూబ్ బేబీ సెన్సేషన్ క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే.. దాని తర్వాత టెస్ట్ ట్యూబ్  హాంబర్గర్స్ కూడా  వరల్డ్ మార్కెట్‌లో ఆదరణ పొందాయి. ఇవ్వన్నీ సరే.. త్వరలో లేబొరేటరీ నుంచి మరో అద్బుతాన్ని ఆవిష్కరించేందుకు రెడీ అవుతున్నారు సైంటిస్టులు.. ఇదే కనుక సక్సెస్ అయితే.. కొక్కొరోకో మంటూ తిరిగే  కోడిని టేస్ట్‌ఫుల్‌గా వండిలొట్టలేసుకు తినేందుకు పౌల్ర్టీల దగ్గర, చికెన్‌షాపుల దగ్గర వెయిట్ చేసేబాధ కూడా తగ్గుతుందంటున్నారు. రానున్న మరికొద్ది మాసాల కాలంలోనే ల్యాబ్ చికెన్ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని పరిశోధకులు చెబుతున్నారు.

టెల్అవివ్ యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్ అమిత్ గిఫెన్ అనే బయోఇంజనీర్ సంవత్సరం నుంచి ల్యాబ్‌లో చికెన్ తయారుచేయడంపై ప్రయోగాలు చేస్తున్నారు. త్వరలోనే ఈ కల్చర్డ్ మీట్ కల ఫలిస్తుందన్న నమ్మకం ఉందనీ టెస్ట్‌ట్యూబ్ చికెన్ రెసిపీ సెల్స్ పెంపకం సక్సెస్ అయితే ముందురోజుల్లో కబేళాల్లో జంతువుల కోత అవసరమే ఉండదంటున్నారు సైంటిస్ట్‌లు.ఈ సంవత్సరం చివరికల్లా  చికెన్ సెల్స్  కల్చర్ పూర్తి అవుతుందని,  చికెన్ కున్న అత్యధిక డిమాండ్‌ను  ల్యాబ్‌చికెన్ తీరుస్తుందనీ అంటున్నారు.  2050  సంవత్సరంనాటికి  పెరిగే 9బిలియన్ల జనాభా నాన్‌వెజ్ ఫుడ్  డిమాండ్.. కల్చర్ మీట్, ల్యాబ్ చికెన్ తోతీరుతుందని  పరిశోధకులు చెబుతున్నారు. పైగా కల్చర్ మీట్  తయారీలో అతితక్కువ గ్రీన్హౌజ్ గ్యాస్ విడుదలవుతుందనీ, నీటి వినియోగం కూడా  82 నుంచి 96శాతం తక్కువగా ఉంటుందనీ, లైవ్ స్టాక్ కోసం భూమి పెద్దగా అవసరం ఉండదనీ ఆక్స్ ఫర్డ్ విశ్వవిద్యాలయం, యూనివర్సిటీఆఫ్ ఆమ్‌స్టర్డామ్ పరిశోధనలు చెబతున్నాయి.

Thursday, December 3, 2015

పిల్లలకు "ఎలాంటి" ఆహారాన్ని తినిపించాలి ?

వర్షాకాలం, చలికాలంలో పిల్లలకు తేలికగా జీర్ణమయ్యే ఆహారం ఇవ్వాలని చైల్డ్ కేర్ నిపుణులు అంటున్నారు. మెత్తగా ఉడికించిన అన్నంకి, కొద్దిగా పెరుగు, పంచదార కలిపి బాగా మెత్తగా చేసి పెట్టాలి. పిల్లలకు తినిపించే ఆహారాల్లో ఇదొక బెస్ట్ ఫుడ్. 
 
కావల్సినన్ని ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్ పెరుగన్నంలో ఉన్నాయి. సాధారణంగా పిల్లల పెరుగుదలకు నెయ్యితో కూడిన ఆహారాన్ని తినిపించాలి. ఇది పెరుగుదలకు మాత్రమే కాకుండా శక్తి, ఎముకలకు బలాన్ని చేకూర్చుతాయి. 
 
రైస్ లేదా రోటితో పప్పు వంటివి పిల్లలకు పెట్టొచ్చు. ఇవి సులభంగా జీర్ణమవుతాయి. అంతేకాదు వెజిటేబుల్ లేదా చికెన్ తినిపించాలనుకొన్నప్పుడు అందులో పెప్పర్‌ను చేర్చడం వల్ల కావల్సినన్ని న్యూట్రిషియన్స్ అందిస్తాయి. 
 
అలాగే వెరైటీగా రైస్‌ తినిపించవచ్చు. కిచిడి అనేది పప్పు, రైస్, కూరగాయలతో చాలా మృదువుగా తయారు చేసి తినిపించవచ్చు. ఇది చాలా రుచిగా ఉండటం వల్ల పిల్లలు చాలా ఇష్టంగా తినడమే కాకుండా అధిక న్యూట్రీషన్లు అందిస్తుంది. 
 
ఇంకా గోధుమ రవ్వను చాలా మెత్తగా ఉడికించి, కూరగాయలు కూడా చేర్చి తినిపించవచ్చు. చివరగా నెయ్యిని గార్నిష్ చేసి పెడితే పిల్లలు చాలా ఇష్టంగా తింటారని న్యూట్రీషన్లు అంటున్నారు.

Wednesday, December 2, 2015

"శాండ్‌విచ్" కోసం శరీరాన్ని అమ్ముకుంటున్నారు !

సాధారణంగా అనేక మంది పేద మహిళలు పొట్టకూటి కోసం పడుపు వృత్తి చేస్తుంటారు. మరికొంతమంది అమ్మాయిలు జల్సాలు చేసేందుకు అవసరమైన డబ్బు కోసం వ్యభిచారం చేస్తుంటారు.  ఆ దేశ అమ్మాయిలు, మహిళలు మాత్రం ఒక్కపూట కడుపు నింపుకునేందుకు పురుషులకు పడక సుఖం అందిస్తున్నారు. అదీ కూడా ఒకే ఒక్క శాండ్‌‌విచ్ కోసం. ఇలాంటి దారుణ పరిస్థితిని గ్రీస్ మహిళలు ఎదుర్కొంటున్నారు. 
 
గ్రీస్ దేశాన్ని ఆర్థిక సంక్షోభం తీరని కష్టాల్లోకి నెట్టిన విషయంతెల్సిందే. ఈ సంక్షోభం కేవలం ఆ దేశాన్ని మాత్రమే కాకుండా, ప్రపంచ ఆర్థిక వ్యవస్థను సైతం ఓ కుదుపు కుదిపింది. ఫలితంగా గ్రీస్ దేశానికి తీరని కష్టాలను మిగిల్చింది. చాలా మంది ప్రజలు ఆకలితో అలమటిస్తున్నారు. పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నాయంటే.. కొందరు యువతులు ఆకలి బాధలను తాళలేక ఓ శాండ్‌విచ్ కోసం తమ శరీరాన్ని అమ్ముకుంటున్న వైనం వారి దయనీయ పరిస్థితికి అద్దం పడుతోంది. 
 
తాజాగా గ్రీక్‌ దేశంలో 17 వేల మందికిపైగా సెక్స్ వర్కర్లు ఉన్నట్టు ఓ సర్వేలో వెల్లడైన నిజం. తూర్పు యూరప్‌లో వ్యభిచార వృత్తిలో గ్రీక్ మహిళలే ఎక్కువ మంది ఉన్నట్టు ఈ సర్వే వెల్లడించింది. గ్రీక్‌లో ఆర్థిక సంక్షోభం రాకముందు సెక్స్ వర్కర్లు దాదాపు రూ.4000 వేల వరకు డిమాండ్ చేసేవారు. కాగా ఇప్పుడు 150 రూపాయలు ఇస్తే చాలన్నట్టుగా పరిస్థితి మారింది. 17-20 ఏళ్ల వయస్సులో ఈ వృత్తిలోకి వస్తున్నట్టు సర్వేలో తేలిన నిజం.

Tuesday, December 1, 2015

"మందుకథ"

సరదాగా సాయంత్రం పూట ఫ్రెండ్స్‌తో ఓ బీరేస్తే కొంపలంటుకోవులే బాస్ .. అనుకునే వాళ్లకి కొన్ని షాకింగ్ నిజాలు! ఆల్కహాల్  చేసే చేటు గురించి సైంటిఫిక్‌గా ప్రూవ్ అయినకొన్ని విషయాలు తెలుసుకుందాం.

 మొదటి సిప్ నాలుక మీదనుంచి గొంతులోకి జారగానే మీకు మతిమరుపు మొదలవుతుంది. అలా ఒక క్వార్టర్ ఫినిషింగ్ అయిన పావుగంట తరువాత బాడీలో రసాయనిక చర్య జరిగి శరీరంలో హ్యాపీనెస్ అనే కొత్త 'కెమికల్' రిలీజ్ అవుతుంది. దాని కారణంగా పెదవిపై చిరునవ్వు తొణికిసలాడుతుంది.

అరగంట తరువాత స్టమక్ యాక్టివేట్ అవుతుంది. నాలుక కొత్త రుచులు కోరుతుంది. వేపుళ్లు, స్సైసీ స్నాక్స్‌ కావాలంటుంది.

 ఇక 60 నిమిషాలు గడిచి మూడో క్వార్టర్‌లోకి అడుగు పెట్టగానే ఆల్కహాల్ తన ప్రభావాన్ని కిడ్నీలపై చూపడం మొదలుపెడుతుంది.ఎక్కువ సార్లు యూరిన్‌కు వెళ్లాల్సి వస్తుంది. దీన్నే 'బ్రేకింగ్ ద సీల్'  అని పిలుస్తుంటారు. మందు మొదలుపెట్టి రెండుగంటలు అయ్యేసరికి నాలుగో క్వార్టర్‌కు చేరుకుంటుంది. అప్పుడు మీ మనసు మీ మాట వినదు. బ్లడ్‌లో ఆల్కహాల్ కలిసి నిన్న మొన్నటి సంగతుల్ని రీ కలెక్ట్ చేయడం మొదలుపెడుతుంది. మీకు తెలియకుండానే మీ కిష్టమైన పాట హమ్ చేస్తుంటారు. 

మందు ముందుకూర్చుని రెండున్నర గంటలు దాటిన తరువాత మాట తడబడుతుంది. ఇక మీరేం మాట్లాడుతున్నారో మీకర్ధంకాదు. మీకు తెలియకుండానే పెద్దగా మాట్లాడటం స్టార్ట్ చేస్తారు.

 మూడోగంట... ఆరోపింట్ బీర్.. లివర్‌లో హ్యాపీనెస్ 'కాక్ టైల్' అయి కొత్త ఎంజైమ్ పుట్టుకొస్తుంది. దానిపేరే 'రిమోర్స్'... స్వర్గం ఎంత దూరం.. ఇంకెంత.. బెత్తెడే అన్నట్టుంటుంది.

 మందు మొదలెట్టి నాలుగో గంట గడిచేసరికి ఇక నడవలేక, నిలబడలేక నానా ఇబ్బందులు మొదలు. వచ్చే వామ్టింగ్ సెన్సేషన్‌ను అపుకోవడానికి కారంగా ఉండే కబాబ్ ముక్క  వెదుక్కుంటారు.

 అంటే ఒకపింట్‌తోస్టార్ట్ అయి చివరకునానా యాతనలు పెట్టే మందుకథలు.. అనేకం.. మమేకం.. ఒకపెగ్గుతోఆగకుండా మందుతో మమేకమై తాగితే ఇంతే సంగతులంటున్నారు.