Friday, December 30, 2016
Tuesday, December 27, 2016
Monday, December 26, 2016
"జాజికాయ"తో ఎన్నో ప్రయోజనాలు !
జాజికాయ మానసిక ఒత్తిడిని తగ్గిస్తుంది. కామవాంఛని పెంచుతుంది. వీర్యకణాల ఉత్పత్తిని వృద్ధి చేస్తుంది. జాజికాయను కొద్దిపాటి మంటమీద నేతిలో వేయించి పొడిచేసి ఉంచుకోండి. ఈ చూర్ణాన్ని 5 గ్రాముల మోతాదుగా ఉదయం, సాయంత్రం గోరువెచ్చని ఆవుపాలతో కలిపి తాగాలి. ఇది నపుంసకత్వాన్ని తరిమి కొడుతుంది. నరాల బలహీనతని పోగొడుతుంది. వీర్యకణాల సంఖ్యను పెంచుతుంది. జాజికాయ కేవలం ఆరోగ్యానికే కాదు.. అందాన్ని ద్విగుణీకృతం చేసుకోవడంలోనూ ఉపయోగపడుతుంది.
కొంచెం జాజికాయ పొడిని తీసుకుని దానికి నీళ్లు లేదా తేనె కలిపి పేస్ట్లాగా తయారు చేయాలి. దీన్ని ముఖానికి స్క్రబ్లా రాసుకోవాలి. ఇలా తరచూ చేస్తుంటే కొన్ని రోజులకు చర్మం కాంతివంతమవడంతో పాటు చర్మంపై ఉండే మచ్చలు, మొటిమలు తొలగిపోతాయి. జాజికాయను పొడిగొట్టి, అతి స్వల్ప పరిమాణంలో వాడినట్లయితే, కొన్ని అనారోగ్యాలకు మంచి ఔషధంగా పనిచేస్తుంది.
కొంచెం జాజికాయ పొడిని తీసుకుని దానికి నీళ్లు లేదా తేనె కలిపి పేస్ట్లాగా తయారు చేయాలి. దీన్ని ముఖానికి స్క్రబ్లా రాసుకోవాలి. ఇలా తరచూ చేస్తుంటే కొన్ని రోజులకు చర్మం కాంతివంతమవడంతో పాటు చర్మంపై ఉండే మచ్చలు, మొటిమలు తొలగిపోతాయి. జాజికాయను పొడిగొట్టి, అతి స్వల్ప పరిమాణంలో వాడినట్లయితే, కొన్ని అనారోగ్యాలకు మంచి ఔషధంగా పనిచేస్తుంది.
తాంబూలంలో జాజికాయను వేసుకుని సేవిస్తే నోటి దుర్వాసనను పోగొడుతుంది. పంటిమీద నలుపునూ, గారను తొలగించి, పళ్ళు మెరిసేలా చేస్తుంది. పాలలో జాజికాయ పొడిని కలుపుని తాగితే గుండెల్లో నొప్పి, దడ తగ్గుతాయి. గోరువెచ్చని పాలల్లో, చాలా స్వల్ప పరిమాణంలో ఈ పొడిని కలుపుకుని తాగితే చర్మ కాంతి పెరగడమే కాకుండా, చర్మం ముడతలు పడవు. అధిక దాహాన్ని అరికడుతుంది. అలసటవల్ల వచ్చిన జ్వరాన్ని తగ్గిస్తుంది. మనస్సులోని ఆవేశాన్ని, ఆగ్రహాన్ని, ఉద్రేకాన్ని తగ్గించి మనస్సు ప్రశాంతంగా ఉండేలా చేస్తుంది. మలేరియా జ్వరానికి ఉపశమనాన్ని కలిగిస్తుంది. దగ్గు, జలుబు, కఫానికి ఔషధంగా పనిచేస్తుంది.
ఈ కాయలో లభించే 'మిరిస్టిసిన్' అనే పదార్థం మెదడు చురుగ్గా పనిచేసేందుకు సహకరిస్తుంది. అంతేకాక అల్జీమర్స్ తాలూకు లక్షణాలను ఆలస్యం చేయడానికి జాజికాయ ఉపకరిస్తుంది. వ్యర్థ పదార్థాలను శరీరం నుంచి పూర్తిగా తొలగించే శక్తి జాజికాయకు ఉంటుంది. అలాగే ఇది మూత్రపిండాల్లో ఏర్పడిన రాళ్లను కరిగించడంతో పాటు ఈ రెండు వ్యవస్థల పనితీరును మెరుగుపరుస్తుంది. మోతాదుకు మించి జాజికాయను ఉపయోగించడం వల్ల జీర్ణ సంబంధ సమస్యలతో పాటు ఏకాగ్రత కోల్పోవడం, ఎక్కువ చెమట పట్టడం.. వంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది. కాబట్టి జాజికాయ వాడకం విషయంలో కాస్త జాగ్రత్త వహించడం ముఖ్యం. గర్భవతులు దీన్ని ఉపయోగించకూడదు.
Saturday, December 24, 2016
రాజమౌళిని "కొట్టిన" విజయేంద్రప్రసాద్! ఎందుకో తెలుసా?
ఒకరోజు నేను ఇంటికి వచ్చేసరికి నేలమీద ఒక లైనులో పాకుతూ వెళుతున్న చీమల్ని నలుపుతూ చంపడం గమనించాను. వెంటనే పిర్ర మీద గట్టిగా ఒక్క దెబ్బ కొట్టాను. ఏడ్చి కన్నీళ్ళు పెట్టుకున్నాడు రాజమౌళి. ఎత్తుకుని సముదాయించాను. ఇప్పుడు ‘నిన్ను ఎందుకు కొట్టానో తెలుసా? అని అడిగాను. కన్నీళ్ళు పెట్టుకుంటూనే తెలియదన్నాడు. ‘ఎందుకు ఏడ్చావ్?' అని అడిగాను. నొప్పి పుట్టింది అన్నాడు. నువ్వు నలిపినప్పుడు చీమలకు కూడా అలాగే నొప్పి పుడుతుంది. జీవహింస మహాపాపం. ఇతరుల్ని ఎప్పుడూ అలా బాధ పెట్టకూడదు' అని చెప్పాను. ఆ తర్వాత ఆయన్ని నేను ఎప్పుడూ కొట్టలేదు అంటూ విజయేంద్రప్రసాద్ నవ్య ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.
Friday, December 23, 2016
అచ్చం జయలలిత ముఖంలా ఉండే 68 కిలోల ఇడ్లీ !
9:00 AM
No comments
తమిళనాడు దివంగత సీఎం జయలలిత మరణించిన నేపథ్యంలో.. ఆమె మరణించి ఇన్నాళ్లైనా.. తమిళనాడు ప్రజల గుండెల్లో మాత్రం ఆమెపట్ల అభిమానం మాత్రం ఏమాత్రం చెక్కుచెదరలేదు. ఏదో ఒక రూపంలో తమ అభిమానాన్ని వాళ్లు చాటుకుంటూనే ఉన్నారు. చెన్నై మెరీనా బీచ్లోని అమ్మ సమాధికి అభిమానులు భారీ స్థాయిలో నివాళులు అర్పిస్తున్నారు.
తాజాగా జయలలిత వయసు (68 సంవత్సరాలు)ను సూచించేలా.. 68 కిలోల బరువున్న ఒక ప్రత్యేకమైన ఇడ్లీ ఒకదాన్ని తయారుచేశారు. అచ్చం జయలలిత ముఖంలాగే ఉండేలా దాన్ని రూపొందించారు. ఇంతకుముందు కూడా అమ్మ మీద అభిమానాన్ని పలు రకాలుగా తమిళ ప్రజలు చాటుకున్నారు. కానీ, తమిళులకు ప్రీతిపాత్రమైన టిఫిన్ అయిన ఇడ్లీని కూడా ఆమె ముఖం గుర్తుకొచ్చేలా తయారుచేయడం మాత్రం ఇదే మొదటిసారి.
ఈ ఇడ్లీని అమ్మ సమాధి వద్ద ప్రజలకు సందర్శించే విధంగా ఉంచారు. అమ్మ మరణానికి అనంతరం అన్నాడీఎంకే కార్యకర్తలు అమ్మకు ఆలయంతో పాటు విగ్రహం కూడా సిద్ధం చేశారు. చెన్నై మెరీనాలోనే అమ్మకు ఆలయం నిర్మించేలా సన్నాహాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది.
Wednesday, December 21, 2016
శృంగార ప్రియులకు ఇష్టమైన రోజులు ?
9:00 AM
No comments
శృంగార ప్రియులు ఏ రోజుల్లో సెక్స్పట్ల ఆసక్తి చూపుతున్నారనే అంశంపై తాజాగా నిర్వహించిన సర్వే నిర్వహించారు. ఈ సర్వేలో వారంలో మిగిలిన రోజుల కంటే 44 శాతం మంది దంపతులు శని, ఆదివారాల్లో శృంగారానికి ఎక్కువ ప్రాధాన్యమిస్తున్నారట. ఆదివారం 16 శాతం మంది, శుక్రవారం 23 శాతం మంది శృంగారం పట్ల ఆసక్తి చూపుతున్నారని సర్వేలో తేలింది. ముఖ్యంగా శనివారం రాత్రి 7.30కు ఎక్కువ మంది సెక్స్లైఫ్ ఎంజాయ్ చేస్తున్నారట. వారానికి నాలుగుసార్లు సెక్స్లో పాల్గొనే దంపతులు తమ నిజమైన వయస్సు కన్నా పదేళ్ళు చిన్నవారిగా కనిపిస్తారట.
ఇకపోతే మిగిలిన రోజుల్లో శృంగార ప్రియులు సెక్స్ పట్ల ఆసక్తి చూపట్లేదని.. గురువారం పూట మాత్రం కొంత ఆసక్తి చూపుతున్నారని తేలింది. ఇక సోమవారం 8 శాతం మంది బుధవారం నాడు 7 శాతం మంది సెక్స్ చేసేందుకు ఆసక్తి చూపుతున్నారట. మిగిలిన విషయాల్లోకి వస్తే.. ఉదయం నిద్రలేచే సమయంలో పురుషుల్లో సెక్స్ కోరికలు ఎక్కువగా ఉంటున్నాయని సర్వేలో తేలింది. కొన్నిసార్లు సాయంత్రం 4.30 గంటలకు వారు సెక్స్కు సరైన సమయంగా ఎంచుకుంటున్నారని సర్వేలో వెల్లడైంది.
Tuesday, December 20, 2016
ప్రతి భారతీయుడి తల మీద ఎంత "అప్పు" ఉందో తెలుసా ?
9:00 AM
No comments
మనకు తెలీకుండానే మనల్నే ప్రపంచబ్యాంకు వద్ద తాకట్టు పెడుతున్నాయి ప్రభుత్వాలు, మన ప్రమేయం లేకుండా మనల్ని రుణ గ్రస్తుల్ని చేస్తున్నాయి. మనకు తెలీకుండానే మనమీద దేశం చేసిన అప్పు 60 లక్షల 19 వేల కోట్లు. ప్రస్తుతం మన దేశ జనాభా 2011 లెక్కల ప్రకారం 129.5 కోట్లు.
ఈ దామాషా ప్రకారం ప్రతి భారతీయుడి తల మీద రూ. 46,485 అప్పు వుందన్నమాట ఇది లేటెస్ట్ ఫిగర్స్. ఐతే, 2016 మార్చి 31 నాటికి తలసరి అప్పు రూ.53,796 గా నమోదైనట్టు ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ శుక్రవారం పార్లమెంట్లో వెల్లడించారు. దీనిపై ఏటా చెల్లిస్తూ వస్తున్న వడ్డీ దాదాపు రూ. నాలుగు లక్షల కోట్లు. వృద్ధి సాధించడానికి ధన వ్యయం పెంచడంవల్లే అప్పు పెరిగినట్లు కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్జైట్లీ లోక్సభకు తెలిపారు.
Monday, December 19, 2016
"చిలకడదుంప"లను తినడం వల్ల కలిగే ఉపయోగాలు !
చౌకగా లభించే చిలకడదుంపలను తినటానికి ప్రతి ఒక్కరు ఇష్టపడతారు. ఈ దుంపలు పిండిపదార్థాలను కలిగి ఉండి, అధిక మొత్తంలో చక్కెరలను కలిగి ఉంటుంది. ఇవి పోషకాలను కలిగి ఉండటమే కాకుండా, వివిధ రకాలుగా ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుంది. చిలకడదుంప పొటాషియంను పుష్కలంగా కలిగి ఉంటుంది. ఇది హృదయ స్పందన మరియు నరాల సంకేతాలను నియంత్రిస్తుంది. మూత్రపిండాల వ్యాధులు, వాపులు, కండరాల తిమ్మిరులను పొటాషియం తగ్గిస్తుంది.
కడుపు (జీర్ణాశయంలో) ఏర్పరిచే అల్సర్లను తగ్గించి వేస్తాయి. ఫైబర్లను అధిక మొత్తంలో కలిగి ఉన్న, ఈ పిండి పదార్థాలతో కూడిన ఆహారం, అసిడిటీ సమస్యలను మరియు మలబద్దకం వంటి వాటిని కలుగకుండా చూస్తాయి. విటమిన్ 'ఎ', యాంటీ క్యాన్సర్ గుణాలను కలిగి ఉండి, క్యాన్సర్ కలుగచేసే కారకాలకు వ్యతిరేకంగా పనిచేయటమే కాకుండా ఈ దుంపలలోని అతినీలలోహిత కిరణాల వలన కలిగే ప్రమాదాల నుండి, మరియు వీటి వలన ప్రమాదానికి గురైన కణాలను భర్తీ చేయటానికి ఈ విటమిన్ సహాయపడుతుంది.
చిలకడ దుంప, శరీర రక్తంలో తెల్ల రక్తకణాలను మరియు ఎర్ర రక్త కణాల ఉత్పత్తిని అధికం చేసి, ఒత్తిడిని తగ్గిస్తుంది. చిలకడ దుంప, విటమిన్ 'డి'ని పుష్కలంగా కలిగి ఉండటం వలన రోగనిరోధక శక్తిని మెరుగుపరచి, మానసిక కల్లోలాలను తగ్గించి, శక్తిని పెంచి, ఎముకల ఆరోగ్యాన్ని పెంచుతుంది. గుండె కండరాలు బలంగా ఉండేలా నిర్మిస్తుంది. చిలకడదుంప పుష్కలమైన విటమిన్ 'సి' కలిగి ఉండి, జలుబు మరియు ఫ్లూలను తగ్గించటమే కాకుండా, దంతాలు, ఎముకల ఏర్పాటు, రక్త కణాల మరియు కొల్లజన్ ఉత్పత్తిలను పెంచుతుంది. కొల్లాజన్ చర్మ కణాలకు స్టితిస్థాపకతను చేకూర్చి ఒత్తిడి మరియు క్యాన్సర్ వ్యాధిని కలుగచేసే కారకాల చర్యలను అడ్డుకుంటుంది.
Tuesday, December 13, 2016
అమ్మ మరణానికి "విగ్రహ ప్రతిష్టాపనే" కారణమా ?
9:00 AM
No comments
నాటకీయ పరిణామాల నడుమ కన్నుమూసిన తమిళ దివంగత సీఎం జయలలిత మరణానికి సంబంధించి రోజుకో కొత్త వార్త తెరపైకి వస్తూనే ఉంది. అపోలో వైద్యులు ఆమె మరణాన్ని ధ్రువీకరించిన ఒకరోజు ముందే ఆమె చనిపోయారని కొంతమంది వాదిస్తుంటే.. అసలు అమ్మ మరణానికి స్పష్టమైన కారణాలేంటో చెప్పాలని నటి గౌతమి లాంటి వాళ్లు ప్రశ్నిస్తున్న సంగతి తెలిసిందే. ఇలాంటి తరుణంలో అమ్మ మరణానికి సంబంధించి ఓ ఆసక్తికర వాదనను కొంతమంది తెరపైకి తెచ్చారు. ఓ విగ్రహ ప్రతిష్టాపనకు అమ్మ మరణంతో లింకు పెట్టేశారు. ఆ విగ్రహ ప్రతిష్టాపన వల్లే అమ్మ మరణించారంటూ ఇప్పుడు తమిళనాట జోరుగా చర్చ జరుగుతోంది. దైవ సంబంధిత విషయాలకు అధిక ప్రాధాన్యతమిచ్చే కొంతమంది వ్యక్తులు.. ఇలాంటి ప్రచారానికి ఆస్కారం కల్పించారన్న వాదన కూడా లేకపోలేదు.
ఇంతకీ అసలు విషయమేంటంటే.. కాంచీపురం జిల్లాలోని అత్యంత పురాతనమైన, ప్రసిద్ధమైన ఏకాంబరనాథర్ ఆలయంలో మూలవిరాట్టు విగ్రహం ఉంది. కొన్నాళ్ల క్రితం ఇది ధ్వంసం కావడంతో.. దీని స్థానంలో కొత్త విగ్రహాన్ని ప్రతిష్టించాలని ఆలయ కమిటీ నిర్ణయించింది. అయితే ఆలయ కమిటీ ప్రతిపాదనల్ని తోసిపుచ్చుతూ..చిన్నపాటి మరమ్మతులు చేస్తే సరిపోతుందని శిల్పులు చెప్పారు. అంతేకాదు మూల విరాట్టు విగ్రహాన్ని మార్చడం వల్ల రాష్ట్రాధినేత ప్రాణానికి గండం ఏర్పడుతుందని కూడా చెప్పారట. అయితే ఇవేవి పట్టించుకోని ఆలయ కమిటీ ఈ నెల 5న కొత్త విగ్రహాన్ని ప్రతిష్టించింది. జయలలిత కూడా అదే రోజున కన్నుమూయడంతో.. అమ్మ మరణానికి విగ్రహ ప్రతిష్టాపనే కారణమంటూ కొంతమంది వాదించడం మొదలుపెట్టారు.
Wednesday, December 7, 2016
శీతాకాలం లో ఏఏ పండ్లు తినాలో తెలుసా?
శీతాకాలంలో విటమిన్ సి పుష్కలంగా ఉండే పండ్లను తీసుకోవాలి. శీతాకాలంలో దానిమ్మను తీసుకోవచ్చు. దానిమ్మను అలాగే తీసుకోవడం లేదా సలాడ్స్ రూపంలో తీసుకోవడం వంటివి చేయొచ్చు. ఇది క్యాన్సర్ కణాలను నివారిస్తుంది. యాంటీ ఆక్సిడెంట్లను పూర్తిగా కలిగివుండే ఈ ఫ్రూట్ను తీసుకోవడం ద్వారా హృద్రోగ సమస్యలను దూరం చేసుకోవచ్చును.
అలాగే సి విటమిన్ ఫ్రూట్స్ గల నిమ్మ, ఆరెంజ్, గ్రేప్ ఫ్రూట్స్, కివి ఫ్రూట్స్, టాంగరీన్స్ వంటివి తీసుకోవాలి. టాంగెరీన్స్ తీసుకోవడం ద్వారా వింటర్లో ఏర్పడే చర్మ సమస్యలను దూరం చేసుకోవచ్చు. అలాగే వింటర్లో శరీరానికి కావలసిన ఎనర్జీ లభించాలంటే నిమ్మ, ఆరెంజ్, గ్రేప్ ఫ్రూట్స్ తీసుకోవాల్సిందే. అయితే ఫ్రూట్ జ్యూస్ తీసుకునేటప్పుడు వేడి చేసిన నీటిని చల్లార్చి వాటితో తయారు చేసిన జ్యూస్లను తీసుకోవడం మంచిది. అలాగే రాత్రిపూట కాకుండా మధ్యాహ్నం పూట పండ్లను ఎక్కువగా తీసుకోవాల్సి ఉంటుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.
Monday, December 5, 2016
"లేత మునగ ఆకు" చేసే మేలేంటో తెలుసా?
మునక్కాడలు అందరికీ తెలుసు. కాడలు అడిగితే ఇవ్వడానికి బాధపడతారు. లేత చిగుళ్లు ఇచ్చేందుకు ఎవరు బాధపడరు. వీటితో అనేక వంటకాలు చేసుకోవచ్చు. తోటకూరలాగా, పప్పు పులుసు, పచ్చడి అన్నీ చేసుకోవచ్చు. చాలా కమ్మగా ఉంటాయి. వీటిని తరచూ తింటుంటే వాత వ్యాధులన్నిటిలోనూ ఔషధంలా పనిచేసి నొప్పులు, పోట్లు తగ్గిస్తాయి.
కడుపులో పైత్యం, మంట, గ్యాస్, వేడిని తగ్గిస్తుంది. కడుపులోని పాములను వెళ్లగొట్టేందుకు సహకరిస్తుంది. కఫ దోషాన్ని తగ్గిస్తుంది. కళ్లకు మేలు చేస్తాయి. అన్నిటికన్నా ముఖ్యం కొవ్వును కరిగించి, పొట్ట తగ్గించేందుకు స్థూలకాయం తగ్గేందుకు తోడ్పడతాయి. గుప్పెడు లేత మునగ చిగుళ్లను నీటిలో వేసి రసం పొడి కలిపి కమ్మని చారును కాసుకుని ప్రతి ఉదయం రాత్రి ఒక్కో గ్లాసు చొప్పున తాగండి లేదా అన్నంలో తినండి. చాలా కమ్మటి ఆహార పదార్థం మాత్రమే కాకుండా ఎన్నో రకాలుగా ఉపయోగపడుతుంది. కీళ్లనొప్పులు, పక్షవాతం, స్థూలకాయం ఉన్నవారికి ఇది మంచి ఔషధంగా పనిచేస్తుంది.
Friday, November 18, 2016
లైంగిక సామర్థ్యాన్నిపెంచే "ఉసిరికాయ"
ఉసిరి కాయ పెద్దదైనా, చిన్నదైనా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఉదరంలో రసాయనాలను సమతుల్యం చేస్తుంది. శరీర ఉష్ణాన్ని తగ్గిస్తుంది. ఉసిరి కాలేయ సామర్థ్యాన్ని మెరుగుపరుస్తుంది. జీర్ణ సంబంధ సమస్యలను తొలిగిస్తుంది. లైంగిక సామర్థ్యాన్ని పెంపొందించడంలో ఉసిరి కీలకంగా పనిచేస్తుంది. మెదడు పనితీరును మెరుగుపరిచి జ్ఞాపకశక్తిని పెంచుతుందని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు.
విటమిన్ ‘సి’ శరీరాన్ని ఎండ వేడిమి నుంచి కాపాడుతుంది. వ్యాధినిరోధక శక్తి పెరుగుతుంది. కేశ పోషణలో ఉసిరి ప్రాముఖ్యత చాలా ఉంది. చుండ్రు, కేశ సంబంధిత ఇతర సమస్యలకు ఉసిరి ఎంతగానో ఉపయోగపడుతుంది. హృద్రోగం, మధుమేహం రాకుండా నివారిస్తుంది. కాబట్టి రోజూ ఒక ఉసిరి తింటే ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూర్చిన వారవుతామని ఆయుర్వేద నిపుణులు చెప్తున్నారు.
విటమిన్ ‘సి’ శరీరాన్ని ఎండ వేడిమి నుంచి కాపాడుతుంది. వ్యాధినిరోధక శక్తి పెరుగుతుంది. కేశ పోషణలో ఉసిరి ప్రాముఖ్యత చాలా ఉంది. చుండ్రు, కేశ సంబంధిత ఇతర సమస్యలకు ఉసిరి ఎంతగానో ఉపయోగపడుతుంది. హృద్రోగం, మధుమేహం రాకుండా నివారిస్తుంది. కాబట్టి రోజూ ఒక ఉసిరి తింటే ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూర్చిన వారవుతామని ఆయుర్వేద నిపుణులు చెప్తున్నారు.
* ఉసిరికాయ జుట్టును ఆరోగ్యంగా ఉంచుతుంది.
* ఆరోగ్యకరమైన శ్వాసక్రియకు ఉసిరి ఎంతగానో సహాయపడుతుంది.
* ఉసిరిరసంలో నారింజ రసంలో కంటే 20 రెట్లు 'సి' విటమిన్ అధికంగా ఉంటుంది.
* ఉసిరికాయ కంటిచూపుని మెరుగుపరుస్తుంది.
Monday, November 14, 2016
"పాము"తో సహజీవనం!
9:00 AM
No comments
నమ్మకాలు.. విశ్వాసాలు మనుషులను ఎంతలా భ్రమింపజేస్తాయో చెప్పడానికి దీన్ని మించిన ఉదాహరణ లేదేమో! లేకపోతే.. మనిషి పామును పెళ్లి చేసుకోవడమేంటి? దానితో హనిమూన్ ప్లాన్ చేసుకోవడమేంటి? చనిపోయిన ప్రేయసి పాము రూపంలో జన్మించిందన్న విపరీతమైన విశ్వాసంతో ఏకంగా పామునే పెళ్లి చేసుకున్నాడు థాయ్ లాండ్ కు చెందిన వొర్రానన్ అనే వ్యక్తి. ప్రస్తుతం పదడుగుల కోబ్రాతో వొర్రానన్ కాపురం చేస్తున్నాడు. ఎక్కడికెళ్లినా.. కోబ్రాను వెంటబెట్టుకునే వెళ్తాడు. కోబ్రాను పక్కనుంచుకోవడం ఎప్పటికైనా ప్రమాదమే అని ఎవరైనా హెచ్చరిస్తే.. ఆ వ్యాఖ్యలను అతగాడు కొట్టిపారేస్తాడు. తన భార్యే పాము రూపంలో పునర్జమ్మ ఎత్తి తనకు దగ్గరైంది అని బలంగా విశ్వసిస్తున్నాడు. ఈమధ్యే పాముతో పాటు సింగపూర్ లో హనీమూన్ కు కూడా వెళ్లొచ్చాడట.
పాముతో సహజీవనం వొర్రానన్ కు ఎలా ఉన్నా.. అతన్ని పాముతో చూసినవాళ్లంతా భయంతో దూరం జరుగుతున్నారు. అయినా సరే.. ఐ డోన్ట్ కేర్ అంటున్నాడు వొర్రానన్. సినిమా అయినా.. షికారైనా.. అన్ని పాముతోనే అంటున్నాడు. చచ్చేదాకా పాముతోనే తన బంధం కొనసాగుతుందని తెగేసి చెబుతున్నాడు. ప్రేమలందు వొర్రానన్ ప్రేమ వేరయా! అని చెప్పుకోవాలేమో!
Saturday, November 12, 2016
ఒక్కొక్కరికి "మూడు లక్షలు" పంపిణీ చేసిన కర్నాటక ఎమ్మెల్యే !
9:00 AM
No comments
నల్లధన కుబేరులపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రయోగించిన అస్త్రానికి తొలి వికెట్ పడింది. కర్నాటక రాష్ట్రం, కోలార్కు చెందిన బంగారుపేట ఎమ్మెల్యే ఎస్ఎన్.నారాయణ స్వామి తన ఇంట్లో ఉన్న నల్లధనం కట్టలను బయటకు తీశారు. తన వద్ద ఉన్న నల్లధనాన్ని ప్రజలకు పంచి వారి దృష్టిలో ఆ విధంగా అయినా హీరోగా మారాడు.
తన నియోజకవర్గంలోని ఓ ప్రాంతంలో బహిరంగ సమావేశం ఏర్పాటు చేసి మరీ.. రూ.మూడు లక్షలు చొప్పున డబ్బును కట్టలుగా కట్టి.. ఒక్కొక్కరికి పంపిణీ చేశాడు. దీంతో స్థానికులు పండగ చేసుకుంటున్నారు. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఇంకా బయటికి రావాల్సిన వాళ్ళు చాలా మంది ఉన్నారని భావిస్తున్నారు. ఈ నోట్ల కట్టల పంపిణీలో పంచాయతీ సభ్యుడు మహేష్ బ్యాంకు ప్రెసిడెంట్ బి గోవింద గౌడ తదితరులు పాల్గొన్నారు. దీనికి సంబంధించిన ఫోటో ఒకటి వైరల్గా మారింది.
Wednesday, November 2, 2016
ఆ మొబైల్ నంబరును వాడిన ప్రతి ఒక్కరూ చనిపోతున్నారు!
9:00 AM
No comments
సినిమా సీన్ను తలిపించే సంఘటన ఒకటి బల్గేరియాలో జరిగింది. మొబిటెల్ అనే టలికాం సంస్థకు చెందిన ఓ ఫ్యాన్సీ నంబర్ను వినియోగించిన వారంతా చనిపోతున్నారట. దీంతో బల్గేరియా వాసులంతా ఆ నెంబరు గురించే ఆసక్తికరంగా చర్చించుకుంటున్నారట. ఇంతకీ ఆ నెంబర్ ఎంత అంటే.. 0888 888 888.
ఈ నెంబరును తొలిసారిగా మొబిటెల్ సంస్థ సీఈవో వ్లాదిమిర్ గ్రాస్నవ్ వాడారు. 2001లో ఆయన కేన్సర్తో ప్రాణాలు చనిపోయారు. అయితే ఆయన చనిపోయిన కారణం వేరే ఉందని, బిజినెస్లో కలహాలు, హానికారక రేడియో యాక్టివ్ పాయిజనింగ్ వల్లే ఆయన మృత్యువాత పడ్డారని అక్కడి మీడియాలో కథనాలు వచ్చాయి.
ఆ తర్వాత ఈ నంబరును కాన్స్టాంటిన్ డిమిట్రోవ్ అనే మాఫియా డాన్ వినియోగించాడు. ఆయన కూడా ఓ గుర్తు తెలియని వ్యక్తి చేతిలో హతమయ్యాడు. ఆ తర్వాత ఆ ఫ్యాన్సీ నెంబరు 2005లో దిష్లీవ్ అనే బిజినెస్ మేన్ చేతికి వెళ్లింది. అదే సంవత్సరంలో బల్గేరియా రాజధాని సోఫియాలో ఆయనను పలువురు హత్య చేశారు. ఆ తర్వాత సదరు కంపెనీ ఆ నంబరును బ్లాక్ చేసింది.
ప్రస్తుతం ఈ నంబర్కు కాల్ చేస్తే 'అవుట్ సైడ్ నెట్వర్క్ కవరేజ్' అని వినిపిస్తోంది. ఈ నెంబరు వాడితే ఎందుకు మరణిస్తున్నారని సదరు సంస్థను అడిగితే ఈ విషయంపై తాము ఎటువంటి కామెంట్లు చేయబోమని చెబుతోంది. వ్యక్తిగత నెంబర్ల గురించి తాము మాట్లాడబోమని సమాధానందాటవేస్తోంది.
Monday, October 31, 2016
"కంమ్స్"డోకి గుడ్బై చెప్పే రోజులు వస్తున్నాయా?
9:00 AM
No comments
త్వరలో కండోమ్స్కి గుడ్బై చెప్పే రోజులు వస్తున్నాయా? అవుననే అంటున్నారు పరిశోధకులు. సైడ్ ఎఫెక్ట్స్ కలిగించే గర్భనిరోధక మాత్రలను వేసుకోవాల్సిన పనే వుండదంటున్నారు. ఇందుకు సంబంధించి చాలావరకు సక్సెస్ అయ్యిందని.. కాకపోతే సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా నివారించేందుకు పరిశోధనలు జరుగుతున్నాయి. ఆ ఇంజెక్షన్స్ అందుబాటులోకి వస్తే.. గర్భం వస్తుందన్న భయం లేకుండా హాయిగా రొమాన్స్లో మునిగి తేలవచ్చునట! ఒక్క ఇంజెక్షన్తో అది సాధ్యమంటున్నారు వైద్య నిపుణులు.
పురుషులు ఎనిమిది వారాలకోసారి రెండు హార్మోన్ ఇంజక్షన్లు వేయించుకుంటే చాలట. ఈ ఇంజక్షన్లతో పురుషుల్లో స్పెర్మ్ కౌంట్ (శుక్రకణాల సంఖ్య)ను తగ్గిపోయేలా చేయవచ్చని ఢిల్లీలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ శాస్త్రవేత్త మన్మోహన్ మిస్రో టీమ్ వెల్లడించింది. ప్రపంచ ఆరోగ్య సంస్థకు చెందిన మారియో ఫిలిప్ అనే శాస్త్రవేత్తతో కలిసి మిస్రో టీం చేసిన పరిశోధనల్లో ఈ విషయం రుజువైంది. ట్రయిల్ రన్లో 18 ఏళ్ల నుంచి 45 ఏళ్ల మధ్య ఇంజక్షన్లు తీసుకున్న 270 మంది పురుషుల్లో సుమారు 96 శాతం సమర్థంగా పనిచేశాయని తేలింది. కేవలం నలుగురి భార్యలకు మాత్రమే గర్భం వచ్చిందని శాస్త్రవేత్తలు వెల్లడించారు.
ఐతే, ఈ ఇంజెక్షన్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ లేకపోలేదు. కండరాల నొప్పి, మొటిమలు వంటి దుష్ప్రభావాలు రావడంతో నివారించేందుకు తదుపరి పరిశోధనలు కొనసాగిస్తున్నారు. ఇది కూడా సక్సెస్ అయిపోతే.. కండోమ్స్ కంపెనీల ఆదాయం పడిపోయే ఛాన్స్ వుందని అంటున్నారు. ఇంజెక్షన్ ద్వారా కండోమ్ కంపెనీల కోట్ల ఆదాయానికి గండిపడే అవకాశముందని మార్కెట్ విశ్లేషకుల అంచనా!
Saturday, October 29, 2016
"రెండుసార్లు పుట్టిన పాప" ఎక్కడో తెలుసా ?
9:00 AM
No comments
ఇదేంటి పాప రెండుసార్లు పుట్టిందా? ఏ తల్లైనా బిడ్డకు ఒక్కసారేగా జన్మనిస్తుందనే డౌట్ కలిగింది కదా. అయితే చదవండి. అమెరికాలో తల్లి గర్భ సంచి నుంచి రెండుసార్లు జన్మించిన శిశువుకు సంబంధించిన వార్తలు, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. టెక్సాస్లోని చిల్ట్రన్స్ హాస్పిటల్లో ఈ అరుదైన ఘటన జరిగింది.
టెక్సాస్కు చెందిన ఓ గర్భిణి ప్రసవ వేదనతో ఈ ఆసుపత్రిలో చేరింది. కానీ గర్భస్థ శిశువుకు ట్యూమర్ పెరిగినట్లు వైద్యులు గుర్తించారు. దీంతో బిడ్డ కడుపులో ఉండగానే పిండాన్ని బయటకు తీసి ఆ ట్యూమర్ను తొలగించారు.
ట్యూమర్ వల్ల దాదాపు బిడ్డ గుండె ఆగినంత పనైంది. ఆ సమయంలో బిడ్డను బయటకు తీస్తే ప్రాణాలకే ప్రమాదమని మళ్లీ ఆ పిండాన్ని గర్భాశయంలోకి పంపించారు. 13 వారాల తర్వాత ఆమెకు చికిత్స చేసి బిడ్డను తల్లి కడుపులో నుంచి బయటకు తీశారు. ఈ అరుదైన చికిత్సకు సంబంధించిన వీడియోను యూట్యూబ్లో పోస్ట్ చేశారు.
వైద్యుల శస్త్ర చికిత్స విజయవంతం కావడంతో ఆ పాపకు సంబంధించిన వీడియో, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ప్రస్తుతం బిడ్డ ఆరోగ్యం మెరుగ్గా ఉందని వైద్యులు వెల్లడించారు. ఈ బిడ్డకు సోషల్ మీడియాలో ఆశీస్సులు వెల్లువెత్తుతున్నాయి.
Friday, October 28, 2016
యజమానా మజాకా ! "దీపావళి బోనస్" గా ఏమిచ్చాడో తెలుసా ?
9:00 AM
1 comment
సాధారణంగా పండుగలకి ఉద్యోగులకి బోనస్ లు ప్రకటిస్తుంటారు. అయితే ఇచ్చే జీతంతోపాటు ఏదో ఒక వెయ్యో.. రెండు వేలో బోనస్ గా ఇస్తుంటారు. కానీ ఇక్కడ ఓ యజమాని మాత్రం ఏకంగా... ఉద్యోగులకు 400 ఫ్లాట్లు.. 1200 కార్లు ఇచ్చాడు. వివరాల ప్రకారం... తన కోసం తన కొడుకును నెల రోజుల పాటు సామాన్యుడిలా కష్టపడి పనిచేసి రావాలని బయటకు పంపేసిన సూరత్ కోటీశ్వరుడు గుర్తున్నాడు కదూ. అతనే మన దేశంలో పేరుమోసిన వజ్రాల వ్యాపారి సావ్ జీ ఢోలాకియా. హరేకృష్ణ ఎక్స్పోర్ట్స్ అనే పేరుతో వజ్రాల వ్యాపారం చేస్తున్న ఢోలకియా.. ఈ ఏడాది తన వ్యాపార స్వర్ణోత్సవం సందర్భంగా దీపావళి బోనస్ల కోసం రూ. 51 కోట్లు వెచ్చించారు. తన దగ్గర పనిచేసే ఉద్యోగులకు దీపావళి బహుమతిగా 400 ఫ్లాట్లు, 1200 కార్లు ఇచ్చాడు. కాగా 2011 నుంచి ప్రతి ఏడాది ఈ రకంగా బోనస్ లు ఇవ్వడం ప్రారంభించారు ఆయన.
Thursday, October 27, 2016
మందుబాబులకు దివ్యౌషధం "బీరకాయ"
బీరకాయలో ఉన్న మేలెంతో తెలుసుకుంటే.. అస్సలు దాన్ని వదిలిపెట్టరు. సాధారణ, నేతి బీరకాయ- రెండు రకాల కాయల్లోనూ పీచు, విటమిన్-సి, జింక్, ఐరన్, రిబోఫ్లేవిన్, మెగ్నీషియం, థైమీన్... వంటి పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. బీరకాయలోని పెప్టైడ్స్, ఆల్కలాయిడ్స్ రక్తంలోని, యూరిన్లోని చక్కెర నిల్వల శాతాన్ని చాలామటుకు తగ్గించేందుకు తోడ్పడతాయి.
బీరకాయ రక్తశుద్ధికీ కాలేయ ఆరోగ్యానికీ కూడా తోడ్పడుతుంది. ఆల్కహాల్ వల్ల దెబ్బతిన్న కాలేయాన్నీ రక్షిస్తుంది. మందుబాబుల తీసుకునే ఆహారంలో బీరకాయ చేర్చితే వారి కాలేయానికి ఎలాంటి ఢోకా ఉండదు. కామెర్లు వచ్చినవాళ్లు బీరకాయ రసం తాగడంవల్ల మంచి ఫలితం ఉంటుందనీ దీనివల్ల ఎలాంటి ఇన్ఫెక్షన్లూ రావనీ రోగనిరోధకశక్తిని పెంపొందిస్తుందనీ తేలింది.
అల్సర్లూ మంటలతో బాధపడేవాళ్లకి బీరకాయ దివ్యౌషధంగా పనిచేస్తుంది. బీరకాయలోని విటమిన్-ఎ కంటికండరాల బలహీనత కారణంగా తలెత్తే అంధత్వాన్ని నివారిస్తుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఇందులోని విటమిన్ బి5 చెడు కొలెస్ట్రాల్ను తగ్గిస్తుందట. అంతేగాకుండా బీరకాయల్లోని విటమిన్ బి6 అనీమియాను నివారించగలదని కూడా ఆరోగ్య నిపుణులు అంటున్నారు.
Friday, October 21, 2016
అమ్మవారి దర్శనం కోసం వచ్చే ఎలుగుబంట్లు !
9:00 AM
No comments
చత్తీస్గడ్లోని అమ్మవారి దేవాలయంలో జరిగే వింత ఇది. ఇక్కడికి నిత్యం భక్తులు వచ్చి అమ్మవారికి పూజలు చేస్తారు. ఇందులో విశేషం ఏముంది... కానీ, ప్రతి రోజు ఉదయాన్నే ఎలుగుబంట్లు అమ్మవారి దర్శనం కోసం వచ్చి నిలబడతాయి. మనుషుల మాదిరిగానే చేతులు జోడించి దణ్ణం పెట్టుకుంటాయి.
హారతి ఇచ్చి, ప్రసాదం పెట్టిన తరువాత అక్కడ నుంచి వెళ్ళిపోతాయి. మిగతా భక్తులెవరికీ అవి హాని తలపెట్టవు, అప్పుడప్పుడు వాటి పిల్లలను కూడా గుడికి తీసుకొని వస్తాయి. ఆలయంలో పూజారులకు ఇది ఒక ఆనవాయితీగా మారిపోయింది. దీనితో వారు కూడా ఎప్పుడు బల్లూక భక్తులు వస్తాయోనని ఎదురుచూసి, ప్రసాదాలిచ్చి పంపుతుంటారు.
Thursday, October 20, 2016
"ఆవు నెయ్యి"తో బోల్డన్ని ఉపయోగాలు !
9:00 AM
No comments
హిందువులకు ఎంతో పవిత్రమైనది గోమాత. ఆవులో అనేకమంది దేవతలు కొలువున్నారని గోమాతను పూజిస్తారు. ఆవు పాలు, పెరుగు, నెయ్యి, మూత్రం, మలములో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. ఆవు నెయ్యిని క్రమం తప్పకుండా ఆహారంలో తీసుకోవడం ద్వారా ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. ఇది జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది. పడుకోబోయే ముందు వేడి పాలలో ఓ చెంచాడు ఆవు నెయ్యి వేసుకుని తాగితే జీర్ణవ్యవస్థ మెరుగుపడుతుంది. ఉదయానికి విరోచనం సాఫీగా అవుతుంది.
రోజుకు ఓ స్పూన్ ఆవు నెయ్యి భోజనంలో తీసుకుంటే చిన్న పిల్లల మెదడు ఎదుగుదలకు బాగా ఉపయోగపడుతుంది. ఆవు నెయ్యి కేన్సర్ వ్యాధిగ్రస్తులకు బాగా ఉపయోగ పడుతుంది. కేన్సర్ కణాలను పెరగకుండా చేస్తుంది. సంగీత సాధకులకు గాత్రం మెరుగుపడుతుంది. రోజూ ఆవు నెయ్యి తీసుకుంటే సంభోగ శక్తి, వీర్య కణాల వృద్ధి కలుగుతుంది. ఆకలి కలిగిస్తుంది. చర్మం కాంతివంతంగా ఉంటుంది, కంటిచూపు ను కాపాడుతుంది.
థైరాయిడ్ సమస్యలు ఉన్నవారు ఆవు నెయ్యి తీసుకుంటుంటే సమస్య త్వరగా తగ్గుతుంది. ఆవు నెయ్యి తక్కువ తీసుకుంటే అనవసర కొవ్వు కరుగుతుంది. అదే రోజుకు రెండు చెంచాల కంటే ఎక్కువ తీసుకుంటే లావు అవుతారు. గుండె జబ్బులకు మంచి ఔషధం. మలలు, ఫిస్టులాలు ఉన్నపుడు వాటి పైన ఆవు నెయ్యి రాస్తే నెప్పుల నుంచి మంట నుంచి ఉపశమనం కలుగుతుంది. స్త్రీ స్థనాలు చిన్నవిగా ఉంటే అవి పెరుగుదలకు ఆవు పాలు, నెయ్యి తీసుకుంటే వక్షోజాలు పెరుగుతాయి. చెవి పోటు వస్తే ముక్కులో ఓ రెండు చుక్కలు ఆవు నెయ్యి వేస్తే చెవి పోటు తగ్గుతుంది. ముక్కులో కి వెళ్ళిన ఆవు నెయ్యి కర్ణభేరికి వెళ్ళే నాడులపై పని చేస్తుంది. ఆవు నెయ్యిని పరిమితం గానే తీసుకోవాలి లేకుంటే లావు పెరిగే అవకాశం ఉన్నది.
Tuesday, October 18, 2016
Saturday, October 15, 2016
"బరువు తగ్గాలను"కునే వారికీ సులువైన చిట్కా !
బరువు తగ్గాలనుకునుకుంటున్నారా? వ్యాయామాలు చేసేస్తున్నారా? ఇకపై ఇవన్నీ చేయాల్సిన అవసరం లేదు. కేవలం రెండు గ్లాసుల నీరు చాలు. ఇదేంటి అనుకుంటున్నారా? ఈ స్టోరీ చదవండి. భోజనానికి ముందు రెండు గ్లాసుల నీరు తాగితే సులభంగా బరువు తగ్గుతారని లండన్ పరిశోధకులు తేల్చారు. భోజనానికి ముందే నీరు తాగడం వల్ల కడుపు నిండిన అనుభూతి పొందుతారని దీంతో ఆహారం తక్కువగా తింటారని తద్వారా బరువు తగ్గుతారని తేలింది.
ప్రాథమిక ఆధారాలతో బర్మింగ్హామ్ వర్శిటీకి చెందిన పరిశోధకులు ఈ విషయాన్ని వెల్లడించారు. ఇలా భోజనానికి ముందు నీరు తాగేవారు 3 నెలల్లోనే 4కిలోల బరువు తగ్గారని అధ్యయనం తేల్చినట్లు లండన్కి చెందిన ‘ఒబెసిటి’ జర్నల్ ప్రచురించింది. దీని ద్వారా ఎలాంటి వ్యయ ప్రయాసలు లేకుండా సులభంగా బరువు తగ్గవచ్చని పరిశోధకులు అంటున్నారు.
కాగా, ప్రస్తుతం 5–17 ఏళ్ల వయస్సున్న 268 మిలియన్ల పిల్లలు 2025 వరకు అధిక బరువుతో బాధపడే అవకాశం ఉందని వరల్డ్ ఒబెసిటి ఫెడరేషన్ హెచ్చరించింది. వీరిలో 98 మిలియన్ల మంది స్థూలకాయం బారిన పడే అవకాశముందని తెలిపింది. వ్యాయామాలు చేసేస్తున్నారా? ఇకపై ఇవన్నీ చేయాల్సిన అవసరం లేదు. కేవలం రెండు గ్లాసుల నీరు చాలు. ఇదేంటి అనుకుంటున్నారా? ఈ స్టోరీ చదవండి. భోజనానికి ముందు రెండు గ్లాసుల నీరు తాగితే సులభంగా బరువు తగ్గుతారని లండన్ పరిశోధకులు తేల్చారు. భోజనానికి ముందే నీరు తాగడం వల్ల కడుపు నిండిన అనుభూతి పొందుతారని దీంతో ఆహారం తక్కువగా తింటారని తద్వారా బరువు తగ్గుతారని తేలింది.
ప్రాథమిక ఆధారాలతో బర్మింగ్హామ్ వర్శిటీకి చెందిన పరిశోధకులు ఈ విషయాన్ని వెల్లడించారు. ఇలా భోజనానికి ముందు నీరు తాగేవారు 3 నెలల్లోనే 4కిలోల బరువు తగ్గారని అధ్యయనం తేల్చినట్లు లండన్కి చెందిన ‘ఒబెసిటి’ జర్నల్ ప్రచురించింది. దీని ద్వారా ఎలాంటి వ్యయ ప్రయాసలు లేకుండా సులభంగా బరువు తగ్గవచ్చని పరిశోధకులు అంటున్నారు.
కాగా, ప్రస్తుతం 5–17 ఏళ్ల వయస్సున్న 268 మిలియన్ల పిల్లలు 2025 వరకు అధిక బరువుతో బాధపడే అవకాశం ఉందని వరల్డ్ ఒబెసిటి ఫెడరేషన్ హెచ్చరించింది. వీరిలో 98 మిలియన్ల మంది స్థూలకాయం బారిన పడే అవకాశముందని తెలిపింది.
Friday, October 14, 2016
మీ "3G ఫోన్" ని "4G ఫోన్" గా ఇలా మార్చుకోండి !
ఇప్పుడు ఎక్కడ చూసినా 4జి అనే మాట వినిపిస్తోంది. జియో సిమ్ వేసుకోవాలంటే, మీ సెల్ ఫోన్ 4Gయేనా అని అడుగుతున్నారు. కాదు 3జి అంటే, అయితే సపోర్ట్ చేయదంటున్నారు... అయినా మీరు బెంగపెట్టుకోవాల్సిన పనిలేదు. మీ ఫోన్ 4జిగా ఇలా మార్చేసుకోవచ్చు.
మొన్నటిదాకా 3G ఫోన్కి, 4G ఫోన్కి మధ్య పెద్దగా వ్యత్యాస్యం చూడలేదు జనాలు. కాని జియో రాకతో పరిస్థితి పూర్తిగా మారిపోయింది. జియో కేవలం 4G నెట్వర్క్కి సంబంధించిన సేవలు అందిస్తోంది. దీనికి కారణం జియో పూర్తిగా LTE నెట్వర్క్ పైన ఆధారపడటం. అలాగే VoLTE ఉన్న ఫోన్కి మాత్రమే ఎలాంటి ఆప్స్ సహాయం లేకుండా జియో కాల్స్ సౌకర్యం లభిస్తోంది. కాల్స్ పక్కనపెడితే, ఇప్పుడు అందరికి అవసరమైనది 4G ఇంటర్నెట్ సర్వీసులు. వీటిని 3G ఫోన్స్ ఉన్నవారు పొందలేకపోతున్నారు. మరి ఎలా? మీ 3G ఫోన్ని 4Gకి మార్చుకోవచ్చిలా.
అన్ని ఫోన్లకి ఇది సాధ్యపడదు కాని, మేం చెప్పే ఓ ట్రిక్ అయితే ప్రయత్నించి చూడండి. పని చేస్తే మీ లక్. మీ 3G మొబైల్లో *#*#4636#*#* డయల్ చేయండి. ఆ తరువాత మీ ఫోన్లో Phone Information, Battery Information, Usage Satistics, Wi-Fi information అనే ఆప్షన్లు కనిపిస్తే సగం పని అయిపోయినట్టే. ఆ తరువాత Phone Informationలోకి వెళ్ళి "set preferred network type"ని సెలెక్ట్ చేయండి. దాంట్లో కొన్ని ఆప్షన్స్ వస్తాయి. వాటిలోంచి LTE/GSM/CDMA auto (PRL)ని సెలెక్ట్ చేసుకోని అప్డేట్ చేయండి. ఓసారి ఫోన్ రిబూట్ లేదా స్విచ్ ఆఫ్ చేసి ఆన్ చేయండి. ఇప్పుడు ఏదైనా 4G సిమ్ వేసి ఇంటర్నెట్ కనెక్ట్ అవుతోందో లేదో పరీక్షించండి. అన్నీ అనుకున్నట్టుగానే జరిగితే, మీరు జియో 4Gని మీ 3G ఫోన్లో వాడుకోవచ్చు.
Thursday, October 13, 2016
"KCR" అంటే ఏమిటో తెలుసా ?
9:00 AM
No comments
సిద్ధిపేట జిల్లా ప్రారంభోత్సవం సందర్భంగా తెలంగాణ నీటి పారుదల శాఖ మంత్రి హరీష్రావు కాస్తంత ఉద్విగ్నతకు లోనయ్యారు. సీఎం కేసీఆర్పై ప్రశంసల వర్షం కురిపించారు. మంగళవారం సిద్ధిపేట జిల్లా ప్రారంభోత్సవం అనంతరం ఆయన కేసీఆర్ గురించి మాట్లాడారు.
కేసీఆర్ అంటే కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు కాదని KCR అంటే ఏమిటో నిర్వచించారు.
K అంటే KNOWLEDGE(జ్ఞానము),
C అంటే COMMITMENT(నిబద్ధత),
R అంటే RECONSTRUCTION(తెలంగాణ పునర్నిర్మాణం) అని తెలిపారు.
ఈ మూడింటిని నిజం చేసిన కేసీఆర్కు శిరసు వంచి పాదాభివందనం చేశారు.
Wednesday, October 12, 2016
నిన్నటి "భిక్షగాడు" నేడు "కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ"లో సీట్ సంపాదించాడు !
9:00 AM
No comments
జయవేల్ సొంత ఊరు ఆంద్రప్రదేశ్ లోని నెల్లూరు జిల్లా. ఇతను పుట్టే నాటికి వారికి కొంత పంట పొలాలు ఉండేవి కానీ 1980 లో వచ్చిన వరదలకు పంటలు కొట్టుకుపోవడంతో వారి కుటుంబంపై ఒక పెను ప్రభావాన్ని చూపించింది. పూట గడవడమే చాలా కష్టంగా మారుతున్నా రోజులు, ఇక ఇక్కడ ఉంటే బ్రతకడమే కష్టం అవుతుందని వారి కుటుంబం చెన్నైకి వలసపోయింది. అక్కడికి వెళ్లిన కొన్ని రోజులకి జయవేల్ నాన్న చనిపోయారు. ఎలాంటి పరిస్థితిలలో చెన్నైకి వచ్చారో మళ్లీ అలాంటి పరిస్థితే ఎదురైంది జయవెల్ అమ్మకి, తనకి. వాళ్ళ నాన్న చనిపోయిన తరవాత తినడానికి తిండి, కట్టుకోవడానికి బట్టలు లేని సమయంలో తన తల్లికి ఏ పని చేయాలో తెలియక భిక్షాటన చేయడం ప్రారంబించింది.
జయవేల్ తల్లి యాచక వృత్తి ప్రారంబించింది కానీ ఉండేందుకు వారికి ఎలాంటి వసతి లేదు, చివరికి ఫుట్ పాత్ వారికి రక్షణ అయింది. ఫుట్ పాత్ లపై పడుకుంటే అప్పుడప్పుడు పోలీసులు వచ్చి తరిమేవారు అక్కడి నుండి వెళ్లి మరో ఫుట్ పాత్ చూసుకోవలసిందే !అదే వీరి జీవితం.
కొన్ని రోజుల తరవాత జయవేల్ అమ్మ ఆరోగ్యం కూడా చెడిపోయింది. దానితో చిన్న తనంలోనే భిక్షాటన చేయడం ప్రారంబించాడు జయవేల్. అలా భిక్షాటన చేయగా వచ్చిన డబ్బుతో తన అమ్మ కడుపును నింపుతూ తన కడుపు నింపుకున్నాడు.
కొన్ని రోజుల తరవాత జయవేల్ అమ్మ ఆరోగ్యం కూడా చెడిపోయింది. దానితో చిన్న తనంలోనే భిక్షాటన చేయడం ప్రారంబించాడు జయవేల్. అలా భిక్షాటన చేయగా వచ్చిన డబ్బుతో తన అమ్మ కడుపును నింపుతూ తన కడుపు నింపుకున్నాడు.
సూయం ట్రస్ట్ కు చెందిన ఉమా ముత్తురామన్ అనే మహిళ తన భర్తతో కలసి చెన్నై వీధుల్లో చిన్నారుల జీవితాలపై ఓ ప్రాజెక్టు నిమిత్తమై జయవేల్ను కలిసింది. జయవేల్ లో తెలివితేటలూ ఉమా ముత్తురామన్ గారిని ఆశ్చర్యపరిచింది. ఈ ప్రపంచం మొత్తం బిక్షాటన చేసే వారిని నిందించటమే కానీ వారు బిక్షాటన చేసేది జానెడు పొట్ట నింపుకునేందు అని ఎందుకు అనుకోరు .. అంటూ…. ఆకలి ఈ ప్రపంచంలో కొందరిని మంచివారిగా చేస్తుంది, కొందరిని చెడ్డవారిగా చేస్తుంది అందుకే జయవేల్ ని చదివించి తనకి మంచి భవిషత్ ని ఇవ్వాలని నిర్ణయించుకొని అదే విషయాన్ని జయవేల్ తల్లికి చెప్పింది. కానీ జయవేల్ తల్లి మాత్రం తమలాంటి వారు పేరు చెప్పుకొని ప్రభుత్వ పెద్దల దగ్గర డబ్బులు వసూళ్లు చేసుకుంటారని నమ్మలేదు. ఎందుకంటే అంతకు ముందే చాలా మంది వచ్చిఫొటోస్ తీసుకోని మీకు అది చేస్తాం ఇది చేస్తాం అంటూ మళ్లీ కనబడలేదు. అదే విషయాన్నీ ఉమా ముత్తురామన్ కి కూడా చెప్పింది జయవేల్ తల్లి. దానితో ఆ తల్లి భాదను అర్ధం చేసుకున్న ఉమా ముత్తురామన్ 1999 లో జయవేల్ ను ఒక స్కూల్లో చేర్పించింది.
వచ్చిన అవకాశాన్ని అదృష్టంగా భావించి చదువును ఇష్టంతో చదవడం ప్రారంబించాడు జయవేల్. దానితో ఇంటర్మీడియట్ లో చాలా మంచి మార్కులు సాధించాడు. ఆపై ప్రతిష్టాత్మకమైన కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో సీట్ సంపాదించాడు. ఇప్పటికే రేసింగ్ కార్ల వృద్ధికి సంబంధించిన కోర్స్ ను పూర్తీ చేసి పై చదువుల కోసం ఇటలీకి ప్రయాణం అవుతున్నాడు. జయవేల్ ని చదివించేందుకు కొంత కష్టం అవుతున్నప్పటికీ తన చదువుకి మాత్రం ఎలాంటి అడ్డంకి లేకుండా చూస్తున్నాం అంటున్నారు ఉమా ముత్తురామన్ దంపతులు. ఎక్కడో ఒక మారుమూల ప్రాంతంలో పుట్టి చెన్నై నగర వీధుల్లో బిక్షాటన చేసి, ఒకరి ఆసరాతో చదువులు చదివి…… ఎలాంటి సదుపాయాలు లేకున్నా పరిశోధనల వైపు వెళ్తున్న జయవేల్ మరెందరికో స్ఫూర్తి.
Saturday, October 8, 2016
సర్జరీ లేకుండానే బ్రెస్ట్ సైజును పెంచే 'బ్రా'
9:00 AM
1 comment
సాధారణంగా మహిళలు తమ ఛాతి పరిమాణ విషయంలో ఎంతో ఒత్తిడికి గురవుతుంటారు. వక్షోజాలు తగినంత పరిమాణంలో లేకపోతే చాలా బాధపడుతుంటారు. మరికొంత మంది శస్త్రచికిత్స చేయించుకుని పాలిండ్ల సైజుల్ని పెద్దవిగా చేయించుకుంటారు. అయితే ఇకపై ఆ అవసరం లేదు. ఎందుకంటే సర్జరీ లేకుండానే బ్రెస్ట్ సైజును పెంచే "మిరాకిల్ వైబ్రేటింగ్ బ్రా"ను సెర్బియాకు చెందిన ఓ ఇంజనీర్ కనిపెట్టాడు. దీన్ని కేవలం రోజుకో గంట ధరిస్తే చాలు వారంలో ఫలితం కనిపిస్తుందట.
సెర్బియాకు చెందిన మిలాన్ మిలిక్ అనే ఇంజనీరు గర్ల్ ఫ్రెండ్ తన బ్రెస్ట్ విషయంలో ఎప్పుడూ అసంతృప్తికి గురవుతూ ఉండేది. దీంతో ఆమె సమస్యను తీర్చాలనుకున్న మిలాన్ ఈ మిరాకిల్ వైబ్రేటింగ్ బ్రాను కనిపెట్టాడు. ఇది సెర్బియాలో సూపర్ సక్సెస్ అవడంతో పేటెంట్ కూడా తీసుకున్నాడు. ప్రస్తుతం ఈ 'బ్రా'ను అమెరికాలో క్లినికల్ ట్రయల్లో భాగంగా పరీక్షిస్తున్నారు.
ఇప్పటికే ఇద్దరు అమెరికన్ యువతులు ఓ కాస్మొటిక్ సర్జన్ పర్యవేక్షణలో ఈ బ్రాను వాడి చూశారు. అది అద్భుత ఫలితాలను ఇచ్చింది. అయితే ఈ సైజు శాశ్వతంగా ఉంటుందా, దీని వల్ల ఇతర ప్రభావాలు తలెత్తే అవకాశముందా అనే అంశంపైలు పరిశోధనలు చేస్తున్నారు. ఒకవేళ ఇది కాని విజయవంతమైతే ఇకపై బ్రెస్ట్ సర్జరీలకు కాలం చెల్లిపోయినట్లే.
Friday, October 7, 2016
మగవారిలో ఈ లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం చేయకండి ?
ప్రొస్టేట్ క్యాన్సర్..!! ఇదో సైలెంట్ కిల్లర్ అని చెప్పవచ్చు. ఎందుకంటే.. ఈ క్యాన్సర్ మగవాళ్లలో మాత్రమే వస్తుంది. ప్రొస్టేట్ క్యాన్సర్ మగవాళ్ల ప్రొస్టేట్ గ్లాండ్స్ పై దుష్ర్పభావం చూపుతుంది. ఈ ప్రొస్టేట్ క్యాన్సర్ ఎక్కువగా 65ఏళ్లలో ఉండే.. మగవాళ్లలో వస్తుంది. కానీ లైఫ్ స్టైల్లో మార్పులు, అలవాట్లు, ఒత్తిడి వంటి కారణాల వల్ల.. యంగ్ ఏజ్ లోనే.. చాలామంది యువకులు.. ప్రొస్టేట్ క్యాన్సర్ బారిన పడుతున్నారు. ఈ ప్రొస్టేట్ క్యాన్సర్ లక్షణాలను మొదట్లోనే గుర్తిస్తే.. త్వరగా నయం చేయవచ్చు. ప్రాణాలను కాపాడుకోవచ్చు. ఇప్పుడు చెప్పబోయే లక్షణాల్లో ఏ ఒక్కటి కనిపించినా.. వెంటనే.. డాక్టర్ ని సంప్రదించాలి. ఏమాత్రం నిర్లక్ష్యం చేయకూడదు. మరి మగవాళ్లు నిర్లక్ష్యం చేయకూడని, ప్రొస్టేట్ క్యాన్సర్ లక్షణాలేంటో చూద్దామా..
యూరిన్ కి వెళ్లినప్పుడు, స్ఖలనం అయినప్పుడు.. చాలా మంటగా అనిపించిందంటే.. మగవాళ్లు ఏమాత్రం నిర్లక్ష్యం చేయకూడదు. ఇది ప్రొస్టేట్ క్యాన్సర్ సంకేతం అయి ఉండవచ్చు. కాబట్టి వెంటనే డాక్టర్ ని సంప్రదించాలి.
మగవాళ్లలో చాలా తరచుగా.. యూరిన్ కి వెళ్తున్న లక్షణం కనిపించిందంటే.. ఎట్టిపరిస్థితుల్లో నిర్లక్ష్యం చేయకండి.
కీళ్ల నొప్పులతో పాటు, తొడలు పట్టేసినట్టు అనిపించడం, ప్రక్కటెముకల్లో నొప్పి, పొత్తి కడుపు, వెన్నెముక కింది వైపు నొప్పి ఉంటే.. ఏమాత్రం నిర్లక్ష్యం చేయకూడదు.
మగవాళ్లకు యూరిన్ లో లేదా, వీర్యంలో బ్లడ్ కనిపించిందంటే.. ఎట్టిపరిస్థితుల్లో నిర్లక్ష్యం చేయకూడదు. ఇది డేజంరస్ సంకేతమని గ్రహించండి.
ధీర్ఘకాలికంగా బ్యాక్ పెయిన్ తో బాధపడుతున్నారంటే.. దానికి చాలా సంకేతాలు ఉంటాయి. కానీ.. అది ప్రొస్టేట్ క్యాన్సర్ కి కూడా లక్షణం అయి ఉండవచ్చు. కాబట్టి ఒకసారి డాక్టర్ ని సంప్రదించడం మంచిది.
యూరిన్ చేసేటప్పుడు నిలబడటం ఏమాత్రం సాధ్యం కావడం లేదు అంటే.. అది.. ప్రొస్టేట్ క్యాన్సర్ కి లక్షణం అయి ఉండవచ్చు. కాబట్టి మగవాళ్లు ఈ లక్షణాన్ని నిర్లక్ష్యం చేయకూడదు.
మూత్ర ప్రవాహాన్ని ఆపలేకపోవడం లేదా.. మొదలుపెట్టడానికి చాలా కష్టంగా మారింది అంటే.. ఈ లక్షణాన్ని నిర్లక్ష్యం చేయకూడదు. ప్రొస్టేట్ క్యాన్సర్ కి లక్షణం అయి ఉండే అవకాశం ఉంది.
Thursday, October 6, 2016
"మగాళ్ళే కాదు, మగ అనే మాట"కూడా లేని సినిమా !
మొదటినుంచీ మలయాళీ చిత్ర పరిశ్రమ ఒక ప్రత్యేకమే. ప్రయోగాలకూ, ఆర్ట్ సినిమాలకూ కేరళ ఫిలిం మేకర్లు ఎంత ప్రసిద్దో. బీ గ్రేడ్ సినిమాలకూ అంతే. ఇప్పుడా సినిమాల సంగతి వదిలేస్తే. కొత్త కొత్త ఐడియాలతో ప్రయోగాలు చేయటానికి బెంగాలీ ఇండస్ట్రీ తర్వాత దక్షిణాదిలో మల్లూవుడ్ దే పైచేయి. బడ్జెట్ మరీ ఎక్కువ ఉండదు, హీరోలకు మరీ కోట్లకొద్దీ డబ్బులు దారపోయరు. తక్కువ బడ్జెట్ లో నష్టాలు పెద్దగా ఉందవు కాబట్టి ప్రయోగాలకు మనలా ఎక్కువ వెనుకాడరు. మళయాళ దర్శకులు, నటులు కూదా నటన అంటే ఎంతో ఇష్టం ఉన్నట్టు కనిపిస్తారు. అందుకే మల్లూవుడ్ లో ఎప్పుడు చూసినా పలువురు దర్శకులు రకరకాల ప్రయోగాలతో సినిమాలు రూపొందిస్తుంటారు.
అదే కోవలో ఇప్పుడు మలయాళంలో ఓ సరికొత్త తరహా కథాచిత్రం వస్తోంది. 'తిరైక్కు వరదా కథై' అనే టైటిల్ తో రూపొందుతున్న ఈ చిత్రంలో కేవలం మహిళా పాత్రలే వుంటాయట. అసలు మగపురుగన్నదే కనిపించకుండా సినిమా ప్లాన్ చేసారట . సరే కనిపించకపోతే పోయే, మాటల్లో కూడా ఎక్కడా అసలు మగవాసన తగలకుండా జాగ్రత్త పడ్డారట. మేల్ అన్న ఊసే లేని మేలుజాతి సినిమా తీసేద్దామనుకున్నారో ఏమో గానీ దెయ్యం చుట్టూ తిరిగే కథతో ఇది సస్పెన్స్ థ్రిల్లర్ గా రూపొందనుంది.
అదే కోవలో ఇప్పుడు మలయాళంలో ఓ సరికొత్త తరహా కథాచిత్రం వస్తోంది. 'తిరైక్కు వరదా కథై' అనే టైటిల్ తో రూపొందుతున్న ఈ చిత్రంలో కేవలం మహిళా పాత్రలే వుంటాయట. అసలు మగపురుగన్నదే కనిపించకుండా సినిమా ప్లాన్ చేసారట . సరే కనిపించకపోతే పోయే, మాటల్లో కూడా ఎక్కడా అసలు మగవాసన తగలకుండా జాగ్రత్త పడ్డారట. మేల్ అన్న ఊసే లేని మేలుజాతి సినిమా తీసేద్దామనుకున్నారో ఏమో గానీ దెయ్యం చుట్టూ తిరిగే కథతో ఇది సస్పెన్స్ థ్రిల్లర్ గా రూపొందనుంది.
ఇందులో ఒకప్పటి గ్లామర్ హీరోయిన్ ఇప్పటికీ గ్లామర్ ని మాత్రం అలాగే ఉంచుకున్న ఆర్టిస్ట్ నదియా ముఖ్య పాత్రలో కనిపించనుంది. ఈ చిత్ర దర్శకుడు తులసీదాస్ ఈ సందర్భంగా చెబుతూ, "అసలు ఇందులో పురుష పాత్రలనేవే అస్సలు కనిపించవు. కథ బ్యాక్ గ్రౌండులో కూడా అసలెక్కడా మగపాత్రల ప్రస్తావన కూడా రాదు. నదియా, ఇనేయా ఇద్దరూ కీలక పాత్రలు పోషిస్తున్నారు' అని చెప్పారు. మలయాళంతో పాటు తమిళ వెర్షన్ ను కూడా ఏకకాలంలో నిర్మిస్తారట. తెలుగు డబ్బింగ్ ఎలానూ ఉంటుంది కాబట్టి మనమూ ఈ ఫిమేల్ సినిమా చూసే చాన్సుంది.
Wednesday, October 5, 2016
ఇకపై రైల్వే టిక్కెట్ రద్దు చేసుకోవడం ఎంతో సులువు !
9:00 AM
No comments
కొన్ని సందర్భాల్లో రైలు ప్రయాణం రద్దు చేసుకోవల్సి రావడమో లేదా టిక్కెట్ పై ప్రయాణించకపోవడమో జరుగుతోంది. ఆ సమయంలో టిక్కెట్ రద్దు చేసుకోవటం వీలుపడక చాలా మంది ఆ టిక్కెట్లను అలాగే వదిలేస్తుంటారు. దీని వల్ల వినియోగదారులు టిక్కెట్ రుసుము పూర్తిగా నష్టపోవాల్సి వస్తోంది. దీన్ని నివారించేందుకు ఇండియన్ రైల్వేస్ ఓ వినూత్న అవకాశాన్ని కల్పిస్తోంది. ఒక్క ఫోన్ కాల్ తో రైల్వే టిక్కెట్ రద్దు చేసుకునేలా కొత్త సాఫ్ట్ వేర్ ను అభివృద్ది చేసింది.
ఈ వెసులుబాటు వచ్చే నెల నుంచే అమల్లోకి వచ్చే అవకాశం ఉందని రైల్వే శాఖ అధికారులు చెబుతున్నారు. దీని ప్రకారం వినియోగదారులు మొబైల్ ఫోన్ నుంచి 139 నెంబర్ కు ఫోన్ చేసి టిక్కెట్లు రద్దు చేసుకోవచ్చు. ఈ నెంబర్ కు ఫోన్ చేసి వివరాలు చెప్తే టిక్కెట్ రద్దు అవుతుంది. వెంటనే ఫోన్ కు ఓ పాస్ వర్డ్ వస్తుంది. దీని ద్వారా టిక్కెట్ డబ్బులు వాపస్ పొందవచ్చు.
Tuesday, October 4, 2016
"తలతిరగడం" తగ్గించే సులువైన మార్గాలు !
శరీరం లేదా మనస్సు బ్యాలెన్స్ (సమతౌల్యంను) కోల్పోయినప్పుడు ఇలా జరగడం సహజం అయితే ఇది వ్యాధి మాత్రం కాదు. ఇది లోబ్లడ్ ప్రెజర్, డీహైడ్రేషన్,మైగ్రేన్ తలనొప్పి, ఆందోళన వంటి డిజార్డర్స్ వల్ల కలిగే లక్షణాలు, అలాగే తలకుగాయాలు తగిలినప్పుడు కూడా ఇలాంటివిజరుగుతుంటాయి. తలతిరుగుడుకు కొన్ని బేసిక్ ప్రికాషన్స్ ఉన్నాయి. ఇవి తల తిరగడం నివారించడంలో గ్రేట్ గా సహాయపడుతాయి.
తలతిరుగుడు నివారించడానికి కొన్ని నేచురల్ హోం రెమెడీస్ అందుబాటులో ఉన్నాయి. వీటి వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఇవి శరీరానికి ఎలాంటి హాని కలిగించవు, కాబట్టి తలతిరుగుడు తగ్గడానికి ఈ క్రింది సూచించిన 12 హోం రెమెడీస్ ను ఫాలో అవ్వండి.
చమోమెలీ టీ తాగడం వల్ల మానసికంగా ఉపశమనంకలుగుతుంది.శరీరానికి ఎనర్జీ అందుతుంది. ఎనర్జీ అందడం వల్ల తలతిరిగే సమస్యలుండవు.
తలతిరుగుడు నివారించడానికి కొన్ని నేచురల్ హోం రెమెడీస్ అందుబాటులో ఉన్నాయి. వీటి వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఇవి శరీరానికి ఎలాంటి హాని కలిగించవు, కాబట్టి తలతిరుగుడు తగ్గడానికి ఈ క్రింది సూచించిన 12 హోం రెమెడీస్ ను ఫాలో అవ్వండి.
చమోమెలీ టీ తాగడం వల్ల మానసికంగా ఉపశమనంకలుగుతుంది.శరీరానికి ఎనర్జీ అందుతుంది. ఎనర్జీ అందడం వల్ల తలతిరిగే సమస్యలుండవు.
ఉదయం బ్రీతింగ్ ఎక్సర్ సైజ్ చేయడం వల్ల శరీరం మొత్తానికి ఆక్సిజన్ క్రమంగా సప్లై అవుతుంది. బాడీ మొత్తం రిలాక్స్ అవుతుంది. లాంగ్ డీప్ బ్రీత్ వల్ల తలతిరగడం నివారించుకోవచ్చు.
ఉసిరికాయలో విటమిన్ సి అధికంగా ఉంటుంది. ఇది శరీరానికి వెంటనే ఇమ్యూనిటి పవర్ ను అందిస్తుంది. దాంతో తలతిరుగుడును తగ్గించుకోవచ్చు. ఉసిరికాయను నేరుగా అలాగే తినడం లేదా, ఉసిరికాయకు కొద్దిగా కొత్తిమీర మిక్స్ చేసి పేస్ట్ చేసి, నీళ్ళు కలిపి రాత్రంతా అలాగే ఉంచి ఉదయం దీన్ని పరగడపును తాగాలి.
ఒక టేబుల్ స్పూన్ ధనియాలను ఒక గ్లాసు నీటిలో వేసి రాత్రంతా అలాగే నానబెట్టాలి, ఉదయం వడగట్టి, ఆ నీటితో పరగడుపున తాగాలి. ఇలా చేయడం వల్ల తలతిరుగుడు లక్షణాలను నివారిస్తుంది.
జాజికాయ పొడి మిక్స్ చేసిన జీలకర్ర తినడం వల్ల డీజినెస్ తగ్గిపోతుంది.
తలతిరుగుతున్నట్లు అనిపిస్తే వెంటనే అరకప్పు పెరుగు తినడం వల్ల తల తిరగడం, అలసట తగ్గిపోతుంది.
బాదం ఒక బెస్ట్ డ్రై ఫ్రూట్ , బాదంను రాత్రంతా నీటిలో నానబెట్టి మరుసటి రోజు ఉదయం తినాలి,. అలాగే వీటితో పాటు పాలు కూడా తాగడం వల్ల తలతిగడం దూరం చేస్తుంది.
తులసి, ఒక గ్లాసు పాలలో కొద్దిగా తులిసి వేసి బాయిల్ చేసి, రాత్రి నిద్రించడానికి ముందు తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల తలతిరుగుడు తగ్గిపోతుంది.
తల నుదిటి బాగంలో కొద్దిగా పెప్పర్మింట్ ఆయిల్ ను అప్లై చేసి, మర్ధన చేయడం వల్ల తలతిరగడం తగ్గుతుంది.
సెలరీ జ్యూస్ తలతిరుగుడు నుండి ఉపశమనం కలిగిస్తుంది. ప్రెజర్ తగ్గిస్తుంది,. లోయర్ బ్లడ్ ప్రెజర్ ను తగ్గిస్తుంది.
నిమ్మరసంలో విటమిన్ సి అధికంగా ఉండటం వల్ల ఇది తల తిరగడం తగ్గిస్తుంది, వ్యాధినిరోధకత పెంచుతుంది. సగం నిమ్మకాయను ఒక గ్లాసు నీటిలో మిక్స్ చేసి తాగడం వల్ల ఇన్ స్టాంట్ గా ఎనర్జీ పొందుతారు .
డీహైడ్రేషన్ కారణంగా తలతిరుగుతుంది. కాబట్టి, తరచూ కొద్దిగా నీళ్ళు తాగుతూ శరీరాన్ని హైడ్రేషన్ లో ఉంచుకోవడం వల్ల తలతిరుగటాన్ని నివారించుకోవచ్చు.
Monday, October 3, 2016
"ఆ విషయం" గుర్తొచ్చినప్పుడల్లా తారక్ని తిట్టుకుంటానన్న రాజమౌళి !
'స్టూడెంట్ నెంబర్ 1' షూటింగ్కు స్విట్జర్లాండ్కు వెళ్లగా.. అక్కడ తారక్కు, తనకు ఒకే రూమ్ ఇచ్చారని... అయితే.. తనకు మాత్రం 9 గంటలకే నిద్రపోవడం అలవాటని.. తారక్కి రాత్రి 12 గంటల వరకు టీవీ చూసే అలవాటని చెప్పాడు. అది కూడా వ్యవసాయ కార్యక్రమాలు చూస్తాడని.. స్విట్జర్లాండ్లో ఒకే ఛానెల్లో ఆ కార్యక్రమాలు ప్రసారమయ్యేవని చెప్పాడు. అయితే.. 'అది ఎప్పుడు గుర్తొచ్చినా తారక్ని తిట్టుకుంటాను' అని రాజమౌళి చెప్పారు.
Saturday, October 1, 2016
వజ్రాల ప్రమోషన్ కోసం అమ్మాయిలతో న్యూడ్ ప్రదర్శన !
9:00 AM
No comments
చైనాలో వ్యాపారస్థులు వికృత చేష్టలకు పాల్పడుతున్నారు. ఇప్పటికే అమ్మాయిలను అంగడివస్తువుల్లా మార్చి అన్నింటికి లోదుస్తులకు కూడా ఆడవారితోనే ప్రకటనలు వస్తున్న తరుణంలో యావత్ ప్రపంచ వ్యాప్తంగా ప్రకటనకర్తలపై విమర్శలు వెల్లువెత్తుతున్న వేళ.. చైనా మరో వినూత్న వికృత పోకడలకు వెళ్లి ప్రపంచ విమర్శకుల నుంచి తిట్లు తిట్టించుకుంటోంది.
పక్కా క్యాపిటలిస్టులమని చెప్పుకునే దేశాలు సైతం ఈ తరహా విపరీత పోకడలకు దూరంగా ఉంటున్న తరుణంలో చైనీస్ కంపెనీ మాత్రం మరో అడుగు ముందుకేసి మరీ అడవారిని అంగడి సరుకుగా మార్చింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఒక సంఘటనపై చైనా దేశ పౌరులేకాక యావత్ ప్రపంచం సైతం భగ్గుమంటుంది. చైనా - హాంకాంగ్లలో ప్రతి రోజూ కోట్లాది రూపాయల విలువైన ఆభరణాలను విక్రయించే "చావ్ లుక్ ఫొక్" అతిపెద్ద జువెలరీ కంపెనీ. ఈ కంపెనీ ఈ మధ్యకాలంలో కొత్త మోడల్ వజ్రాలను మార్కెట్లోకి విడుదల చేసింది.
పక్కా క్యాపిటలిస్టులమని చెప్పుకునే దేశాలు సైతం ఈ తరహా విపరీత పోకడలకు దూరంగా ఉంటున్న తరుణంలో చైనీస్ కంపెనీ మాత్రం మరో అడుగు ముందుకేసి మరీ అడవారిని అంగడి సరుకుగా మార్చింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఒక సంఘటనపై చైనా దేశ పౌరులేకాక యావత్ ప్రపంచం సైతం భగ్గుమంటుంది. చైనా - హాంకాంగ్లలో ప్రతి రోజూ కోట్లాది రూపాయల విలువైన ఆభరణాలను విక్రయించే "చావ్ లుక్ ఫొక్" అతిపెద్ద జువెలరీ కంపెనీ. ఈ కంపెనీ ఈ మధ్యకాలంలో కొత్త మోడల్ వజ్రాలను మార్కెట్లోకి విడుదల చేసింది.
ఆ వజ్రాలకు ప్రచారం కల్పించడంలో భాగంగా స్టోర్లలో పనిచేసే అమ్మాయిలను ఆఫ్ న్యూడ్ షో రూం బొమ్మల్లా మార్చేసింది. కొత్త డైమండ్లను సూచిస్తూ ఒంటి పైభాగంలో అచ్ఛాదనలేని అమ్మాయిలను జ్యువెలరీ స్టోర్లలో నిలబెట్టింది. ఈ రకంగా కస్టమర్లను ఆకట్టుకోవాలనే నీచమైన పనికి చైనా ఒడిగట్టింది. షాపులో ప్రవేశిస్తే చాలు, అసభ్యకరంగా నిల్చున్న అమ్మాయిలు దర్శనమిస్తారు. ఇది చూసి కొనుగోలుదారులంతా అవాక్కయ్యారు.
కొందరైతే కంపెనీ తీరును బాహాటంగానే తప్పుపట్టారు. ఇక ప్రపంచవ్యాప్తంగా నెటిజన్లు సైతం చైనా కంపెనీ తీరును తప్పుపడుతున్నారు. ఇక నెటిజన్లు అయితే చైనా కంపెనీ తీరును ఏకిపారేస్తున్నారు. ఏ రకంగా చూసినా ఈ ఆభరణాల కంపెనీ చర్య సమర్థనీయం కాదని దీని లైసెస్సులను రద్దుచేయాలని డిమాండ్ చేస్తున్నారు. కానీ చైనా ప్రభుత్వం ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. దీనిపై నెటిజన్లు మండిపడుతున్నారు.
Thursday, September 29, 2016
"పెరుగు"లో వీటిని కలుపుకుని తింటే ?
జీలకర్ర పొడి ఒక స్పూన్ను ఓ కప్పు పెరుగులో కలుపుకుని తింటే త్వరగా బరువు తగ్గుతారని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.
పెరుగులో ఆరెంజ్ జ్యూస్ కలిపి తింటే శరీరానికి తగినంత విటమిన్ సి లభిస్తుంది. ఇది కీళ్ల నొప్పులను తగ్గిస్తుంది. వృద్ధాప్య ఛాయలను దూరం చేస్తుంది.
ఓ కప్పు పెరుగులో కొంత నల్ల మిరియాల పొడిని కలిపి తినాలి. జీర్ణక్రియ మెరుగవుతుంది.
పెరుగులో వివిధ రకాల పండ్లను కలిపి తింటే శరీర రోగ నిరోధక వ్యవస్థ పటిష్టమవుతుంది. పలు రకాల ఇన్ఫెక్షన్లు, వ్యాధులు రాకుండా చూసుకోవచ్చు.
పెరుగులో వివిధ రకాల పండ్లను కలిపి తింటే శరీర రోగ నిరోధక వ్యవస్థ పటిష్టమవుతుంది. పలు రకాల ఇన్ఫెక్షన్లు, వ్యాధులు రాకుండా చూసుకోవచ్చు.
పెరుగులో తేనె కలిపి తీసుకుంటే కడుపులో ఉన్న అల్సర్లు మటుమాయమైపోతాయి. ఈ మిశ్రమం యాంటీ బయోటిక్గా పనిచేస్తుంది. దీని వల్ల శరీరంలో ఉన్న ఇన్ఫెక్షన్లు వెంటనే తగ్గుతాయి.
కొద్దిగా పెరుగులో చక్కెర కలుపుకుని తినాలి. దీంతో శరీరానికి వెంటనే శక్తి అందుతుంది. మూత్రాశయ సంబంధ సమస్యలు కూడా పోతాయి.
కొంత వాము తీసుకుని ఓ కప్పు పెరుగులో కలిపి తినాలి. దీని వల్ల నోటి పూత, దంతాల నొప్పి, ఇతర దంత సంబంధ సమస్యలు తగ్గిపోతాయి.
పెరుగులో కొంత పసుపు, కొంత అల్లం కలిపి తినాలి. దీని వల్ల ఫోలిక్ యాసిడ్ శరరీంలోకి చేరుతుంది. ఇది చిన్నారులకు, గర్భిణీ మహిళలకు ఎంతగానో మేలు చేస్తుంది.
Wednesday, September 28, 2016
Subscribe to:
Posts (Atom)