CSS Drop Down Menu

Tuesday, October 31, 2017

ఒక టేబుల్ స్పూన్ సోంపును అన్నం తిన్న తరువాత తింటే ?

సోంపుకు కొలెస్ట్రాల్‌కు ఉన్న లింకేంటి. సోంపు అంటే కొంతమంది ఇష్టపడతారు. మరికొంతమంది అసహ్యించుకుంటారు. ఇంట్లో గాని, రెస్టారెంట్‌లో గాని భోజనం తిన్న తరువాత సోంపును తినేవారు చాలామంది ఉంటారు. ఇది తినడం వల్ల జీర్ణశక్తి పెరుగుతుందని చాలామంది నమ్ముతారు. 



సోంపు ఎంత ఎక్కువగా తింటే అంత కొవ్వు కరిగిపోతుంది. సోంపు అనేది భోజనం చేసిన తరువాత తినే స్వీట్ పదార్థం అని అందరూ అనుకుంటారు. కానీ అది తప్పు. సోంపు త్వరగా జీర్ణం చేసి క్రొవ్వును బాగా కరిగిస్తుంది. చాలామందికి ఈ విషయం తెలియదు. ఒక టేబుల్ స్పూన్ సోంపును అన్నం తిన్న తరువాత తింటే నోట్లో లాలాజలం ఉత్పత్పై ఎసిడిటి సమస్యను తగ్గిస్తుంది. జీర్ణక్రియను పెంచుతుంది. సోంపులో ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల తీసుకున్న ఆహారంలో నీటి శాతాన్ని గ్రహించి మలబద్ధకంలో నివారిస్తుంది. 

సోంపును రెగ్యులర్‌గా వాడితే బ్లడ్ ప్రెషర్‌ను తగ్గిస్తుంది. క్యాన్సర్ దరిచేరనివ్వద్దు. అధిక బరువును తగ్గిస్తుంది. రోజూ సోంపు పౌడర్‌ను నీళ్ళలో కలుపుకుని తాగితే బరువు బాగా తగ్గుతారు. సోంపును అధికంగా వాడితే అంత ప్రయోజనం ఉంటుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.

Monday, October 30, 2017

పవన్ చిత్రం అట్టర్ ప్లాప్ అవుతుందని తనకు ముందే తెలుసంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన దర్శకుడు?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చిత్రంతో తనకు రీమేక్ చిత్రాలంటేనే విరక్తి కలిగిందని దర్శకుడు జయంత్ సి పరాన్జీ చెప్పారు. పైగా, పవన్‌తో తాను తీసిన తీన్‌మార్ చిత్రం అట్టర్ ప్లాప్ అవుతుందని తనకు ముందే తెలుసంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. దీనిపై ఆయన తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ''తీన్‌మార్ సినిమాతో నాకు రీమేక్ సినిమాలంటేనే విరక్తి కలిగింది. ఆ సినిమా ఫ్లాప్ అవుతుందని నాకు ముందే తెలుసు. కానీ చేయక తప్పలేదన్నారు".



పైగా, నేను పలు రీమేక్ చిత్రాలు చేశాను. కాకపోతే వాటిని తెలుగు ప్రేక్షకులకు అర్థమయ్యేలా కొన్ని సీన్లు మార్చాను. కానీ తీన్‌మార్‌ని సేమ్ టు సేమ్ దించేయాల్సి వచ్చింది. తప్పలేదు ఆ టైమ్‌లో అలా చేయాల్సి వచ్చింది..'' అంటూ తీన్‌మార్ విషయంలో తను ఎదుర్కొన్న చేదు అనుభవాన్ని వెల్లడించారు. 

ఆ సినిమా ఫ్లాప్ అవుతుందని తనకు ముందే తెలుసని ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దుమారాన్ని రేపుతున్నాయి. మరి తెలిసి కూడా అంత పెద్ద హీరో అవకాశం ఇస్తే ఎందుకలా ప్లాప్ సినిమా తీశారంటూ సోషల్ మీడియాలో పవన్ అభిమానులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. 

Saturday, October 28, 2017

43వేల మంది మగాళ్ల చేతుల్లో నలిగిపోయిన ఓ యువతి ! ఇప్పుడు ఏం చేస్తుందో తెలుసా?

ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఓ గ్యాంగూ కాదు, ఏకంగా 43వేల మంది మృగాళ్ల చేతుల్లో నలిగిపోయిన ఓ యువతి కథ వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే మెక్సికోకు చెందిన కార్లా జాసింటో గత ఏడాది అంతర్జాతీయ మీడియా ముందుకొచ్చింది. 12 ఏళ్ల వయసులో మానవ అక్రమ రవాణా ముఠా చేతుల్లోకి చిక్కుకున్న ఈమె బలవంతంగా వేశ్యగా మార్చబడింది. డబ్బు మీద మోజుతో, తనను కలిసిన వ్యక్తితో బయటికి వెళ్లింది. 

అంతే అప్పటి నుంచి సెక్స్ బానిసగా మారిపోయానని వెల్లడించింది. రోజుకు 30మంది విటులను భరిస్తూ నాలుగేళ్ల  పాటు నరకయాతన అనుభవించానని జాసింటో తెలిపింది. ఏడ్చేందుకు కన్నీళ్లు కూడా వచ్చేవి కావని పరిస్థితి అంత దారుణంగా వుండేదని చెప్పుకొచ్చింది.

ఉదయం పది గంటల నుంచి అర్థరాత్రి వరకూ తనపై మృగాళ్లు పడుతుంటే, బాధను తట్టుకోలేక ఏడుస్తూ, కళ్లు మూసుకునే దాన్ని అంతకుమించి ఏమీ చేయలేని స్థితిలో వుండేదాన్నని చెప్పుకొచ్చింది. పోలీసుల దాడులతో తిరిగి జనజీవనంలోకి వచ్చిన కార్లా ప్రస్తుతం ఓ మంచి న్యాయవాది. మానవ అక్రమ రవాణాకు వ్యతిరేకంగా కోర్టులకు వచ్చే కేసులను వాదిస్తూ తనలాంటి అభాగ్యుల తరపున నిలుస్తోంది.

Friday, October 27, 2017

కీళ్ళ నొప్పులు తగ్గాలంటే ఈ చేపలను తినండి.

సాల్మన్, ట్యూనా వంటి చేపల్లో అధికంగా ఉండే ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు కీళ్లను ఆరోగ్యంగా వుంచుతాయి. వారానికి కనీసం రెండు సార్లైనా చేపలను ఆహారంలో చేర్చుకుంటే కీళ్ల నొప్పులను దూరం చేసుకోవచ్చు.






చేపలు తిననివారు బదులుగా ఒమేగా -3 ఫాటీ యాసిడ్లు ఉండే అవిసెగింజలూ, బాదం, వాల్‌నట్లూ, పొద్దుతిరుగుడు పువ్వు గింజల్ని తీసుకోవాలి. విటమిన్‌ సి ఉండే పండ్లు తినడం కూడా తప్పనిసరే. చక్కెరశాతం తక్కువగా ఉండే పదార్థాలనే ఎంచుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

ఇక కీళ్ల నొప్పులకు అధికబరువు కూడా ఒక కారణమే. బరువు తగ్గించుకునేందుకు వ్యాయామం చేస్తూనే పండ్లూ, తాజా కూరగాయలూ, ఆకుకూరలూ, చిరు ధాన్యాలు ఆహారంలో ఉండేలా చూసుకోవాలి.


అలాగే యాంటీ యాక్సిడెంట్లు అధికంగా ఉండే సి.విటమిన్‌ ను తీసుకుంటే కీళ్ల నొప్పుల సమస్యను అదుపులో ఉంచుకోవచ్చునని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

Thursday, October 26, 2017

ఇంటర్నెట్ యూజర్లకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త !

ఇంటర్నెట్ యూజర్లకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త తెలిపింది. కనీస ఇంటర్నెట్ వేగాన్ని నాలుగు రెట్లకు పెంచింది. అంటే ప్రస్తుతం కనీస ఇంటర్నెట్ వేగం సెకనుకు 512 కిలోబైట్లుగా ఉంది. దీన్ని 2 మెగాబైట్లకు పెంచనున్నట్టు ప్రకటించింది. దీనికి సంబంధించిన అధికారిక ఉత్తర్వులను త్వరలోనే జారీ చేయనుంది. ఈ విషయాన్ని కేంద్ర టెలికాం కార్యదర్శి అరుణా సుందరరాజన్ వెల్లడించారు. 



ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఇంటర్నెట్ వాడకం విపరీతంగా పెరిగిపోతోంది. దీన్ని మరింత ప్రోత్సహించేలా కేంద్రం ఈ కీలక నిర్ణయం తీసుకుంది. అంటే ఇకపై కనీస ఇంటర్నెట్ వేగం సెకనుకు 2 మెగాబైట్లుగా ఉండనుందని టెలికం శాఖ కార్యదర్శి అరుణా సుందరరాజన్ వెల్లడించారు. ఇంటర్నెట్ వేగం చాలా తక్కువగా ఉంటోందని గ్రామీణ ప్రాంతాల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నామని, త్వరలోనే అధికారిక ఉత్తర్వులు వెలువడతాయని ఆయన అన్నారు.

3జీ, 4జీ తరాలు పోయి 5జీ తరం రానుందని, ఈ నేపథ్యంలో కనీస వేగం మరింతగా పెరగాల్సిన అవసరం ఉన్నప్పటికీ, మౌలిక వసతుల కొరత దృష్ట్యా 2 ఎంబీపీఎస్ వరకూ మాత్రమే వేగం పెంచలగమని భావిస్తున్నట్టు తెలిపారు. భారత ఆర్థిక వ్యవస్థ డిజిటల్ ఎకానమీగా మారుతోందని, దీనికి వేగవంతమైన ఇంటర్నెట్ తప్పనిసరిని ఆయన ఓ ప్రశ్నకు సమాధానమిచ్చారు. 

Wednesday, October 25, 2017

పెంపుడు జంతువులకు పన్ను చెల్లించాలంటున్న ప్రభుత్వం ! ఎక్కడో తెలుసా?

కేంద్రంలో ప్రధాని నరేంద్ర మోడీ సారథ్యంలోని బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒకే దేశం, ఒకే పన్ను అనే నినాదంతో జీఎస్టీ పన్ను విధానాన్ని అమల్లోకి తెచ్చింది. అలాగే, పంజాబ్ రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం కొత్తగా బాధ్యతలు చేపట్టింది. అయితే, ఈ రాష్ట్రంలో ఇంట్లో పెంపుడు జంతువులు ఉంటే పన్ను చెల్లించాల్సిందేనంటూ ఆదేశాలు జారీఅయ్యాయి. 

ఈ తరహా ఆదేశాలు జారీ చేసింది ఎవరో కాదు భారత క్రికెట్ జట్టు మాజీ క్రికెటర్, పంజాబ్ రాష్ట్ర మంత్రి నవజ్యోత్ సింగ్ సిద్ధూ. ఈ ఉత్తర్వుల మేరకు పిల్లి, కుక్క, పంది, గుర్రం, ఆవు, ఏనుగు, ఒంటె, బర్రె ఇలా ఏ పెంపుడు జంతువైనా ఇంట్లో ఉన్నట్టయితే పన్ను కట్టాల్సిందే. పంచాయతీలను మాత్రం ఈ పన్ను పరిధి నుంచి మినహాయించారు. జంతువులను బట్టి రూ.200 నుంచి రూ.500వరకు పన్ను చెల్లించాల్సి ఉంటుందని ప్రభుత్వం తెలిపింది. 

ఒకవేళ పన్ను కట్టకపోతే... మున్సిపల్ సిబ్బంది ఆ జంతువులను స్వాధీనం చేసుకుంటారు. అయితే, కోళ్లు, చిలుకలు, పావురాలు వంటి పక్షులకు కూడా పన్ను వర్తిస్తుందా? లేదా? అనే విషయంలో మాత్రం స్పష్టత లేదు. ఈ పన్ను విధింపు ఉత్తర్వులపై పంజాబ్ రాష్ట్ర ప్రజలు నోరెళ్లబెడుతున్నారు. 


Monday, October 23, 2017

కార్తీకమాసంలో "శివ కేశవుల"ను ఏ విధంగా పూజించాలో తెలుసా?

పరమేశ్వరుడికి అత్యంత ప్రీతికరమైన మాసం కార్తీక మాసం అని చెపుతారు. ఐతే కార్తీకమాసంలో ఉసిరిచెట్టు క్రింద శ్రీ మహావిష్ణువును ఉసిరికాయలతో దీపారాధన చేసేవారిని చూడడానికి యమునికి కూడ శక్తి చాలదట. కార్తీక మాసంలో వచ్చే సోమ, శని వారాల్లో శ్రీమహావిష్ణువును ఉసిరితో అభిషేకిస్తే అష్టైశ్వర్యాలు చేకూరుతాయి. ఉసిరి చెట్లు ఉన్నతోటలో వనభోజనాలు చేస్తే వారి మహాపాతకాలు సైతం తొలగిపోతాయి. 




ఉసిరి ఔషధీ గుణము కలది కనుక, వనభోజనాల వలన ఆరోగ్యం చేకూరుతుంది. ఉసిరి పూజ వలన లక్ష్మీదేవి ఆ భక్తుల ఇండ్లలో స్థిరనివాసం ఏర్పరుచుకుంటుందని, కార్తీక మాసంలో స్నానాలు, దీపారాధన, జాగరణ, తులసి, ఉసిరి పూజల వలన, ధన, ఫల, భూదానాల వలన పుణ్యఫలం లభిస్తుందని పండితులు అంటున్నారు. 

ఈ కార్తీక మాసంలో పితృతర్పణ పూర్వకంగా ఎన్ని నువ్వులయితే విడువబడుతున్నాయో అన్ని సంవత్సరాల పాటు పితృదేవతలు స్వర్గంలో నివసిస్తారని విశ్వాసం. యజ్ఞయాగాదులకన్నా కార్తీకవ్రతం వల్ల గొప్ప పుణ్యం లభిస్తుంది. 

తీర్థయాత్రల వల్ల కలుగునటువంటి ఫలం, ఈ కార్తీకమాసంలో శ్రీ మహావిష్ణువుని ఎక్కడైతే పూజిస్తారో, అక్కడ భూత, పిశాచ, గ్రహ గణాలు దూరంగా ఉంటాయి. శివుడికి ప్రీతికరమైన జిల్లేడుపూలతో పూజించితే దీర్ఘాయులై, మోక్షాన్ని పొందుతారు. శుద్ధ ద్వాదశినాడు శివునికి మారేడు దళాలతో, జిల్లేడుపూలతో, విష్ణువుకు తులసీ దళాలతో, జాజిపూలతో పూజ అత్యంత శ్రేష్టమని పండితులు చెబుతున్నారు.

ఈ మాసంలో ఉదయం, సాయంత్రంవేళల్లో ఆవు నేతితో గాని, నువ్వులనూనెతో గానీ దీపారాధన చేసి, అభిషేక ప్రియుడైన ఈశ్వరునికి మహాన్యాస పూర్వక రుద్రాభిషేకాలు, అర్చనలు చేయడం వలన మహా పుణ్యం లభిస్తుంది.


Saturday, October 21, 2017

ఇలాంటి వెరైటీ "వెడ్డింగ్ ఇన్విటేషన్" ఎవరూ చూసి ఉండరు.

వెడ్డింగ్ ఇన్విటేషన్ అనేసరికి ఈ మధ్యకాలంలో క్రియేటివికి తగ్గట్టుగా రెడీ చేస్తున్నారు. తాజాగా అశోక్- సరయు అనే వధూవరుల వెడ్డింగ్ ఇన్విటేషన్ ఇలావుంది. నవంబర్ రెండున గురువాయూర్ ఆలయంలో ఉదయం పదకొండున్నర గంటలకు వీళ్ల మ్యారేజ్ జరుగుతున్నట్లు, నాలుగున సరస్వతి ఆలయంలో సాయంత్రం మూడుగంటల నుంచి రిసెప్షన్ ఆపై విందు వుంటుందని ఎంచక్కా లిక్కర్ బాటిల్‌పై ముద్రించిన ఫోటో ఇంటర్నెట్‌లో చక్కర్లు కొడుతోంది.






Thursday, October 19, 2017

టివి నటి రాత్రుళ్లు ఆ పని ఎందుకు చేస్తుందో తెలిస్తే ?

మలయాళ బుల్లితెర నటి కవితా లక్ష్మి పగలంతా నటిగా షూటింగ్‌ల్లో పనిచేస్తుంది. రాత్రైతే చాలు హోటల్ నడుపుతుంది. ఇందుకు కారణం ఆర్థిక కష్టాలే. సీరియల్స్ ద్వారా వచ్చే డబ్బు కుటుంబానికి సరిపోకపోవడంతో  అదనంగా సంపాదించేందుకు గాను రాత్రిపూట రోడ్డు పక్కన ఓ చిన్న హోటల్ పెట్టుకుంది. ఇడ్లీ, దోసెలు వంటివి అమ్ముకుంటూ డబ్బు సంపాదించుకుంటోంది. 




మలయాళంలో సూపర్ హిట్ అయిన "స్త్రీధనం'' సీరియల్ ద్వారా గుర్తింపు సంపాదించుకున్న కవితా లక్ష్మీ తాను ఒంటరిగా ఉంటూ ఓ పాప, బాబును చూసుకుంటున్నానని మలయాళ ఆన్‌లైన్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. కుమారుడిని పై చదువుల కోసం బ్రిటన్‌కు పంపానని అక్కడ అతడు పార్ట్‌టైమ్ జాబ్ చేసి ఉద్యోగం చేసి గంటకు పది పౌండ్లు సంపాదించవచ్చునని మధ్యవర్తులు చెప్పిన మాట నమ్మి మోసపోయానని చెప్పుకొచ్చింది. 

అందుకే ప్రస్తుతం కుమారుడి చదువులకు అవసరమయ్యే ఫీజులు పంపాల్సి వుందని తెలిపింది. అందువల్లే నటనతో పాటు హోటల్ నడుపుతున్నానని తెలిపింది. కాగా నెయ్యత్తికరా పరిధిలోని నిమ్స్ ఆస్పత్రి సమీపంలో వుందని వెల్లడించింది.

Wednesday, October 18, 2017

నీరసంగా వున్నారా? ఈ పండ్ల రసాన్ని తాగితే సరి !

నీరసంగా వున్నారా? ద్రాక్షపండ్ల రసాన్ని తాగేయండి అంటున్నారు.. ఆరోగ్య నిపుణులు. ద్రాక్షపండ్లలో శరీరానికి కావాల్సిన కొన్ని పోషక విలువలు పుష్కలంగా వుంటాయి. ఈ పండ్లలో అధిక మోతాదు గల పోషకాలు నీరసాన్ని దూరం చేస్తాయి. ద్రాక్ష రసం తీసుకుంటే శరీరానికి తక్షణ శక్తి లభిస్తుంది. అలాగే కార్పోహైడ్రేట్‌, సిట్రిక్‌ ఆసిడ్‌, ప్రోటీనులు, ఐరన్‌, పొటాషియం వంటి పోషకాలు లభ్యమవుతాయి. ఈ పండ్లనుగానీ, ఈ పండ్లతో తయారుచేసే రసాన్ని గానీ తరుచుగా తీసుకుంటే.. అనారోగ్య  సమస్యలను దూరం చేసుకోవచ్చు. 



ద్రాక్ష రసంలో కొద్దిగా పంచదార కలిపి పరిగడుపున తాగితే.. అల్సర్‌, పొట్ట రుగ్మతలు దూరమవుతాయి. ముఖ్యంగా నాలుగు పదులు నిండిన మహిళల్లో నెలసరి సమస్యలు తలెత్తితే.. రోజూ ద్రాక్షరసం తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు సలహాలు ఇస్తున్నారు. రోజూ ఈ పండ్లరసాన్ని తాగితే.. ఎముకలు, దంతాలు బలపడతాయి. అలాగే గుండె ఆరోగ్యంగా వుంటుందని వారు సూచిస్తున్నారు.

Tuesday, October 17, 2017

ఉరకలెత్తుతున్న శ్రీశైలం జలాలు !



Monday, October 16, 2017

"జామ చేసే మేలు" తెలిస్తే రోజూ తింటారు.

గుండెజబ్బుతో బాధపడే వారు ప్రతిరోజూ భోజనంతో పాటు జామపండును మూడు నెలలపాటు తీసుకుంటే మంచి ఫలితం వుంటుంది. జామపండును తింటే శరీరంలో రక్త సరఫరా సాఫీగా జరుగుతుంది. జామపండు ప్రతి రోజు ఆహారంగా తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.





బాగామాగిన జామపండులోని 50 గ్రాముల గుజ్జు, పది గ్రాముల తేనెను కలిపి తీసుకుంటే శరీరంలో శక్తి పుంజుకుంటుంది. ఉదయం, రాత్రి వేళల్లో భోజనానంతరం జామపండు సేవిస్తే జీర్ణక్రియ సాఫీగా జరుగుతుంది. దీంతోపాటు మానసిక ఒత్తిడి కూడా మటుమాయమవుతుంది. 

ప్రతిరోజూ ఒక జామకాయ తింటే ప్రొస్టేట్ క్యాన్సర్‌ను అరికట్టవచ్చును. 

పచ్చి జామకాయ తింటే చిగుళ్లు, దంతాలు గట్టిపడతాయి. ఇందులో విటమిన్-సి అధిక మొత్తంలో ఉండడంతో చిగుళ్ల నుంచి రక్తస్రావం ఆగుతుంది.

 పచ్చి జామకాయ ముక్కలను కప్పెడు తీసుకొని, బాగా ఎండబెట్టి, దానికి అర చెంచా మిరియాలు, అర చెంచా సైందవ లవణాన్ని వేసి మెత్తగా పొడిచేసి సీసాలో నిల్వ చేసుకోవాలి. దానిని ప్రతిరోజూ పళ్లపొడిలా వాడితే దంతాలు గట్టి పడడమే కాకుండా చిగుళ్ల సమస్యలు దూరమవుతాయి.

బాగా పండిన జామ పండ్ల గుజ్జులోంచి గింజలు తొలగించి పాలు తేనె కలిపి తీసుకుంటే విటమిన్-సి, కాల్షియం మెండుగా లభిస్తాయి. పెరిగే పిల్లలకు, గర్భిణులకు దీనిని టానిక్‌లా వాడవచ్చు.

 జామపండులో సి-విటమిన్ అధికంగా ఉండడంతో చర్మానికి మేలు చేస్తుంది. వీటితో పాటు జుట్టు రాలటాన్ని నివారిస్తుంది.

 విటమిన్-ఏ అధికంగా ఉండే జామపండుతో కంటి సంబంధిత సమస్యలు దూరం అవుతాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.

Saturday, October 14, 2017

హైదరాబాబాద్‌లో క్వార్టర్ బాటిల్ మందుకొట్టి హాయిగా డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు?

హైదరాబాబాద్‌లో ఇకపై క్వార్టర్ బాటిల్ మందుకొట్టి హాయిగా డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. పోలీసుల తనిఖీల్లో పట్టుబడినా ఎలాంటి కేసులు నమోదు చేయరు. అయితే, బీఏసీ మోతాదు మాత్రం మించితే మాత్రం శిక్ష అనుభవించాల్సి ఉంటుంది. ఉన్నట్టుండి తెలంగాణ రాష్ట్ర పోలీసులు ఈ తరహా నిర్ణయం తీసుకోవాలని భావించడం వెనుక ఓ బలమైన కారణం ఉంది. 

సాధారణంగా 100 ఎంఎల్ బ్లడ్‌లో 30 ఎంజీ బీఏసీ (బ్లడ్ ఆల్కహాల్ కౌంట్) ఉంటే పట్టుకుంటూ, వారి వాహనాలను స్పాట్‌లో సీజ్ చేయడంతో పాటు, కౌన్సెలింగ్ చేస్తారు. ఇలా పట్టుబడినవారు ఇంటికెళ్లి మరుసటి రోజు కౌన్సెలింగ్‌కు హాజరయ్యే సమయంలో వివాహితుడైతే భార్యను, పెళ్లికాకుంటే తల్లిదండ్రుల్లో ఒకరిని లేదా దగ్గరి బంధువును విధిగా తీసుకుని రావాల్సి ఉంటుంది. అపుడే వారికి కౌన్సెలింగ్ ఇచ్చి వారి వాహనాలను తిరిగి అప్పగిస్తుంటారు. 

అయితే, చాలా మంది మందుబాబులు కౌన్సిలింగ్‌కు హాజరుకాకుండా వాహనాలను వదిలేసుకుంటున్నారు. పైగా, కౌన్సెలింగ్‌ వైపు కన్నెత్తి కూడా చూడటం లేదు. ఈ కారణంగానే ఆయా స్టేషన్‌లలో వాహనాల సంఖ్య పెరిగిపోతోంది. ఇపుడు హైదరాబాద్ నగర వ్యాప్తంగా ఇలా ఉన్న వాహనాల సంఖ్య 3,760కి పైగా ఉంది. దీంతో బీఏసీ కౌంట్‌ను 100కు సవరించి, అంతకన్నా ఎక్కువ మోతాదులో మద్యం తాగి దొరికితేనే వారికి కౌన్సెలింగ్ వర్తింపజేసే ఆలోచనలో ఉంది. 

దీనిపై హైదరాబాద్ ట్రాఫిక్ డీసీపీ ఏవీ రంగనాథ్ స్పందిస్తూ.. డ్రంకెన్ డ్రైవ్‌లో చిక్కి, కౌన్సెలింగ్‌కు హాజరుకాని వారి సంఖ్య వేలల్లో ఉంటుంది. దీంతో అలాంటి వాహనాలన్నీ ట్రాఫిక్ పోలీసు స్టేషన్లలో కుప్పలుతెప్పలుగా పేరుకుపోతున్నాయి. వాటి సంరక్షణ భారం పోలీసు విభాగానికి తలనొప్పిగా మారింది. ఇందుకోసం కొత్త విధానాన్ని రూపొందించాలని యోచిస్తున్నట్టు చెప్పారు. 

ఇపుడు 60 ఎంఎల్ మద్యం సేవిస్తే శరీరంలో 30 బీఏసీ నమోదవుతుంది. ఆపై ఓ అర్థగంట ఎక్కడైనా గడిపి వాహనం నడుపుతూ వెళ్లి డ్రంకెన్ డ్రైవ్‌లో దొరికినా, ఆ పాటికి బీఏసీ తగ్గిపోతుంది. ఇక 30 బీఏసీ కౌంట్‌ను 100కు సవరిస్తే, నిరభ్యంతరంగా ఓ క్వార్టర్ మందేసి బండెక్కి డ్రైవ్ చేసుకుంటూ మందుబాబులు వెళ్లిపోవచ్చని పలువురు వైద్య నిపుణులు చెపుతున్నారు. 

Flipkart : 

Big Diwali Sale:- http://fkrt.it/j7EiqTuuuN

Amazon:

Great Indian Festival:- http://amzn.to/2yjYNu3

Friday, October 13, 2017

"బీరు" తాగిన వెంటనే చేయకూడని పనులు !

బీరు అనగానే 18 యేళ్ళ కుర్రాళ్ళ నుంచి 60 యేళ్ళ వృద్ధుల వరకూ ఎక్కువగా ఇష్టపడే ఐటమే. సామాన్యంగా పార్టీ చేసుకోవాలనుకున్నా.. లేకుంటే ఎక్కడైనా పార్టీకి కూర్చున్నా ఎక్కువగా తాగేది బీరు మాత్రమే. మత్తు పదార్థాల్లో యువత ఎక్కువగా తీసుకునేది ఇదే. బీరు ఎంత తాగితే అంత కిక్కొస్తుందని చెబుతుంటారు. 



బీరు తాగితే బాగా లావవుతారని చెబుతుంటారు. అయితే బీరు తాగిన వెంటనే ఇది మాత్రం చేయకూడదని చెబుతున్నారు వైద్యులు. అమెరికన్ రీసెర్చ్ చేసిన సర్వేలో ఈ మూడు పనులు చేయకూడదు. 

మొదటిది:- బీరు తాగిన వెంటనే పెరుగు అస్సలు తీసుకోకూడదు. చాలామంది తాగింది దిగిపోవాలని మజ్జిగ, పెరుగు తీసుకుంటుంటారు. కానీ అలా అస్సలు తీసుకూకూడదు.

రెండవది:- పాన్, గుట్కా ఇవి అస్సలు వేసుకోకూడదు.

మూడవది:- బీరు తాగిన వెంటనే అన్నం తినకూడదని అనుకుంటుంటారు. కానీ బీరు తీసుకున్న తర్వాత అన్నం తినవచ్చు.

Thursday, October 12, 2017

"101సంవత్సరాల బామ్మ"చేసే పని చూస్తే ఆశ్చర్య పోవాల్సిందే !

వయసు మళ్ళినవాళ్ళు హాయిగా "కృష్ణా, రామా" అంటూ పొద్దు పుచ్చేస్తుంటారు. ఎనభై, తొంభై, వందేళ్ళ వాళ్ళయితే ఇక చెప్పనే అక్కర్లేదు. ఇల్లు కదలడానికే ఆపసోపాలు పడిపోతుంటారు. అయితే ఆ బామ్మ మాత్రం అలాంటిది కాదు. ఏజ్ కూడా ఎంతో కాదు.. జస్ట్.. 101 ఏళ్ళు మాత్రమే.. అయినా పాతికేళ్ళదానిలా చాలా చలాకీగా లైఫ్ లాగించేస్తోంది. పేరు మన్ కౌర్. చండీగఢ్‌కు చెందినదైనా పాటియాలాలో ఉంటోంది. స్పోర్ట్స్, అథ్లెట్స్, ఈవెంట్స్ అంటే ఆమెకు ప్రాణం. ఎందులోనైనా ఈజీగా గెలిచేస్తోంది.జావెలిన్ త్రో, షాట్ పుట్, జిమ్.. రన్నింగ్.. ఏదైనా సరే.. యూత్ తో పోటీ పడుతూ నాదే గెలుపని సగర్వంగా చాటుతోంది.




ఈ మధ్య న్యూజి లాండ్ లోని ఆక్లాండ్ లో జరిగిన వాల్డ్ మాస్టర్స్ గేమ్స్ లో వంద మీటర్ల స్ప్రింట్ లో విక్టరీ సాధించి పాపులర్ అయిపోయింది. చైనాలో ఇటీవల ఛాంపియన్ షిప్ పోటీల్లో పాల్గొనడానికి ఉబలాటపడినా.. వీసా లభించలేదు. అయినా కౌర్ చలించలేదు. అన్ని ఆటల్లోనూ రాణిస్తున్న ఈమెను 'మిరకిల్ ఫ్రం చండీగఢ్' అని అంతా అభివర్ణిస్తుంటారు. ఈవెంట్స్ లో పార్టిసిపేట్ చేయడం తనకెంతో సంతోషం కలిగిస్తుందని కౌర్ చెబుతోంది. ఆహారం మితంగా తినాలని, రోజూ జిమ్ కెళ్ళి వ్యాయామం చేయాలని అంటోంది. అన్నట్టు ఈమె 79 ఏళ్ళ కొడుకు గురు దేవ్ సింగ్ కూడా మంచి క్రీడాకారుడే.. ఇంటర్నేషనల్ అథ్లెటిక్స్ ఈవెంట్స్ లో పాల్గొంటూ ఉంటాడు.




Tuesday, October 10, 2017

చిరంజీవి అంటే ఎవరో తెలియదన్న ప్రభాస్ ! అలా ఎందుకన్నాడో తెలుసా?

ప్రభాస్‌కు మెగాస్టార్ చిరంజీవి అంటే చాలా ఇష్టం. సినీ పరిశ్రమలో కంటే ఇద్దరిదీ ఒకే ఊరు కావడంతో చిరు అంటే ప్రభాస్‌కు అమితమైన ఇష్టం. చిరంజీవి కూడా ప్రభాస్ పైన అభిమానం చూపుతుంటారు. అందుకే బాహుబలి షూటింగ్ సమయంలో నేరుగా వెళ్ళి ప్రభాస్‌తో మాట్లాడి వచ్చారు చిరంజీవి. 


చిరు హీరోగా అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కనున్న 'సైరా నరసింహారెడ్డి' సినిమా గురించి స్నేహితులతో ప్రభాస్ మాట్లాడుతూ కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. చిరంజీవి ఏ సినిమా ప్రారంభిస్తే ఆ సినిమా ముగిసేంత వరకు నేను ఆయన్ను ఆ క్యారెక్టర్ లోనే ఊహించుకుంటాను. కాబట్టి ఇప్పుడు నాకు చిరంజీవి అంటే ఎవరో తెలియదు. నాకు తెలిసిన వ్యక్తి 'సైరా నరసింహారెడ్డి' అని స్నేహితులతో అన్నారట. చిరుపై ఎంత ప్రేమ ఉంటే ప్రభాస్ ఇలా చెప్పి ఉంటారని స్నేహితులు అనుకుంటున్నారు.



Monday, October 9, 2017

"వెన్న" తింటే "కొవ్వు" పెరుగుతుందా ?

వెన్న తింటే కొవ్వు పెరగదు. గుండెకు మేలే అంటున్నారు ఆరోగ్య నిపుణులు. వెన్న తింటే కొవ్వు పెరుగుతుందనీ, బరువు పెరుగుతారని చాలామంది అనుకుంటారు. అయితే ఇందులో నిజం లేదని, వెన్నలోని ఎ విటమిన్‌ గుండెను ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడుతుందని వైద్యులు చెప్తున్నారు. దీనిలోని యాంటీఆక్సిడెంట్లు గుండెను దృఢంగా ఉంచుతాయి. 



అంతేకాకుండా వెన్నను ఆహారం ద్వారా తీసుకోవడం వలన త్వరగా కడుపు నిండినట్లు ఉండడంతో పాటు ఎక్కువసేపు ఆకలి వేయకుండా ఉంటుంది. దీని వలన అధికబరువు సమస్య తలెత్తదు. వెన్నలో మంచి కొలెస్ట్రాల్ వుండటం ద్వారా చిన్నపిల్లలకు ఇవ్వడం ద్వారా మేలే జరుగుతుంది. 

చిన్నపిల్లలకు రోజూ రెండు స్పూన్ల వెన్న ఇవ్వడం ద్వారా వారి మెదడూ, నాడీ వ్యవస్థ ఎదుగుదల చక్కగా ఉంటుంది.  చిన్నతనం నుంచి పిల్లలకు తగు మోతాదులో వెన్నను తినడం అలవాటు చేయడం మంచిది. పెద్దలు మాత్రం రోజుకో స్పూన్ వెన్నను ఆహారంలో చేర్చుకుంటే హృద్రోగ వ్యాధులు దూరమవుతాయని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. 

Monday, October 2, 2017

ప్రపంచ సినిమా రంగంలో "సరికొత్త" సంచలనం ?


2009లో అవతార్ సినిమా తర్వాతనే హాలీవుడ్లో 3డి సినిమాల జోరు పెరిగింది. అయితే ఈ 3డి సినిమాలు చూడాలంటే ప్రత్యేకంగా 3డి గ్లాసులు ధరించాల్సి వస్తుంది. అయితే త్వరలో రాబోతున్న ‘అవతార్' సినిమా సీక్వెల్స్ 3డి గ్లాసుల వాడకం నుండి విముక్తి కలిగించనున్నాయి.





అంటే 3డి గ్లాసులు లేకుండానే మనకు 3డి సినిమా చూసిన అనుభూతిని కలిగించే టెక్నాలజీని ‘అవతార్' సీక్వెల్స్ ద్వారా పరిచయం చేయబోతున్నారు. ఈ టెక్నాలజీ ప్రపంచ సినిమా రంగంలో సరికొత్త సంచలనానికి నాంది అంటున్నారు.